రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే పోతున్నట్టు కుదరదు. ప్రతి విషయానికీ పక్కా లెక్కలు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గడవగానే చంద్రబాబు మంత్రుల వ్యవహార శైలిపై సంతృప్త స్థాయి లెక్కలు తీశారు. దీనిని ఇటీవల ఆయన దావోస్కు వెళ్లే ముందు ప్రస్తావించినా.. వాటి వివరాలను మాత్రం చెప్పలేదు. దీంతో మంత్రుల్లో టెన్షన్ నెలకొంది.
ఇదేమీ రహస్యం కాకపోవడంతో ప్రజల సంతృప్తి స్థాయి తమపై ఎలా ఉందన్న విషయాన్ని మంత్రులు వ్యక్తిగతంగా సీఎంవోను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిలో మంత్రులు సగం మందికిపైగా బాగానే పనిచేస్తున్నట్టు తెలుసుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం గమనార్మం. అనగాని సత్య ప్రసాద్.. ఈ జాబితాలో ముందున్నట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయన వైసీపీ హయాంలో జరిగిన భూకబ్జాలను వెలికి తీసి.. ప్రజలకు న్యాయం చేస్తామన్న భరోసా ఇస్తుండడంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని తెలిసింది.
ఇక, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్ ఈ సంతృప్త జాబితాలో నాలుగోస్థానంలో ఉన్నట్టు తెలిసింది. తొలి రెండు మూడు మాసాల్లో ఆయన గ్రాఫ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. విద్యుత్ చార్జీల పెంపు.. ఇతర చార్జీల పై ప్రజల్లో నెలకొన్న ఆందోళనతో ఆయన గ్రాఫ్ నాలుగోస్థానానికి పరిమితమైందని తెలిసింది. ఇక, కీలకమైన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత 8వ స్థానంలో ఉన్నారని తెలిసింది. ఆమె పర్యటనలు చేస్తున్నా.. హోం మంత్రిగా పోలీసులపై పక్కా పట్టు సాధించలేక పోవడంతోపాటు.. స్టేషన్ల పనితీరులోనూ మార్పు రాకపోవడంతో ప్రజల్లో పోలీసులపై ఉన్న భావన ఏమాత్రం తొలిగిపోకపో వడమే దీనికి కారణమని అంటున్నారు.
ఇక, మంత్రి నారా లోకేష్ గ్రాఫ్.. 2గా ఉందని తెలిసింది. వాస్తవానికి నారా లోకేష్ స్తానం 1గా ఉంటుందని అందరూ భావించారు. అయితే.. ఇంకా పనితీరు విషయంలో ప్రజలకు సరైన సమాచారం లేకపోవడం.. పైగా పాఠశాలల విషయంలో చేస్తున్న ప్రయోగాలు.. డీఎస్సీ ప్రకటించినప్పటికీ.. ఇంకా పక్కా ప్రకటన లేక పోవడం వంటివి ఆయనను రెండో స్థానానికి పరిమితం చేసినట్టు తెలిసింది. ఇక, మంత్రుల జాబితాలో చిట్ట చివరి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నారన్నది సీఎంవో వర్గాలు చెబుతున్న మాట. గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె పనిచేస్తున్నప్పటికీ.. ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారన్న చర్చ ఉంది.
This post was last modified on January 23, 2025 7:05 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…