Political News

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే పోతున్న‌ట్టు కుద‌ర‌దు. ప్ర‌తి విష‌యానికీ ప‌క్కా లెక్క‌లు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గ‌డ‌వ‌గానే చంద్ర‌బాబు మంత్రుల వ్య‌వ‌హార శైలిపై సంతృప్త స్థాయి లెక్క‌లు తీశారు. దీనిని ఇటీవ‌ల ఆయ‌న దావోస్‌కు వెళ్లే ముందు ప్ర‌స్తావించినా.. వాటి వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేదు. దీంతో మంత్రుల్లో టెన్ష‌న్ నెల‌కొంది.

ఇదేమీ ర‌హ‌స్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి త‌మ‌పై ఎలా ఉంద‌న్న విష‌యాన్ని మంత్రులు వ్య‌క్తిగ‌తంగా సీఎంవోను అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో మంత్రులు స‌గం మందికిపైగా బాగానే ప‌నిచేస్తున్న‌ట్టు తెలుసుకుని హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకోవ‌డం గ‌మ‌నార్మం. అన‌గాని స‌త్య ప్ర‌సాద్.. ఈ జాబితాలో ముందున్న‌ట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూక‌బ్జాల‌ను వెలికి తీసి.. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తామ‌న్న భ‌రోసా ఇస్తుండ‌డంతో ఆయ‌నపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌ని తెలిసింది.

ఇక‌, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి ర‌వి కుమార్ ఈ సంతృప్త జాబితాలో నాలుగోస్థానంలో ఉన్నట్టు తెలిసింది. తొలి రెండు మూడు మాసాల్లో ఆయ‌న గ్రాఫ్ తొలి రెండు స్థానాల్లో ఉండ‌గా.. విద్యుత్ చార్జీల పెంపు.. ఇత‌ర చార్జీల పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌తో ఆయ‌న గ్రాఫ్ నాలుగోస్థానానికి ప‌రిమిత‌మైంద‌ని తెలిసింది. ఇక‌, కీల‌క‌మైన హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత 8వ స్థానంలో ఉన్నార‌ని తెలిసింది. ఆమె ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నా.. హోం మంత్రిగా పోలీసుల‌పై ప‌క్కా ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డంతోపాటు.. స్టేష‌న్ల ప‌నితీరులోనూ మార్పు రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై ఉన్న భావ‌న ఏమాత్రం తొలిగిపోక‌పో వ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇక‌, మంత్రి నారా లోకేష్ గ్రాఫ్‌.. 2గా ఉంద‌ని తెలిసింది. వాస్త‌వానికి నారా లోకేష్ స్తానం 1గా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే.. ఇంకా ప‌నితీరు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డం.. పైగా పాఠ‌శాల‌ల విష‌యంలో చేస్తున్న ప్ర‌యోగాలు.. డీఎస్సీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఇంకా ప‌క్కా ప్ర‌క‌ట‌న లేక పోవ‌డం వంటివి ఆయ‌న‌ను రెండో స్థానానికి ప‌రిమితం చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, మంత్రుల జాబితాలో చిట్ట చివ‌రి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నార‌న్న‌ది సీఎంవో వ‌ర్గాలు చెబుతున్న మాట‌. గిరిజ‌న సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోతున్నార‌న్న చ‌ర్చ ఉంది.

This post was last modified on January 23, 2025 7:05 pm

Share
Show comments

Recent Posts

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

1 hour ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

5 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

7 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

7 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

7 hours ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

7 hours ago