Political News

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే పోతున్న‌ట్టు కుద‌ర‌దు. ప్ర‌తి విష‌యానికీ ప‌క్కా లెక్క‌లు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గ‌డ‌వ‌గానే చంద్ర‌బాబు మంత్రుల వ్య‌వ‌హార శైలిపై సంతృప్త స్థాయి లెక్క‌లు తీశారు. దీనిని ఇటీవ‌ల ఆయ‌న దావోస్‌కు వెళ్లే ముందు ప్ర‌స్తావించినా.. వాటి వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేదు. దీంతో మంత్రుల్లో టెన్ష‌న్ నెల‌కొంది.

ఇదేమీ ర‌హ‌స్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి త‌మ‌పై ఎలా ఉంద‌న్న విష‌యాన్ని మంత్రులు వ్య‌క్తిగ‌తంగా సీఎంవోను అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో మంత్రులు స‌గం మందికిపైగా బాగానే ప‌నిచేస్తున్న‌ట్టు తెలుసుకుని హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకోవ‌డం గ‌మ‌నార్మం. అన‌గాని స‌త్య ప్ర‌సాద్.. ఈ జాబితాలో ముందున్న‌ట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూక‌బ్జాల‌ను వెలికి తీసి.. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తామ‌న్న భ‌రోసా ఇస్తుండ‌డంతో ఆయ‌నపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌ని తెలిసింది.

ఇక‌, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి ర‌వి కుమార్ ఈ సంతృప్త జాబితాలో నాలుగోస్థానంలో ఉన్నట్టు తెలిసింది. తొలి రెండు మూడు మాసాల్లో ఆయ‌న గ్రాఫ్ తొలి రెండు స్థానాల్లో ఉండ‌గా.. విద్యుత్ చార్జీల పెంపు.. ఇత‌ర చార్జీల పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌తో ఆయ‌న గ్రాఫ్ నాలుగోస్థానానికి ప‌రిమిత‌మైంద‌ని తెలిసింది. ఇక‌, కీల‌క‌మైన హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత 8వ స్థానంలో ఉన్నార‌ని తెలిసింది. ఆమె ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నా.. హోం మంత్రిగా పోలీసుల‌పై ప‌క్కా ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డంతోపాటు.. స్టేష‌న్ల ప‌నితీరులోనూ మార్పు రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై ఉన్న భావ‌న ఏమాత్రం తొలిగిపోక‌పో వ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇక‌, మంత్రి నారా లోకేష్ గ్రాఫ్‌.. 2గా ఉంద‌ని తెలిసింది. వాస్త‌వానికి నారా లోకేష్ స్తానం 1గా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే.. ఇంకా ప‌నితీరు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డం.. పైగా పాఠ‌శాల‌ల విష‌యంలో చేస్తున్న ప్ర‌యోగాలు.. డీఎస్సీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఇంకా ప‌క్కా ప్ర‌క‌ట‌న లేక పోవ‌డం వంటివి ఆయ‌న‌ను రెండో స్థానానికి ప‌రిమితం చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, మంత్రుల జాబితాలో చిట్ట చివ‌రి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నార‌న్న‌ది సీఎంవో వ‌ర్గాలు చెబుతున్న మాట‌. గిరిజ‌న సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోతున్నార‌న్న చ‌ర్చ ఉంది.

This post was last modified on January 23, 2025 7:05 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

57 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago