Political News

ఢిల్లీలో చంద్ర‌బాబు.. స‌డ‌న్ విజిట్.. రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట ప‌ట్టారు. గురువారం అర్ధ‌రాత్రి ఆయ‌న ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి ఈ నెల 19న ఆయ‌న స్విట్జ‌ర్లాండ్‌లో ని దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. అయితే.. వాస్త‌వానికి ఈ స‌ద‌స్సు శ‌నివారం వ‌ర‌కు ఉంది. 20న ప్రారంభ‌మైన స‌ద‌స్సు ఐదు రోజుల పాటు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఐదు రోజుల‌కు స‌రిపోయేలా చంద్ర‌బాబు కూడా షెడ్యూల్ వేసుకున్నారు.

ఆయ‌న వెంట మంత్రులు నారా లోకేష్‌, టీజీ భ‌ర‌త్‌లు ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా ఉన్నారు. ఈ ప‌ర్య ట‌న శ‌నివారం రాత్రికి ముగిసి.. ఆదివారం మ‌ధ్యాహ్నానికి ఏపీకి ఈ బృందం చేరుకుంటుంద‌ని ముందుగా విడుద‌ల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అంతా స‌జావుగానే సాగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ను నాలుగు రోజుల‌కే కుదించుకుని గురువారం సాయంత్ర‌మే దావోస్ నుంచి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. అది కూడా ఆయ‌న ఏపీకి రాకుండా.. ఢిల్లీలో ఆగిపోయారు.

దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇక్క‌డి ఏపీ భ‌వ‌న్‌లో బ‌స చేశారు. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌తోనూ భేటీ కానున్న‌ట్టు తెలిసింది. మ‌రో వారంలో కేంద్రం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ ప్రాధాన్యాలు.. ప్రాజెక్టుల‌కు నిధుల కేటాయింపు వంటి అంశాల‌పై నిర్మ‌లా సీతారామన్‌తో చంద్ర‌బాబు అత్య‌వ‌స‌రంగా చ‌ర్చించ‌నున్నార‌ని అధికారులు చెబుతున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టికే కేంద్ర బ‌డ్జెట్‌కు సంబంధించి చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. అయితే.. చివ‌రి నిముషంలో ఏదైనా మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే చంద్ర‌బాబు పోల‌వ‌రం, అమ‌రావ‌తి, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు సంబంధించి నిధుల కేటాయింపుపై చ‌ర్చించేందుకు ఢిల్లీ బాట ప‌ట్టార‌ని అంటున్నారు. అదేవిధంగా పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన డ‌యా ఫ్ర‌మ్ వాల్ నిర్మాణంపైనా చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి దావోస్ ప‌ర్య‌ట‌న‌ను మ‌ధ్య‌లోనే ముగించ‌డం.. కేంద్ర మంత్రితో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

This post was last modified on January 24, 2025 10:13 am

Share

Recent Posts

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

9 minutes ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

23 minutes ago

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…

52 minutes ago

బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…

3 hours ago

లోక‌ల్‌వార్‌లో జ‌న‌సేన కోరిక‌లు బాబు తీర్చేనా..?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జ‌న‌సేన నాయ‌కుల కోరిక‌లకు కూట‌మి పెద్ద టీడీపీ గ్రీన్‌సిగ్న‌ల్…

5 hours ago

మారెమ్మకు మాస్ రాజా ప్రోత్సాహం సరిపోతుందా

స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…

5 hours ago