Political News

తిరుపతిలో పోటికి సై అంటున్న టీడీపీ

నిన్నా మొన్నటి వరకు ఎన్నికల్లో పోటి చేసే విషయంపైనే ముఖం చాటేసిన సీనియర్ నేతలు తాజాగా పోటికి సై అంటున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పార్టీ పోటి చేస్తుందని ప్రకటించారు. మాజీమంత్రి ప్రకటనతో సీనియర్ నేతలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సోమిరెడ్డి ప్రకటనను తిరుపతిలోని సీనియర్ నేతలెవరు ఏమాత్రం ఊహించలేదని సమాచారం.

తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంతో అకాస్మాత్తుగా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆరుమాసాల్లోపు ఉపఎన్నికలు జరగుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్ధానం నుండి పోటి చేయటానికి ప్రతిపక్షాల్లో ఏవి కూడా సిద్ధంగా లేవు. కాకపోతే ప్రకటించాలి కాబట్టి ఉపఎన్నికల్లో పోటీకి బీజేపి రెడీ అంటూ కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమధ్య ప్రకటించేశారు. ఇదే విషయమై ఇంతవరకు జనసేన ఏమీ మాట్లాడలేదు. ఇక కాంగ్రెస్, వామపక్షాలు పరిస్ధితి గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీలేదు.

ఇదే సమయంలో టీడీపీ అధిష్టానానికి చాలా ఆసక్తి ఉన్నా స్థానిక నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే ఉప ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంటాయి. నిజానికి పార్టీ తరపున పోటి చేసేంత గట్టి నేతలు కూడా ఎవరూ లేరనే చెప్పాలి. ఈ కారణం వల్లే బీజేపీ పోటి చేస్తే తమ పార్టీ మద్దతిస్తుందని చంద్రబాబు కమలంపార్టీకి రాయబారం పంపారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

అయితే వైసీపీ తరపున బల్లి కుటుంబసభ్యుల్లోనే ఎవరైనా పోటీకి దింపుతారా ? లేకపోతే కొత్త నేతను రంగంలోకి దింపుతారా అన్నది తేలలేదు. బీజేపీ తరపున పోటీ చేయబోయే నేతల్లో ఎక్కువగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక టీడీపీ తరపున ఇప్పటికే చాలామందిని అభ్యర్ధులుగా ప్రయోగం చేసేసున్నారు. ఎలాగంటే ప్రతి ఎన్నికలోను ఓ కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపటంతో పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. అయితే చంద్రబాబునాయుడు సొంతజిల్లా కాబట్టి ఎవరినో ఒకరిని పోటికి దింపకపోతే పరువు సమస్య.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే సోమిరెడ్డి టీడీపీ పోటి చేస్తుందని ప్రకటించినట్లుంది. అంటే అభ్యర్ధి తేలకపోయినా పోటికి మాత్రం తెలుగుదేశంపార్టీ రెడీ అయిపోయిందన్నమాట. కాంగ్రెస్ నుండి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మళ్ళీ పోటిలో ఉండే అవకాశాలే ఎక్కువున్నాయి. కాబట్టి పోటి ఎలా జరుగుతుందో చూడాల్సిందే. అభ్యర్థిని బట్టి సమీకరణాలు మారే అవకావం లేకపోలేదు.

This post was last modified on October 16, 2020 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago