ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా పార్టీల్లో గుర్తంపు పొందిన పార్టీగా జనసేనను ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా .జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు ఇకపై ఆ పార్టీకి మాత్రమే చెందుతుందని కూడా తెలిపింది. ఈ మేరకు జనసేనకు గుర్తింపు పార్టీ హోదాను ఇస్తున్నట్లుగా ప్రకటించింది.
దేశంలోని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం వివిధ కేటగిరీలుగా విభజించి గుర్తిస్తుంది. ప్రస్తుతం జనసేన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీగానే కొనసాగుతోంది. గుర్తింపు కలిగిన పార్టీగా జనసేన లేదు. ఇదంతా ఆయా పార్టీలకు ఎన్నికల్లో వచ్చిన సీట్లు, దక్కిన ఓట్ల శాతం ఆధారంగా ఈ విభజన ఉంటుంది.
ఈ లెక్కన మొన్నటి ఎన్నికల దాకా జనసేనకు ఓ మోస్తరుగా ఓల్ల శాతం దక్కినా..వచ్చిన సీట్ల సంఖ్య కేవలం ఒక్కటే. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల దాకా జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే ఉండిపోయిది.
అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఏకంగా 22 ఎమ్మెల్యే సీట్లతో పాటుగా 2 ఎంపీ సీట్లను కూడా గెలిచింది. అంతేకాకుండా పోటీ చేసిన అన్ని సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే వంద శాతం స్ట్రైక్ రేట్ అన్న మాట.
ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం… ఈ దఫా జనసేనకు దక్కిన సీట్లను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీని గుర్తింపు కలిగిన పార్టీల జాబితాలోకి చేర్చింది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం మంగళవారం జనసేనకు ఓ లేఖ ద్వారా తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలకు కేటాయించిన గుర్తులు.. ఇతరులకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులకు కేటాయిచిన గాజు గ్లాసు గుర్తును కొన్ని ప్రాంతాల్లో… జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఇతరులకు కేటాయించింది.
అయితే తాజాగా దక్కిన గుర్తింపు కలిగిన పార్టీ హోదా కారణంగా…ఇకపై జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇకపై ఇతరులకు కేటాయించరు. జనసేన పోటీలో లేకున్నా కూడా ఆ గుర్తును ఇతరులకు కేటాయిచరన్న మాట.
This post was last modified on January 21, 2025 10:04 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…