Political News

దావోస్ ఎఫెక్ట్‌: గురువును మించిన శిష్యుడు… !

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ పెట్టుబ‌డుల స‌ద‌స్సు(ఆర్థిక స‌ద‌స్సుగా దీనికి పేరు) రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చాలా పోటా పోటీగా సాగుతోంది. ఈ స‌ద‌స్సుకు.. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్ర‌మే హాజ‌రు కాగా.. మ‌హారాష్ట్ర నుంచి సీఎం దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ వ‌చ్చారు. మ‌హారాష్ట్ర ఏకంగా 7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి ల‌క్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇది ఏపీకి పెద్ద‌గా పోటీ కాదు. కానీ, తెలుగు రాష్ట్రాల మ‌ధ్యే పోటీ ఉంది.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఓవ‌ర్ టేక్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇక్క‌డే తేడా కొడుతోంది. ఎందుకంటే.. తొలిసారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. త‌న పేరును పార్టీ ప్ర‌తిష్ట‌ను కూడా నిల‌బెట్టే విధంగా రేవంత్‌రెడ్డి చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగుతున్నారు. గ‌త ఏడాది కూడా 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పెట్టుబ‌డులు ద‌క్కించుకున్నారు. ఈ సారి 5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు టార్గ‌ట్‌ పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు క‌న్నా వేగంగా రేవంత్‌రెడ్డి బృందం పెట్టుబ‌డులు సాధిస్తోంది. గురువారం నాటికి మూడు రోజుల పాటు ముగిసిన స‌ద‌స్సులో ఏపీ కేవ‌లం 10 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు మాత్ర‌మే సాధించింది. ఇత‌ర సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఆహ్వానాలు ఇస్తోంది. కానీ, రేవంత్ రెడ్డి బృందం మాత్రం 56 వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు పెట్టుబ‌డులు ద‌క్కించుకుంది. ప్ర‌ధానంగా స‌న్ పెట్రో కెమిక‌ల్స్ నుంచే 45 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి ఉండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి.. స‌న్ పెట్రో కెమిక‌ల్స్ సంస్థ‌ను చంద్ర‌బాబు తుది జాబితాలో పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. పైగా ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఐటీ పెట్టుబ‌డుల‌పైనే చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. కానీ, తెలంగాణ స‌ర్కారు మాత్రం పారిశ్రామిక రంగ పెట్టుబ‌డుల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ.. ఐటీ పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో వాటికి పోటీ ఎక్కువ‌గా ఉంది. కానీ, పారిశ్రామిక రంగాల విష‌యంలో పోటీ త‌క్కువ‌గా ఉండ‌డంతో ఈ అవ‌కాశాన్ని రేవంత్ రెడ్డి బృందం స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో 45 వేల కోట్ల రూపాయ‌లు ఇందులోనే పెట్టుబ‌డులుగా రానున్నాయి.

Satya

Recent Posts

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

1 minute ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

5 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

13 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

24 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

24 minutes ago

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

36 minutes ago