Political News

సైకోను తరిమేశాం ఏపీకి రండి..పారిశ్రామికవేత్తలతో లోకేశ్

స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ వారిని ఆహ్వానించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అవలంబిస్తోందని తెలిపారు. ఏపీలో పెట్టుబుడులు పెట్టేందుకు అనుకూలా వాతావరణం కల్పిస్తున్నామని, అనుకూల పరిస్థితులున్నాయని చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ, నౌకాశ్రయాలు, తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు ఉన్నాయని చెప్పారు.

ఇక, తమ కుటుంబానికి, తమ జీవితంలో, టీడీపీ నేతల జీవితంలో చంద్రబాబు అరెస్టు లోయెస్ట్ పాయింట్ అని లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, జైల్లో ఉన్నపుడు చంద్రబాబు అధైర్య పడలేదని, బయటకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సింహంలా వచ్చారని లోకేశ్ అన్నారు. ఆ సమయంలో దేశవిదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబుకు అండగా నిలిచారని చెప్పారు. రాజకీయాలైనా..వ్యాపారాలైనా..ఎన్నో ఇబ్బందులు పడతామని, కానీ, తమ ఆశయం కోసం ముందుకు వెళితే ఫలితాలు వస్తాయని అన్నారు.

2019-24 నుంచి ఏపీ పరువు పోయిందని చాలామంది తనకు చెప్పారని, కలిసికట్టుగా పోరాడి సైకో పాలనను అంతం చేసి సైకోను తరిమికొట్టామని చెప్పారు. రెడ్ బుక్ గురించి ఓ ఎన్నారై మిత్రుడు తనను అడిగారని, ఆల్రెడీ రెడ్ బుక్ ఓపెన్ చేశామని, దానిని పూర్తి చేసే బాధ్యత కూడా తనదేనని లోకేశ్ చెప్పారు. అయితే, కక్ష్యా రాజకీయల కోసం రెడ్ బుక్ వాడడం లేదని, చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష విధిస్తామని చెప్పారు. జోహార్ అన్న ఎన్టీఆర్…చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ తన ప్రసంగాన్ని లోకేశ్ ముగించారు.

This post was last modified on January 20, 2025 8:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago