Political News

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే పోతున్న‌ట్టు కుద‌ర‌దు. ప్ర‌తి విష‌యానికీ ప‌క్కా లెక్క‌లు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గ‌డ‌వ‌గానే చంద్ర‌బాబు మంత్రుల వ్య‌వ‌హార శైలిపై సంతృప్త స్థాయి లెక్క‌లు తీశారు. దీనిని ఇటీవ‌ల ఆయ‌న దావోస్‌కు వెళ్లే ముందు ప్ర‌స్తావించినా.. వాటి వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేదు. దీంతో మంత్రుల్లో టెన్ష‌న్ నెల‌కొంది.

ఇదేమీ ర‌హ‌స్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి త‌మ‌పై ఎలా ఉంద‌న్న విష‌యాన్ని మంత్రులు వ్య‌క్తిగ‌తంగా సీఎంవోను అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో మంత్రులు స‌గం మందికిపైగా బాగానే ప‌నిచేస్తున్న‌ట్టు తెలుసుకుని హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకోవ‌డం గ‌మ‌నార్మం. అన‌గాని స‌త్య ప్ర‌సాద్.. ఈ జాబితాలో ముందున్న‌ట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూక‌బ్జాల‌ను వెలికి తీసి.. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తామ‌న్న భ‌రోసా ఇస్తుండ‌డంతో ఆయ‌నపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌ని తెలిసింది.

ఇక‌, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి ర‌వి కుమార్ ఈ సంతృప్త జాబితాలో నాలుగోస్థానంలో ఉన్నట్టు తెలిసింది. తొలి రెండు మూడు మాసాల్లో ఆయ‌న గ్రాఫ్ తొలి రెండు స్థానాల్లో ఉండ‌గా.. విద్యుత్ చార్జీల పెంపు.. ఇత‌ర చార్జీల పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌తో ఆయ‌న గ్రాఫ్ నాలుగోస్థానానికి ప‌రిమిత‌మైంద‌ని తెలిసింది. ఇక‌, కీల‌క‌మైన హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత 8వ స్థానంలో ఉన్నార‌ని తెలిసింది. ఆమె ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నా.. హోం మంత్రిగా పోలీసుల‌పై ప‌క్కా ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డంతోపాటు.. స్టేష‌న్ల ప‌నితీరులోనూ మార్పు రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై ఉన్న భావ‌న ఏమాత్రం తొలిగిపోక‌పో వ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇక‌, మంత్రి నారా లోకేష్ గ్రాఫ్‌.. 2గా ఉంద‌ని తెలిసింది. వాస్త‌వానికి నారా లోకేష్ స్తానం 1గా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే.. ఇంకా ప‌నితీరు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డం.. పైగా పాఠ‌శాల‌ల విష‌యంలో చేస్తున్న ప్ర‌యోగాలు.. డీఎస్సీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఇంకా ప‌క్కా ప్ర‌క‌ట‌న లేక పోవ‌డం వంటివి ఆయ‌న‌ను రెండో స్థానానికి ప‌రిమితం చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, మంత్రుల జాబితాలో చిట్ట చివ‌రి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నార‌న్న‌ది సీఎంవో వ‌ర్గాలు చెబుతున్న మాట‌. గిరిజ‌న సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోతున్నార‌న్న చ‌ర్చ ఉంది.

This post was last modified on January 23, 2025 7:05 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

6 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

6 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

19 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago