Political News

రాహుల్ వ‌ర్సెస్ ఖ‌ర్గే.. కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం!

జాతీయ పురాత‌న పార్టీ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా భారీ క‌ల‌క‌లం రేగిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు కీల‌క నాయకుల మ‌ధ్య వివాదాలు తార‌స్థాయికి చేరుకున్న‌ట్టు జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వారే.. ఒక‌రు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే అయితే.. మ‌రొక‌రు పార్టీ అగ్ర‌నేత‌, పార్ల‌మెంటు లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ. ఇద్ద‌రి మ‌ధ్య గ‌త రెండు మాసాలుగా పొర‌పొచ్చాలు చోటు చేసుకున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న మాట వాస్త‌వ‌మే.

అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్ర‌స్థాయికి చేరుకున్న‌ట్టు స‌మాచారం. దీనికి ప్ర‌ధానంగా నాలుగు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని జాతీయ మీడియా చెబుతోంది. 1) ఇండియా కూట‌మి ప‌టాపంచ‌లు అయ్యే ప‌రిస్థితి రావ‌డం. 2) త‌న‌కు చెప్ప‌కుండానే కీల‌క విష‌యాల్లో రాహుల్ వేలు పెట్ట‌డంపై ఖ‌ర్గే అస‌హ‌నంతో ఉండ‌డం. 3) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మిత్ర ప‌క్షం ఆప్‌ను రాహుల్ కార్న‌ర్ చేయ‌డం. 4) ఖ‌ర్గే పార్టీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నార‌న్న వాద‌న రాహుల్ కూట‌మిలో ఉండ‌డం.

ఈ నాలుగు కార‌ణాల్లో రెండు రెండు మాసాల నుంచి చ‌ర్చ‌ల్లోనే ఉన్నాయి. అయితే.. తాజాగా డిల్లీ ఎన్నికల విష‌యంలో రాహుల్ త‌న‌కు చెప్ప‌కుండానే ఒంట‌రి పోరుకు ప్ర‌క‌ట‌న చేయ‌డంపై ఖ‌ర్గే ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్నార‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు సైతం చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో కొద్దొ గొప్పో సీట్లు తీసుకుని ఆప్‌తో చెలిమి చేయ‌డం ద్వారా.. బీజేపీకి అవ‌కాశం లేకుండా చేయాల‌ని ఖ‌ర్గే వాద‌న‌. అయితే.. ఈ విష‌యంలో పంతానికి పోయిన‌.. రాహుల్‌.. సొంతగానే పోటీకి రెడీ అయ్యారు. కానీ, ప్ర‌స్తుతం ఓటు చీలితే.. అది బీజేపీకి లాభించి కుదిరితే అదికారంలోకి వ‌చ్చినా రావొచ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఈ వ్య‌వ‌హారాన్నే ఖ‌ర్గే త‌ప్పుబ‌డుతున్నారు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం. కూట‌మి పార్టీలను స‌రైన దారిలో న‌డిపించ‌క‌పోవ‌డం. ఈ విష‌యంలో రాహుల‌దే త‌ప్ప‌న్న‌ట్టుగా.. ఖ‌ర్గే, కాదు.. అంతా ఖ‌ర్గేనే చేస్తున్నార‌ని రాహుల్ బృందం చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు ఇండియా కూట‌మి విచ్ఛిన్నం దిశ‌గా అయితే అడుగులు వేస్తోంది. దీనికి కార‌ణంపై మీరంటే మీరంటూ.. ఖ‌ర్గే, రాహుల్ బృందాలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం ఇవేవీ అంత బ‌హిరంగంగా బ‌య‌ట ప‌డ‌డం లేదు. రేపు ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వ‌చ్చే ప‌రిణామాల‌ను విశ్లేషించుకుని ఖ‌ర్గే రిటైర్మెంట్ తీసుకునే అవ‌కాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 22, 2025 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago