కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎక్కడికక్కడ వివాదాలు కొని తెచ్చే నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన ఆ పార్టీ మాజీ ఎంపీ రమేష్ బిధూరీ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే… ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టెల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ తరఫున ఢిల్లీ సీఎం రేసులో బిధూరీ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాఫై బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బీజేపీని గెలిపిస్తే… ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా మారుస్తామని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. అయినా కూడా బిధూరీలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించలేదు.
తాజాగా ఢిల్లీ సీఎం గా ఉన్న ఆప్ కీలక నేత ఆతీశిఫై బిధూరీ నోరు పారేసుకున్నాడు. గడచిన ఐదేళ్ల పాటు ఢిల్లీని పట్టించుకోని ఆతీశి… ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెత్తుతున్నారని ఆయన అన్నారు. వెరసి ఆయన ఆతీశిని ఓ జింకతో పోల్చారన్నమాట. సాధారణ మహిళల మీద నోరు పాడుకోవడానికే హడాలిపోతున్న వేళ… బిధూరీ మాత్రం ఏకంగా సీఎం, ఎంపీ హోదాల్లో ఉన్న కీలక మహిళా నేతల మీద ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.
This post was last modified on January 16, 2025 8:38 am
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…