టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదాన్ని బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీ లత అంత ఈజీగా ముగించేందుకు ససేమిరా అంటున్నారు. ఈ వివాదంలో జేసీ ఇప్పటికే సారీ చెప్పినా… ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి ఆపై సారీ అంటే సరిపోతుందా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేసిన మాధవీ లత… తాజాగా మంగళవారం నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరారు.
ఈ న్యూ ఇయర్ నాడు తాడిపత్రిలో మహిళలకు మాత్రమే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశానన్న జేసీ… మహిళలంతా అక్కడికి రావాలంటూ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూసినంతనే మాధవీ తల ఫైరైపోయారు. జేసీ కార్యక్రమానికి మహిళలు ఎవ్వరూ వెళ్లొద్దంటూ ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అంతేకాకుండా జేసీ ఎంపిక చేసిన ప్రదేశం ఆకతాయిలకు అడ్డా అని… అక్కడ మహిళలకు భద్రత ఉండదని కూడా చెప్పారు. మాధవీ లత వీడియోపై జేసీ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
నేరుగా మాధవీ లత కేరెక్టర్ నే టార్గెట్ చేసిన జేసీ… ఆమెను ఓ వ్యభిచారిణిగా అభివర్ణించారు. ఓ సినిమా షూటింగ్ కోసం తాడిపత్రి వచ్చిన మాధవీ లత.. ఎలాంటి నిర్వాకాలు చేసిందో అందరికీ తెలుసునని కూడా ఆయన అన్నారు. మాధవీ లత లాంటి వారు కూడా తాడిపత్రి కల్చర్ గురించి మాట్లాడితే సహించేది లేదని కూడా ఆయన ఫైరయ్యారు. ఏమైందో తెలియదు గానీ… ఆ తర్వాత జేసీనే తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. మాధవీ లతపై తాను అలా మాట్లాడాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనది తప్పేనని, అందుకు తాను సారీ చెబుతున్నానని జేసీ చెప్పారు.
జేసీ సారీ చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మాధవీ లత బోరుమని విలపించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నా.. ఇటీవలే ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళశారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసిన మాధవీ లత.. జేసీపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. .జేసీ వ్యాఖ్యలతో తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా బూతులు మాట్టాడేసి… ఆపై సారీ చెబితే సరిపోతుందా? అంటూ ఆమె లాజిక్ తీశారు. తనను అసభ్యకర పదజాలంతో దూషించిన జేసీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. మరి మాధవీ లత ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on January 21, 2025 3:22 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…