జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వారే.. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే.. మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంటు లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత రెండు మాసాలుగా పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే.
అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. 1) ఇండియా కూటమి పటాపంచలు అయ్యే పరిస్థితి రావడం. 2) తనకు చెప్పకుండానే కీలక విషయాల్లో రాహుల్ వేలు పెట్టడంపై ఖర్గే అసహనంతో ఉండడం. 3) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షం ఆప్ను రాహుల్ కార్నర్ చేయడం. 4) ఖర్గే పార్టీని ముందుకు నడిపించలేక పోతున్నారన్న వాదన రాహుల్ కూటమిలో ఉండడం.
ఈ నాలుగు కారణాల్లో రెండు రెండు మాసాల నుంచి చర్చల్లోనే ఉన్నాయి. అయితే.. తాజాగా డిల్లీ ఎన్నికల విషయంలో రాహుల్ తనకు చెప్పకుండానే ఒంటరి పోరుకు ప్రకటన చేయడంపై ఖర్గే ఆవేదనతో రగిలిపోతున్నారన్నది పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో కొద్దొ గొప్పో సీట్లు తీసుకుని ఆప్తో చెలిమి చేయడం ద్వారా.. బీజేపీకి అవకాశం లేకుండా చేయాలని ఖర్గే వాదన. అయితే.. ఈ విషయంలో పంతానికి పోయిన.. రాహుల్.. సొంతగానే పోటీకి రెడీ అయ్యారు. కానీ, ప్రస్తుతం ఓటు చీలితే.. అది బీజేపీకి లాభించి కుదిరితే అదికారంలోకి వచ్చినా రావొచ్చన్న చర్చ సాగుతోంది.
ఈ వ్యవహారాన్నే ఖర్గే తప్పుబడుతున్నారు. ఇక, మరో కీలక విషయం. కూటమి పార్టీలను సరైన దారిలో నడిపించకపోవడం. ఈ విషయంలో రాహులదే తప్పన్నట్టుగా.. ఖర్గే, కాదు.. అంతా ఖర్గేనే చేస్తున్నారని రాహుల్ బృందం చెబుతున్నాయి. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా అయితే అడుగులు వేస్తోంది. దీనికి కారణంపై మీరంటే మీరంటూ.. ఖర్గే, రాహుల్ బృందాలు విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే.. ప్రస్తుతం ఇవేవీ అంత బహిరంగంగా బయట పడడం లేదు. రేపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. వచ్చే పరిణామాలను విశ్లేషించుకుని ఖర్గే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియా వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on January 22, 2025 2:36 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…