ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా పార్టీల్లో గుర్తంపు పొందిన పార్టీగా జనసేనను ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా .జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు ఇకపై ఆ పార్టీకి మాత్రమే చెందుతుందని కూడా తెలిపింది. ఈ మేరకు జనసేనకు గుర్తింపు పార్టీ హోదాను ఇస్తున్నట్లుగా ప్రకటించింది.
దేశంలోని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం వివిధ కేటగిరీలుగా విభజించి గుర్తిస్తుంది. ప్రస్తుతం జనసేన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీగానే కొనసాగుతోంది. గుర్తింపు కలిగిన పార్టీగా జనసేన లేదు. ఇదంతా ఆయా పార్టీలకు ఎన్నికల్లో వచ్చిన సీట్లు, దక్కిన ఓట్ల శాతం ఆధారంగా ఈ విభజన ఉంటుంది.
ఈ లెక్కన మొన్నటి ఎన్నికల దాకా జనసేనకు ఓ మోస్తరుగా ఓల్ల శాతం దక్కినా..వచ్చిన సీట్ల సంఖ్య కేవలం ఒక్కటే. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల దాకా జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే ఉండిపోయిది.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏకంగా 22 ఎమ్మెల్యే సీట్లతో పాటుగా 2 ఎంపీ సీట్లను కూడా గెలిచింది. అంతేకాకుండా పోటీ చేసిన అన్ని సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ అన్న మాట.
ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం… ఈ దఫా జనసేనకు దక్కిన సీట్లను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీని గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలోకి చేర్చింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం మంగళవారం జనసేనకు ఓ లేఖ ద్వారా తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలకు కేటాయించిన గుర్తులు.. ఇతరులకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులకు కేటాయిచిన గాజు గ్లాసు గుర్తును కొన్ని ప్రాంతాల్లో… జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఇతరులకు కేటాయించింది.
అయితే తాజాగా దక్కిన గుర్తింపు కలిగిన పార్టీ హోదా కారణంగా…ఇకపై జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇకపై ఇతరులకు కేటాయించరు. జనసేన పోటీలో లేకున్నా కూడా ఆ గుర్తును ఇతరులకు కేటాయిచరన్న మాట.
This post was last modified on January 21, 2025 10:04 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…