Political News

‘గాజు గ్లాసు’ ఇకపై జనసేనది మాత్రమే!

ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా పార్టీల్లో గుర్తంపు పొందిన పార్టీగా జనసేనను ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా .జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు ఇకపై ఆ పార్టీకి మాత్రమే చెందుతుందని కూడా తెలిపింది. ఈ మేరకు జనసేనకు గుర్తింపు పార్టీ హోదాను ఇస్తున్నట్లుగా ప్రకటించింది.

దేశంలోని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం వివిధ కేటగిరీలుగా విభజించి గుర్తిస్తుంది. ప్రస్తుతం జనసేన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీగానే కొనసాగుతోంది. గుర్తింపు కలిగిన పార్టీగా జనసేన లేదు. ఇదంతా ఆయా పార్టీలకు ఎన్నికల్లో వచ్చిన సీట్లు, దక్కిన ఓట్ల శాతం ఆధారంగా ఈ విభజన ఉంటుంది.

ఈ లెక్కన మొన్నటి ఎన్నికల దాకా జనసేనకు ఓ మోస్తరుగా ఓల్ల శాతం దక్కినా..వచ్చిన సీట్ల సంఖ్య కేవలం ఒక్కటే. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల దాకా జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే ఉండిపోయిది.

అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏకంగా 22 ఎమ్మెల్యే సీట్లతో పాటుగా 2 ఎంపీ సీట్లను కూడా గెలిచింది. అంతేకాకుండా పోటీ చేసిన అన్ని సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ అన్న మాట.

ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం… ఈ దఫా జనసేనకు దక్కిన సీట్లను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీని గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలోకి చేర్చింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం మంగళవారం జనసేనకు ఓ లేఖ ద్వారా తెలిపింది.

కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలకు కేటాయించిన గుర్తులు.. ఇతరులకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులకు కేటాయిచిన గాజు గ్లాసు గుర్తును కొన్ని ప్రాంతాల్లో… జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఇతరులకు కేటాయించింది.

అయితే తాజాగా దక్కిన గుర్తింపు కలిగిన పార్టీ హోదా కారణంగా…ఇకపై జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇకపై ఇతరులకు కేటాయించరు. జనసేన పోటీలో లేకున్నా కూడా ఆ గుర్తును ఇతరులకు కేటాయిచరన్న మాట.

This post was last modified on January 21, 2025 10:04 pm

Share

Recent Posts

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

3 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

5 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

5 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

6 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

7 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

9 hours ago