Political News

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరుకున్న‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వారే.. ఒక‌రు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అయితే.. మ‌రొక‌రు పార్టీ అగ్ర‌నేత‌, పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఇద్ద‌రి మ‌ధ్య గ‌త రెండు మాసాలుగా పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న మాట వాస్త‌వ‌మే.

అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ట్టు స‌మాచారం. దీనికి ప్ర‌ధానంగా నాలుగు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని జాతీయ మీడియా చెబుతోంది. 1) ఇండియా కూట‌మి ప‌టాపంచ‌లు అయ్యే ప‌రిస్థితి రావ‌డం. 2) త‌న‌కు చెప్ప‌కుండానే కీల‌క విష‌యాల్లో రాహుల్ వేలు పెట్ట‌డంపై ఖ‌ర్గే అస‌హ‌నంతో ఉండ‌డం. 3) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిత్ర ప‌క్షం ఆప్‌ను రాహుల్ కార్న‌ర్ చేయ‌డం. 4) ఖ‌ర్గే పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నార‌న్న వాద‌న రాహుల్ కూట‌మిలో ఉండ‌డం.

ఈ నాలుగు కార‌ణాల్లో రెండు రెండు మాసాల నుంచి చ‌ర్చ‌ల్లోనే ఉన్నాయి. అయితే.. తాజాగా డిల్లీ ఎన్నికల విష‌యంలో రాహుల్ త‌న‌కు చెప్ప‌కుండానే ఒంట‌రి పోరుకు ప్ర‌క‌ట‌న చేయ‌డంపై ఖ‌ర్గే ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్నార‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో కొద్దొ గొప్పో సీట్లు తీసుకుని ఆప్‌తో చెలిమి చేయ‌డం ద్వారా.. బీజేపీకి అవ‌కాశం లేకుండా చేయాల‌ని ఖ‌ర్గే వాద‌న‌. అయితే.. ఈ విష‌యంలో పంతానికి పోయిన‌.. రాహుల్‌.. సొంతగానే పోటీకి రెడీ అయ్యారు. కానీ, ప్ర‌స్తుతం ఓటు చీలితే.. అది బీజేపీకి లాభించి కుదిరితే అదికారంలోకి వ‌చ్చినా రావొచ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఈ వ్య‌వ‌హారాన్నే ఖ‌ర్గే త‌ప్పుబ‌డుతున్నారు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం. కూట‌మి పార్టీలను స‌రైన దారిలో న‌డిపించ‌క‌పోవ‌డం. ఈ విష‌యంలో రాహుల‌దే త‌ప్ప‌న్న‌ట్టుగా.. ఖ‌ర్గే, కాదు.. అంతా ఖ‌ర్గేనే చేస్తున్నార‌ని రాహుల్ బృందం చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు ఇండియా కూట‌మి విచ్ఛిన్నం దిశ‌గా అయితే అడుగులు వేస్తోంది. దీనికి కార‌ణంపై మీరంటే మీరంటూ.. ఖ‌ర్గే, రాహుల్ బృందాలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం ఇవేవీ అంత బ‌హిరంగంగా బ‌య‌ట ప‌డ‌డం లేదు. రేపు ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వ‌చ్చే ప‌రిణామాల‌ను విశ్లేషించుకుని ఖ‌ర్గే రిటైర్మెంట్ తీసుకునే అవ‌కాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 22, 2025 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

3 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

5 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

5 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

8 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

9 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

10 hours ago