Political News

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భార‌త సైన్యం మృతి…

దాదాపు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగానే జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్ర‌పంచ‌శాంతిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధాన్ని ఇత‌ర ప్ర‌పంచ దేశాలు ఎలా తీసుకున్నా.. భార‌త్ మాత్రం త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు పేర్కొంది. దీంతో స‌హ‌జంగానే భార‌త్ ఇరు దేశాల‌కు దూరం పాటిస్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ, ర‌ష్యాకు అనుకూలంగా భార‌త్ త‌న సైన్యాన్ని పంపిన విష‌యం ఇటీవ‌ల వెలుగు చూసింది. మొత్తం 126 మంది సైనికుల‌ను భార‌త్ ర‌ష్యా త‌ర‌ఫున ఉక్రెయిన్‌పై పోరాడేందుకు పంపిన‌ట్టు తాజాగా భార‌త విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.

ఈ 126 మందిలో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది మృతి చెందారు. మ‌రో 96 మంది భారత సైనికులు యుద్ధం చేయ‌లేమంటూ.. వెనుదిరిగారు. అయితే.. వీరిలో కేవ‌లం 22 మంది మాత్ర‌మే భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. మిగిలిన వారు ఎక్క‌డున్నారో తెలియ‌దు. ఇదిలావుంటే.. మ‌రో 16 మంది సైనికులు గ‌ల్లంత‌య్యారు.

అస‌లు వీరి జాడ క‌నిపెట్ట‌డం కూడా అసాధ్యంగా మారింది. ఇటు భార‌త్కు, అటు ర‌ష్యాకు కూడా.. ఈ 16 మంది ఎక్క‌డున్నారో తెలియ‌డం లేద‌ని విదేశాంగ శాఖ వివ‌రించింది. అయితే.. వీరు ప్రాణాల‌తోనే ఉన్నార‌ని విశ్వ‌సిస్తున్న‌ట్టు తెలిపింది. ఇదిలావుంటే.. మ‌రో 18 మంది ప్ర‌స్తుతం ర‌ష్యా త‌ర‌ఫున పోరాడుతున్నారు.

వారు ఏమ‌య్యారు?

భార‌త్‌-ర‌ష్యా సంయుక్త ప్ర‌క‌ట‌న‌లో మొత్తం 16 మంది భార‌త సైనికులు గ‌ల్లంతు కావ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. వీరు జీవించి ఉన్నార‌ని చెబుతున్నా.. జాడ గుర్తించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో వీరిని ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తిస్తున్న దేశాలు ఎత్తుకెళ్లాయా? లేక‌.. వీరిని ఉక్రెయిన్ దేశ‌మే నిర్బంధించిందా? అనే అనేక సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

మ‌రోవైపు ఈ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల మృత‌దేహాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 5 మృత‌దేహాల‌ను మాత్ర‌మే గుర్తించారు. మిగిలిన 7 మృత దేహాల ప‌రిస్థితిని కూడా అన్వేషిస్తున్నారు. వీరి డీఎన్ ఏ ఆధారంగా విచార‌ణ సాగుతున్న‌ట్టు భార‌త విదేశాంగ శాఖ వివ‌రించింది.

This post was last modified on January 17, 2025 8:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

5 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

32 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

2 hours ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago