Political News

బాబు విజన్ కు కట్టుబడదాం : మంత్రి మనోహర్

భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కలిగి…పలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు బీమా సొమ్మును అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ అదినేత పవన్ కల్యాణ్ హాజరు కాకున్నా… పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై… బాదిత కుటుంబాలకు పరిహారం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ పార్టీకి క్రియాశీల కార్యకర్తలకే కీలకమని చెప్పారు. పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని తెలిపారు. అలాంటి పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే… వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల పలు ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆయన రూ.5 లక్షల మేర పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం నాదెండ్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు విజన్ కు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. చంద్రబాబు విజన్ కు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కూటమి సర్కారును బలపరిచే బాద్యత కూడా జనసేనపై ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. పదవుల కోసం జరుగుతున్న దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

This post was last modified on January 26, 2025 8:51 pm

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

4 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

5 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

5 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

6 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

8 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

9 hours ago