Political News

సంతృప్తి గ్రాఫ్‌లో ఈ మంత్రుల‌దే పైచేయ‌ట‌..!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌నిచేసుకుని పోవ‌డం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం ఏదో గుడ్డిగా ప‌నిచేసుకుని పోతున్నామంటే పోతున్న‌ట్టు కుద‌ర‌దు. ప్ర‌తి విష‌యానికీ ప‌క్కా లెక్క‌లు ఉండాల్సిందే. అందుకే.. ఆరు మాసాలు గ‌డ‌వ‌గానే చంద్ర‌బాబు మంత్రుల వ్య‌వ‌హార శైలిపై సంతృప్త స్థాయి లెక్క‌లు తీశారు. దీనిని ఇటీవ‌ల ఆయ‌న దావోస్‌కు వెళ్లే ముందు ప్ర‌స్తావించినా.. వాటి వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేదు. దీంతో మంత్రుల్లో టెన్ష‌న్ నెల‌కొంది.

ఇదేమీ ర‌హ‌స్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి త‌మ‌పై ఎలా ఉంద‌న్న విష‌యాన్ని మంత్రులు వ్య‌క్తిగ‌తంగా సీఎంవోను అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో మంత్రులు స‌గం మందికిపైగా బాగానే ప‌నిచేస్తున్న‌ట్టు తెలుసుకుని హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకోవ‌డం గ‌మ‌నార్మం. అన‌గాని స‌త్య ప్ర‌సాద్.. ఈ జాబితాలో ముందున్న‌ట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయ‌న వైసీపీ హ‌యాంలో జ‌రిగిన భూక‌బ్జాల‌ను వెలికి తీసి.. ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తామ‌న్న భ‌రోసా ఇస్తుండ‌డంతో ఆయ‌నపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌ని తెలిసింది.

ఇక‌, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి ర‌వి కుమార్ ఈ సంతృప్త జాబితాలో నాలుగోస్థానంలో ఉన్నట్టు తెలిసింది. తొలి రెండు మూడు మాసాల్లో ఆయ‌న గ్రాఫ్ తొలి రెండు స్థానాల్లో ఉండ‌గా.. విద్యుత్ చార్జీల పెంపు.. ఇత‌ర చార్జీల పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఆందోళ‌న‌తో ఆయ‌న గ్రాఫ్ నాలుగోస్థానానికి ప‌రిమిత‌మైంద‌ని తెలిసింది. ఇక‌, కీల‌క‌మైన హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత 8వ స్థానంలో ఉన్నార‌ని తెలిసింది. ఆమె ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నా.. హోం మంత్రిగా పోలీసుల‌పై ప‌క్కా ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డంతోపాటు.. స్టేష‌న్ల ప‌నితీరులోనూ మార్పు రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై ఉన్న భావ‌న ఏమాత్రం తొలిగిపోక‌పో వ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇక‌, మంత్రి నారా లోకేష్ గ్రాఫ్‌.. 2గా ఉంద‌ని తెలిసింది. వాస్త‌వానికి నారా లోకేష్ స్తానం 1గా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే.. ఇంకా ప‌నితీరు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డం.. పైగా పాఠ‌శాల‌ల విష‌యంలో చేస్తున్న ప్ర‌యోగాలు.. డీఎస్సీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఇంకా ప‌క్కా ప్ర‌క‌ట‌న లేక పోవ‌డం వంటివి ఆయ‌న‌ను రెండో స్థానానికి ప‌రిమితం చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, మంత్రుల జాబితాలో చిట్ట చివ‌రి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నార‌న్న‌ది సీఎంవో వ‌ర్గాలు చెబుతున్న మాట‌. గిరిజ‌న సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోతున్నార‌న్న చ‌ర్చ ఉంది.

This post was last modified on January 23, 2025 7:05 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

4 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

6 hours ago