సంక్రాతి పండక్కి కొత్త అల్లుళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు అందుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ఏపీ ప్రజలు సిసలైన అల్లుళ్లుగా మారిపోయారు. అల్లుళ్లను అపురూపంగా చూసుకునే మామ మాదిరిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. పండగ వేడుకలు ముగిసిన మూడు రోజులకు అందుబాటులోకి రానున్న ఈ గిఫ్టుతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు ఓ రేంజిలో మారిపోతాయని చెప్పొచ్చు.
ఈ నెల 18… అంటే ఎల్లుండి నుంచి ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనను ఆయన సంక్రాతి వేడుకల సందర్బంగా… తన సొంతూరు నారావారిపల్లెలో చేయడం గమనార్హం. ఈ పథకం కింద ప్రజలకు సేవలన్నీ వాట్సాప్ ద్వారానే లభించనున్నాయి. అంటే… కుల, ఆదాయ ధ్రువీకరణ పాత్రల కోసం ఇకపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా అప్లై చేస్తే… క్షణాల్లో అదే వాట్సాప్ ద్వారానే ఆ పత్రాలు అందుతాయి.
ఇలా ఒకటి, రెండు కాదు… ఏకంగా 150కి పైగా సేవలను ప్రజలు వాట్సాప్ ద్వారా పొందనున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే… ఐటీ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కి ప్రతిపాదించగా… మెటా అందుకు ఒప్పుకుంది. ఏపీ ప్రభుత్వంతో మెటా ఒప్పందం కుదుర్చుకోగా,,, సేవల బదిలీకి తాజాగా రంగం సిద్ధం అయింది. లోకేష్ ద్వారా దీనిపై సమాచారం తెలుసుకున్న చంద్రబాబు సంక్రాతి కానుకగా ఈ సేవలపై ప్రకటన చేసారు.
This post was last modified on January 16, 2025 4:20 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…