Political News

కేసీఆర్ చేయ‌లేనిది చేసి చూపించిన రేవంత్

పెట్టుబ‌డుల వేట‌లో భాగంగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సొంత గ‌డ్డ నుంచి తీపి క‌బురు అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేయ‌లేని ప‌నిని… తెలంగాణ సీఎంగా ప‌రిష్క‌రించే అవ‌కాశం రేవంత్ సొంతం చేసుకున్నారు. న్యూ ఇయ‌ర్ కానుక అన్న‌ట్లుగా, ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ అంశాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఇటీవ‌లి ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయింద‌నే సూచ‌న‌ను ఇచ్చింది.

తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంతో భేషజాలు ఉండవని పలుమార్లు స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఢిల్లీలో మూడు రోజుల పాటు బిజీబిజీగా గ‌డిపిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసి వివిధ కీల‌క అంశాల‌పై ప్ర‌తిపాద‌న‌లు అందించారు. ప‌లు స‌మ‌స్య‌ల పరిష్కారాలు కోరారు. తాజాగా ఈ ప‌ర్య‌ట‌న ఫ‌లితం క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణలో పెండింగులో ఉన్న 161 ప్రాజెక్టుల విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం వచ్చి వినతిపత్రం ఇవ్వడంతో కేంద్ర మంత్రి స్పందించి అధికారుల‌కు ప‌రిష్కార మార్గాల‌కు సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. దీంతో డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రంగంలోకి దిగారు.

అటవీశాఖ అనుమతులు పెండింగులో ఉండడం వల్ల తెలంగాణలో ఆగిపోయిన ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్రమంత్రి ఆదేశంతో డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ హైద‌రాబాద్‌ విచ్చేశారు. ఉదయం 10 గంటలకు అరణ్య భవన్లో త‌న నాయ‌క‌త్వంలోని కేంద్ర బృందంతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏఏ అంశాల‌లో స‌మ‌స్య‌లు ఏర్ప‌డి ప్రాజెక్టులు పెండింగ్లో ప‌డ్డాయి, వాటిని ప‌రిష్క‌రించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి నిర్ణ‌యాలు వెలువ‌డ‌నున్నాయి. దీంతో కీల‌క ప్రాజెక్టుల‌కు మోక్షం క‌లుగుతుంద‌ని స‌మాచారం.

కాగా, ఈ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌క్సెస్ అయ్యార‌ని అంటున్నారు. గత పదేండ్లు కేంద్రంతో పేచీలు పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సహకరించలేద‌ని ఆరోపిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధ‌మై ఇటీవలే కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయిన సీఎం రేవంత్ ఈ విష‌యంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారుల త‌ర‌ఫున పూర్తి స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ వల్లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చార‌ని, ఈ మేర‌కు స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు ల‌భించ‌నున్నాయ‌ని పేర్కొంటున్నారు.

This post was last modified on January 18, 2025 12:37 pm

Share

Recent Posts

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

11 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

13 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

14 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

17 hours ago