జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ పరిస్దితిని గమనించిన వాళ్ళకు ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు (ఎస్సీ) నియోజకవర్గంలో గెలిచిన రాపాక పరిస్దితి ఇపుడు గందరగోళంలో పడిందని సమాచారం. గెలిచిన జనసేన పార్టీని కాదని వైసిపికి దగ్గరైన రాపాకకు ఇపుడు అధికారపార్టీలో ఆదరణ కరువైందట. గెలిచిన దగ్గర నుండి తన వ్యవహారశైలి కారణంగా వైసీపీకి అనుబంద సభ్యునిగానే రాపాక కంటిన్యు అవుతున్నారు. తనకు తాను వైసీపీ ఎంఎల్ఏగానే ప్రకటించేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే కొద్దిరోజులుగా నియోజకవర్గంలో రాపాక పరిస్ధితి తల్లకిందులైందని మద్దతుదారులే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని పనుల కోసం ఎంఎల్ఏ అధికారుల దగ్గరకు వెళ్ళినపుడు ఎవరు పెద్దగా పట్టించుకోవటం లేదట. ఒకపుడు అధికారుల దగ్గర మంచి జోరు కనబరచిన రాపాకకు ప్రస్తుతం చుక్కెదురవుతోందట. హఠాత్తుగా రాపాక పరిస్దితి ఎందుకు ఇలా దిగజారిపోయింది ? ఎందుకంటే మొన్నటి వరకు నియోజకవర్గంలోని వైసీపీ రెండు వర్గాల్లో ఒకటి ఎంఎల్ఏకు మద్దతుగా నిలబడిందట.
నియోజకవర్గంలోని బొంతు రాజేశ్వరరావు, అమ్మాజీల వర్గాలుగా అధికార పార్టీ క్యాడర్ మొత్తం చీలిపోయారు. గెలిచిన తర్వాత ఎంఎల్ఏ జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ అనటంతో అమ్మాజీ వర్గం వెంటనే రాపాకకు మద్దతుగా నిలబడింది. బొంతు వర్గం రాపాకను ఎంతగా వ్యతిరేకించినా అమ్మాజి వర్గం మద్దతుగా నిలవటంతో ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయింది బొంతు వర్గం. అయితే ఈ మధ్య ఏమయ్యిందో ఏమో తెలీదు కానీ అమ్మాజీ వర్గంతో కూడా రాపాకకు చెడిందట. దాంతో అమ్మాజీ వర్గం కూడా ఎంఎల్ఏని దూరం పెట్టేసింది. ఎప్పుడైతే అమ్మాజి వర్గానికి ఎంఎల్ఏకి చెడిందన్న విషయం బయటపడిందో వెంటనే బొంతు వర్గం రాపాక పై రెచ్చిపోవటం మొదలుపెట్టింది.
వైసీపీలోని బలమైన వర్గాన్ని నమ్ముకున్న రాపాక ఇంతకాలం జనసేనలోని నేతలను కూడా దగ్గరకు రానీయలేదు. ఎందుకు రానీయలేదంటే ఎప్పటికైనా తాను వైసీపీలో కలిసిపోవాలన్నదే ఎంఎల్ఏ ఆశ. అందుకనే సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదు. అయితే నమ్ముకున్న వైసీపీలోని బలమైన వర్గంతో చెడటం, అసలే తనపై మంటగా ఉన్న రెండోవర్గం రెచ్చిపోవటానికి తోడు సొంతపార్టీలోని నేతలు కూడా దూరమైపోయారట. అంటే రాపాకకు ఇఫుడు ఏ వర్గంతోను సంబంధాలు లేకుండాపోయాయి.
దాంతో నియోజకవర్గంలో తాను ఒంటరి అయిపోయిన విషయం ఎంఎల్ఏకు అర్ధమైందట. దూరమైన అమ్మాజీ వర్గంతో చేతులు కలపలేక, బొంతు వర్గం దగ్గరకు వెళ్ళలేక అలాగని సొంతవర్గంతో ఆధిపత్యం చెలాయంచలేక రాపాక నానా అవస్తలు పడుతున్నారట. మొత్తానికి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయని చెప్పాలి.
This post was last modified on October 16, 2020 6:17 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…