పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో గులాబీ దళపతి కేసీఆర్ చేయలేని పనిని… తెలంగాణ సీఎంగా పరిష్కరించే అవకాశం రేవంత్ సొంతం చేసుకున్నారు. న్యూ ఇయర్ కానుక అన్నట్లుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందనే సూచనను ఇచ్చింది.
తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంతో భేషజాలు ఉండవని పలుమార్లు స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఢిల్లీలో మూడు రోజుల పాటు బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ కీలక అంశాలపై ప్రతిపాదనలు అందించారు. పలు సమస్యల పరిష్కారాలు కోరారు. తాజాగా ఈ పర్యటన ఫలితం కనిపిస్తోందని సమాచారం. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణలో పెండింగులో ఉన్న 161 ప్రాజెక్టుల విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం వచ్చి వినతిపత్రం ఇవ్వడంతో కేంద్ర మంత్రి స్పందించి అధికారులకు పరిష్కార మార్గాలకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. దీంతో డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ కేంద్ర ప్రభుత్వం తరఫున రంగంలోకి దిగారు.
అటవీశాఖ అనుమతులు పెండింగులో ఉండడం వల్ల తెలంగాణలో ఆగిపోయిన ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్రమంత్రి ఆదేశంతో డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ హైదరాబాద్ విచ్చేశారు. ఉదయం 10 గంటలకు అరణ్య భవన్లో తన నాయకత్వంలోని కేంద్ర బృందంతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఏ అంశాలలో సమస్యలు ఏర్పడి ప్రాజెక్టులు పెండింగ్లో పడ్డాయి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో కీలక ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని సమాచారం.
కాగా, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని అంటున్నారు. గత పదేండ్లు కేంద్రంతో పేచీలు పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధమై ఇటీవలే కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ విషయంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ వల్లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చారని, ఈ మేరకు సమస్యకు పరిష్కారాలు లభించనున్నాయని పేర్కొంటున్నారు.
This post was last modified on January 18, 2025 12:37 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…