Political News

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరుకున్న‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వారే.. ఒక‌రు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అయితే.. మ‌రొక‌రు పార్టీ అగ్ర‌నేత‌, పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఇద్ద‌రి మ‌ధ్య గ‌త రెండు మాసాలుగా పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న మాట వాస్త‌వ‌మే.

అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ట్టు స‌మాచారం. దీనికి ప్ర‌ధానంగా నాలుగు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని జాతీయ మీడియా చెబుతోంది. 1) ఇండియా కూట‌మి ప‌టాపంచ‌లు అయ్యే ప‌రిస్థితి రావ‌డం. 2) త‌న‌కు చెప్ప‌కుండానే కీల‌క విష‌యాల్లో రాహుల్ వేలు పెట్ట‌డంపై ఖ‌ర్గే అస‌హ‌నంతో ఉండ‌డం. 3) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిత్ర ప‌క్షం ఆప్‌ను రాహుల్ కార్న‌ర్ చేయ‌డం. 4) ఖ‌ర్గే పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నార‌న్న వాద‌న రాహుల్ కూట‌మిలో ఉండ‌డం.

ఈ నాలుగు కార‌ణాల్లో రెండు రెండు మాసాల నుంచి చ‌ర్చ‌ల్లోనే ఉన్నాయి. అయితే.. తాజాగా డిల్లీ ఎన్నికల విష‌యంలో రాహుల్ త‌న‌కు చెప్ప‌కుండానే ఒంట‌రి పోరుకు ప్ర‌క‌ట‌న చేయ‌డంపై ఖ‌ర్గే ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్నార‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో కొద్దొ గొప్పో సీట్లు తీసుకుని ఆప్‌తో చెలిమి చేయ‌డం ద్వారా.. బీజేపీకి అవ‌కాశం లేకుండా చేయాల‌ని ఖ‌ర్గే వాద‌న‌. అయితే.. ఈ విష‌యంలో పంతానికి పోయిన‌.. రాహుల్‌.. సొంతగానే పోటీకి రెడీ అయ్యారు. కానీ, ప్ర‌స్తుతం ఓటు చీలితే.. అది బీజేపీకి లాభించి కుదిరితే అదికారంలోకి వ‌చ్చినా రావొచ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఈ వ్య‌వ‌హారాన్నే ఖ‌ర్గే త‌ప్పుబ‌డుతున్నారు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం. కూట‌మి పార్టీలను స‌రైన దారిలో న‌డిపించ‌క‌పోవ‌డం. ఈ విష‌యంలో రాహుల‌దే త‌ప్ప‌న్న‌ట్టుగా.. ఖ‌ర్గే, కాదు.. అంతా ఖ‌ర్గేనే చేస్తున్నార‌ని రాహుల్ బృందం చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు ఇండియా కూట‌మి విచ్ఛిన్నం దిశ‌గా అయితే అడుగులు వేస్తోంది. దీనికి కార‌ణంపై మీరంటే మీరంటూ.. ఖ‌ర్గే, రాహుల్ బృందాలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం ఇవేవీ అంత బ‌హిరంగంగా బ‌య‌ట ప‌డ‌డం లేదు. రేపు ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వ‌చ్చే ప‌రిణామాల‌ను విశ్లేషించుకుని ఖ‌ర్గే రిటైర్మెంట్ తీసుకునే అవ‌కాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 22, 2025 2:36 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

5 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

5 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

9 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

9 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

10 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

10 hours ago