Political News

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భార‌త సైన్యం మృతి…

దాదాపు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగానే జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్ర‌పంచ‌శాంతిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధాన్ని ఇత‌ర ప్ర‌పంచ దేశాలు ఎలా తీసుకున్నా.. భార‌త్ మాత్రం త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు పేర్కొంది. దీంతో స‌హ‌జంగానే భార‌త్ ఇరు దేశాల‌కు దూరం పాటిస్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ర‌ష్యాకు అనుకూలంగా భార‌త్ త‌న సైన్యాన్ని పంపిన విష‌యం ఇటీవ‌ల వెలుగు చూసింది. మొత్తం 126 మంది సైనికుల‌ను భార‌త్ ర‌ష్యా త‌ర‌ఫున ఉక్రెయిన్‌పై పోరాడేందుకు పంపిన‌ట్టు తాజాగా భార‌త విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.

ఈ 126 మందిలో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది మృతి చెందారు. మ‌రో 96 మంది భారత సైనికులు యుద్ధం చేయ‌లేమంటూ.. వెనుదిరిగారు. అయితే.. వీరిలో కేవ‌లం 22 మంది మాత్ర‌మే భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. మిగిలిన వారు ఎక్క‌డున్నారో తెలియ‌దు. ఇదిలావుంటే.. మ‌రో 16 మంది సైనికులు గ‌ల్లంత‌య్యారు.

అస‌లు వీరి జాడ క‌నిపెట్ట‌డం కూడా అసాధ్యంగా మారింది. ఇటు భార‌త్కు, అటు ర‌ష్యాకు కూడా.. ఈ 16 మంది ఎక్క‌డున్నారో తెలియ‌డం లేద‌ని విదేశాంగ శాఖ వివ‌రించింది. అయితే.. వీరు ప్రాణాల‌తోనే ఉన్నార‌ని విశ్వ‌సిస్తున్న‌ట్టు తెలిపింది. ఇదిలావుంటే.. మ‌రో 18 మంది ప్ర‌స్తుతం ర‌ష్యా త‌ర‌ఫున పోరాడుతున్నారు.

వారు ఏమ‌య్యారు?

భార‌త్‌-ర‌ష్యా సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో మొత్తం 16 మంది భార‌త సైనికులు గ‌ల్లంతు కావ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. వీరు జీవించి ఉన్నార‌ని చెబుతున్నా.. జాడ గుర్తించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో వీరిని ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తిస్తున్న దేశాలు ఎత్తుకెళ్లాయా? లేక‌.. వీరిని ఉక్రెయిన్ దేశ‌మే నిర్బంధించిందా? అనే అనేక సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

మ‌రోవైపు ఈ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల మృత‌దేహాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 5 మృత‌దేహాల‌ను మాత్ర‌మే గుర్తించారు. మిగిలిన 7 మృత దేహాల ప‌రిస్థితిని కూడా అన్వేషిస్తున్నారు. వీరి డీఎన్ ఏ ఆధారంగా విచార‌ణ సాగుతున్న‌ట్టు భార‌త విదేశాంగ శాఖ వివ‌రించింది.

This post was last modified on January 17, 2025 8:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

27 minutes ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

1 hour ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

3 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

7 hours ago

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…

7 hours ago

స్పెషల్ సాంగ్ కోసం ‘పెద్ది’ తిప్పలు

ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…

10 hours ago