ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు అయిపోయింది. జనవరి 12వ తేదీకి కూటమి సర్కారుకు ఏడు మాసాలు నిండాయి. ఏడు మాసాల కాలంలో అనేక ఇబ్బందులు.. సవాళ్లను ఎదుర్కొనక తప్పలేదు. వరదలు, విపత్తులు, తిరుపతి తొక్కిసలాట, విశాఖ ఫార్మా మృతులు, తిరుమల లడ్డూ వివాదం.. ఇలా.. కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అదేసమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు.. ఉచిత గ్యాస్ పథకా న్ని ప్రారంభించారు. అదేవిధంగా పింఛన్లను పెంచారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇది సంక్షేమం పరంగా నాణేనికి ఒకవైపు అనుకుంటే చేయాల్సింది చాలానే ఉంది. అయితే.. సంక్షేమం కన్నా.. అభివృద్ధి అజెండాను కూటమి సర్కారు ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలోనే అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలవరం సహా మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ వంటి వాటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.
ఈ పరిణామాలు.. కూటమి సర్కారుపై బాగానే పనిచేస్తున్నాయి. అయితే.. కీలకమైన మూడు పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడంపై మాత్రం ప్రజల్లో చర్చసాగుతోంది. ఉచిత బస్సు, మహిళలకు రూ.1500 ఇచ్చే పథకం, రైతులకు భరోసా ఈ మూడు పథకాల విషయం సర్కారుకు కీలకంగా మారింది. అధికారంలోకి వచ్చి ఏడు మాసాలైనా ఈ పథకాలపై మాత్రం సర్కారు ఇంకా ప్రకటన చేయలే దు. అయితే, క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న సంకేతాలు పంపించారు.
దీంతో ప్రజల్లో కొంత నిబ్బరం కనిపిస్తోంది. అంటే.. ఏడు మాసాల పాలనలో సర్కారుపై పూర్తిగా వ్యతిరేకత అయితే రాలేదు. కానీ, క్షేత్రస్థాయిలో ఒకింత అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఉచిత ఇసుక అన్నా కూడా.. డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. బెల్ట్ షాపులు ఉండవని చెప్పినా.. వీధిలో నాలుగు బెల్టు షాపులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు మాత్రం సర్కారుపై అసంతృప్తి పెరిగేలా చేస్తున్నాయి. కానీ, ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారం స్థాయిలో అయితే వ్యతిరేకత లేకపోవడం గమనార్హం.
This post was last modified on January 17, 2025 10:48 am
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…