Political News

బాబు విజన్ కు కట్టుబడదాం : మంత్రి మనోహర్

భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కలిగి…పలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు బీమా సొమ్మును అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ అదినేత పవన్ కల్యాణ్ హాజరు కాకున్నా… పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై… బాదిత కుటుంబాలకు పరిహారం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ పార్టీకి క్రియాశీల కార్యకర్తలకే కీలకమని చెప్పారు. పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు లేకుంటే పార్టీనే లేదని తెలిపారు. అలాంటి పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే… వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల పలు ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆయన రూ.5 లక్షల మేర పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం నాదెండ్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు విజన్ కు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. చంద్రబాబు విజన్ కు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కూటమి సర్కారును బలపరిచే బాద్యత కూడా జనసేనపై ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. పదవుల కోసం జరుగుతున్న దుష్ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

This post was last modified on January 26, 2025 8:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

12 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago