ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో చంద్రబాబుతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాము ఏపీతో కాదు చైనాతో పోటీపడుతున్నామని, ఏపీకి హైదరాబాద్ వంటి నగరం లేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. తాజాగా ఆ కామెంట్లపై సీఎం చంద్రబాబు స్పందించారు.
తెలుగు ప్రజలు, కమ్యూనిటీ కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశానని, అది తెలుగువారందరిదీ అని, కొందరిది కాదని చెప్పారు. తెలుగు జాతి కోసమే హైదరాబాద్ ను క్రియేట్ చేశామని, అలా కాదు, అది కొందరి కోసం అని ఎవరైనా అనుకుంటున్నారేమో తనకు తెలీదని చెప్పారు. హైదరాబాద్ సొసైటీ కోసం అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. తెలుగు జాతి పట్ల గర్విస్తున్నామని, మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని తాను చాలాసార్లు చెప్పానని తెలిపారు.
తెలుగు వారంతా ప్రో యాక్టివ్ గా ఉంటారని, అందుకే ప్రపంచమంతా నంబర్ వన్ గా తెలుగువారు తయారయ్యారని తెలిపారు. తెలుగు పీపుల్ ట్రెండ్ సెట్టర్స్ అని, అందులో తన పాత్ర కూడా కొంత ఉందని చెప్పారు. తెలుగు వారి ఆత్మగౌరవం అని అన్నగారు పిలుపునిచ్చారని, తెలుగు వారి ఆత్మ విశ్వాసం అని తాను చెప్పానని అన్నారు. ఐటీ టెక్నాలజీని తెలుగు ప్రజల చేతుల్లో పెట్టానని, ఈ రోజు ప్రపంచమంతా తెలుగు వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పారు.
This post was last modified on January 26, 2025 10:02 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…