ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు అయిపోయింది. జనవరి 12వ తేదీకి కూటమి సర్కారుకు ఏడు మాసాలు నిండాయి. ఏడు మాసాల కాలంలో అనేక ఇబ్బందులు.. సవాళ్లను ఎదుర్కొనక తప్పలేదు. వరదలు, విపత్తులు, తిరుపతి తొక్కిసలాట, విశాఖ ఫార్మా మృతులు, తిరుమల లడ్డూ వివాదం.. ఇలా.. కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అదేసమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు.. ఉచిత గ్యాస్ పథకా న్ని ప్రారంభించారు. అదేవిధంగా పింఛన్లను పెంచారు.
డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇది సంక్షేమం పరంగా నాణేనికి ఒకవైపు అనుకుంటే చేయాల్సింది చాలానే ఉంది. అయితే.. సంక్షేమం కన్నా.. అభివృద్ధి అజెండాను కూటమి సర్కారు ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలోనే అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలవరం సహా మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ వంటి వాటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.
ఈ పరిణామాలు.. కూటమి సర్కారుపై బాగానే పనిచేస్తున్నాయి. అయితే.. కీలకమైన మూడు పథకాల విషయంలో కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడంపై మాత్రం ప్రజల్లో చర్చసాగుతోంది. ఉచిత బస్సు, మహిళలకు రూ.1500 ఇచ్చే పథకం, రైతులకు భరోసా ఈ మూడు పథకాల విషయం సర్కారుకు కీలకంగా మారింది. అధికారంలోకి వచ్చి ఏడు మాసాలైనా ఈ పథకాలపై మాత్రం సర్కారు ఇంకా ప్రకటన చేయలే దు. అయితే, క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న సంకేతాలు పంపించారు.
దీంతో ప్రజల్లో కొంత నిబ్బరం కనిపిస్తోంది. అంటే.. ఏడు మాసాల పాలనలో సర్కారుపై పూర్తిగా వ్యతిరేకత అయితే రాలేదు. కానీ, క్షేత్రస్థాయిలో ఒకింత అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఉచిత ఇసుక అన్నా కూడా.. డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. బెల్ట్ షాపులు ఉండవని చెప్పినా.. వీధిలో నాలుగు బెల్టు షాపులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు మాత్రం సర్కారుపై అసంతృప్తి పెరిగేలా చేస్తున్నాయి. కానీ, ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ప్రచారం స్థాయిలో అయితే వ్యతిరేకత లేకపోవడం గమనార్హం.
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…