సంక్రాతి పండక్కి కొత్త అల్లుళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు అందుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి ఏపీ ప్రజలు సిసలైన అల్లుళ్లుగా మారిపోయారు. అల్లుళ్లను అపురూపంగా చూసుకునే మామ మాదిరిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. పండగ వేడుకలు ముగిసిన మూడు రోజులకు అందుబాటులోకి రానున్న ఈ గిఫ్టుతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు ఓ రేంజిలో మారిపోతాయని చెప్పొచ్చు.
ఈ నెల 18… అంటే ఎల్లుండి నుంచి ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటనను ఆయన సంక్రాతి వేడుకల సందర్బంగా… తన సొంతూరు నారావారిపల్లెలో చేయడం గమనార్హం. ఈ పథకం కింద ప్రజలకు సేవలన్నీ వాట్సాప్ ద్వారానే లభించనున్నాయి. అంటే… కుల, ఆదాయ ధ్రువీకరణ పాత్రల కోసం ఇకపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా అప్లై చేస్తే… క్షణాల్లో అదే వాట్సాప్ ద్వారానే ఆ పత్రాలు అందుతాయి.
ఇలా ఒకటి, రెండు కాదు… ఏకంగా 150కి పైగా సేవలను ప్రజలు వాట్సాప్ ద్వారా పొందనున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే… ఐటీ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కి ప్రతిపాదించగా… మెటా అందుకు ఒప్పుకుంది. ఏపీ ప్రభుత్వంతో మెటా ఒప్పందం కుదుర్చుకోగా,,, సేవల బదిలీకి తాజాగా రంగం సిద్ధం అయింది. లోకేష్ ద్వారా దీనిపై సమాచారం తెలుసుకున్న చంద్రబాబు సంక్రాతి కానుకగా ఈ సేవలపై ప్రకటన చేసారు.
This post was last modified on January 16, 2025 4:20 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…