Political News

చంద్రబాబును చిక్కుల్లో పడేసిన సాయిరెడ్డి

నిజమే… వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని భలే ఇరకాటంలో పడేశారు. అసలే కూటమి… ఆపై మూడు పార్టీల నేతలూ అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేళ…కేవలం ఒకే ఒక్క సీటు భర్తీ చేయాల్సి రావడం చంద్రబాబుకు ఇబ్బందే కదా. మరి ఈ ఇబ్బందికరమైన పరిస్తితిని చంద్రబాబు ఎలా నెగ్గుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా ఇట్టే సరిదిద్దే సత్తా కలిగిన చంద్రబాబుకు ఇదేమీ అంత పెద్ద సమస్య కాదులే అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన సాయిరెడ్డి…తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్ లో సాయిరెడ్డి రాజీనాామా చేయడంతో దానిని ధన్ కడ్ అక్కడికక్కడే ఆమోదించక తప్పలేదు. నిబంధనల మేరకు చర్యలు చేపట్టిన ధన్ కడ్.. సాయిరెడ్డి రాజీనాాామాను ఆమోదించారు. దీంతో సాయిరెడ్డి రాజీనాామాతో ఏపీ కోటాలో ఓ రాజ్యసభ సీటును ఖాళీ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది.

రాజ్యసభ సీటు ఖాళీ అయితే దానిని భర్తీ చేయక తప్పదు కదా. త్వరలోనే ఆ సీటును భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుంది. ఈ ప్రకటన మేరకు ఎన్నికల్లో వైసీపీ పాల్గొనే అవకాశాలు లేవనే చెప్పాలి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పాలుపంచుకునే అవకాశం వైసీపీకి లేదు.దీంతో ఈ సీటు కూటమికి దక్కడం ఖాయం. ఏపీ కోటాలోని సీటు కాబట్టి… కూటమి పార్టీలకు నేతృత్వం వహిస్తున్న టీడీపీనే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. వెరసి అభ్యర్థి ఎంపిక బాధ్యత చంద్రబాబుదే.

ఇటీవలే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సమయంలో ఆ మూడు సీట్లను చంద్రబాబే భర్తీ చేశారు. కృష్ణయ్య సీటును బీజేపీకి కేటాయించిన చంద్రబాబు.. బీజేపీ అభ్యర్థన మేరకు కృష్ణయ్యనే ఎంపిక చేశారు. ఇక టీడీపీలో చేరడంతో బీద మస్తాన్ రావు సీటును ఆయనకే ఇచ్చిన చంద్రబాబు… మోపిదేవి సీటును సానా సతీశ్ కు కేటాయించారు. అయితే ఈ సీట్లను దక్కించుకునేందుకు టీడీపీలో చాలా మంది నేతలు యత్నించారు.

ఓ సీటును తమకూ కేటాయించాలని జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కోరారు. అయితే మూడు పార్టీల మధ్య అభిప్రాయబేధాలు రాకుండా చర్యలు చేపట్టిన చంద్రబాబు… జనసేనకు టికెట్ ఇవ్వకుండానే నెట్టుకు రాగలిగారు. రాజ్యసభ సీటుకు బదులుగా పవన్ సోదరుడు నాగేంద్రబాబును రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుందామన్న చంద్రబాబు ప్రతిపాదనతో పవన్ మిన్నకుండిపోయారు. మరి ఇప్పుడు సాయిరెడ్డి రాజీనాామాతో అందివచ్చిన సింగిల్ సీటును చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

This post was last modified on January 27, 2025 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

31 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago