స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ వారిని ఆహ్వానించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అవలంబిస్తోందని తెలిపారు. ఏపీలో పెట్టుబుడులు పెట్టేందుకు అనుకూలా వాతావరణం కల్పిస్తున్నామని, అనుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ, నౌకాశ్రయాలు, తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు ఉన్నాయని చెప్పారు.
ఇక, తమ కుటుంబానికి, తమ జీవితంలో, టీడీపీ నేతల జీవితంలో చంద్రబాబు అరెస్టు లోయెస్ట్ పాయింట్ అని లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, జైల్లో ఉన్నపుడు చంద్రబాబు అధైర్య పడలేదని, బయటకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సింహంలా వచ్చారని లోకేశ్ అన్నారు. ఆ సమయంలో దేశవిదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పారు. రాజకీయాలైనా..వ్యాపారాలైనా..ఎన్నో ఇబ్బందులు పడతామని, కానీ, తమ ఆశయం కోసం ముందుకు వెళితే ఫలితాలు వస్తాయని అన్నారు.
2019-24 నుంచి ఏపీ పరువు పోయిందని చాలామంది తనకు చెప్పారని, కలిసికట్టుగా పోరాడి సైకో పాలనను అంతం చేసి సైకోను తరిమికొట్టామని చెప్పారు. రెడ్ బుక్ గురించి ఓ ఎన్నారై మిత్రుడు తనను అడిగారని, ఆల్రెడీ రెడ్ బుక్ ఓపెన్ చేశామని, దానిని పూర్తి చేసే బాధ్యత కూడా తనదేనని లోకేశ్ చెప్పారు. అయితే, కక్ష్యా రాజకీయల కోసం రెడ్ బుక్ వాడడం లేదని, చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష విధిస్తామని చెప్పారు. జోహార్ అన్న ఎన్టీఆర్…చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ తన ప్రసంగాన్ని లోకేశ్ ముగించారు.
This post was last modified on January 20, 2025 8:31 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…