Political News

ఢిల్లీలో చంద్ర‌బాబు.. స‌డ‌న్ విజిట్.. రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. అనూహ్యంగా ఢిల్లీ బాట ప‌ట్టారు. గురువారం అర్ధ‌రాత్రి ఆయ‌న ఢిల్లీలో దిగిపోయారు. ఈ అనూహ్య ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి ఈ నెల 19న ఆయ‌న స్విట్జ‌ర్లాండ్‌లో ని దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. అయితే.. వాస్త‌వానికి ఈ స‌ద‌స్సు శ‌నివారం వ‌ర‌కు ఉంది. 20న ప్రారంభ‌మైన స‌ద‌స్సు ఐదు రోజుల పాటు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఐదు రోజుల‌కు స‌రిపోయేలా చంద్ర‌బాబు కూడా షెడ్యూల్ వేసుకున్నారు.

ఆయ‌న వెంట మంత్రులు నారా లోకేష్‌, టీజీ భ‌ర‌త్‌లు ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా ఉన్నారు. ఈ ప‌ర్య ట‌న శ‌నివారం రాత్రికి ముగిసి.. ఆదివారం మ‌ధ్యాహ్నానికి ఏపీకి ఈ బృందం చేరుకుంటుంద‌ని ముందుగా విడుద‌ల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అంతా స‌జావుగానే సాగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌ను నాలుగు రోజుల‌కే కుదించుకుని గురువారం సాయంత్ర‌మే దావోస్ నుంచి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. అది కూడా ఆయ‌న ఏపీకి రాకుండా.. ఢిల్లీలో ఆగిపోయారు.

దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇక్క‌డి ఏపీ భ‌వ‌న్‌లో బ‌స చేశారు. శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌తోనూ భేటీ కానున్న‌ట్టు తెలిసింది. మ‌రో వారంలో కేంద్రం 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ ప్రాధాన్యాలు.. ప్రాజెక్టుల‌కు నిధుల కేటాయింపు వంటి అంశాల‌పై నిర్మ‌లా సీతారామన్‌తో చంద్ర‌బాబు అత్య‌వ‌స‌రంగా చ‌ర్చించ‌నున్నార‌ని అధికారులు చెబుతున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టికే కేంద్ర బ‌డ్జెట్‌కు సంబంధించి చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. అయితే.. చివ‌రి నిముషంలో ఏదైనా మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని.. అందుకే చంద్ర‌బాబు పోల‌వ‌రం, అమ‌రావ‌తి, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు సంబంధించి నిధుల కేటాయింపుపై చ‌ర్చించేందుకు ఢిల్లీ బాట ప‌ట్టార‌ని అంటున్నారు. అదేవిధంగా పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన డ‌యా ఫ్ర‌మ్ వాల్ నిర్మాణంపైనా చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. మొత్తానికి దావోస్ ప‌ర్య‌ట‌న‌ను మ‌ధ్య‌లోనే ముగించ‌డం.. కేంద్ర మంత్రితో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

This post was last modified on January 24, 2025 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

4 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

5 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

6 hours ago