కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎక్కడికక్కడ వివాదాలు కొని తెచ్చే నేతలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఢిల్లీకి చెందిన ఆ పార్టీ మాజీ ఎంపీ రమేష్ బిధూరీ ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే… ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టెల వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ తరఫున ఢిల్లీ సీఎం రేసులో బిధూరీ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాఫై బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బీజేపీని గెలిపిస్తే… ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా మారుస్తామని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. అయినా కూడా బిధూరీలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించలేదు.
తాజాగా ఢిల్లీ సీఎం గా ఉన్న ఆప్ కీలక నేత ఆతీశిఫై బిధూరీ నోరు పారేసుకున్నాడు. గడచిన ఐదేళ్ల పాటు ఢిల్లీని పట్టించుకోని ఆతీశి… ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెత్తుతున్నారని ఆయన అన్నారు. వెరసి ఆయన ఆతీశిని ఓ జింకతో పోల్చారన్నమాట. సాధారణ మహిళల మీద నోరు పాడుకోవడానికే హడాలిపోతున్న వేళ… బిధూరీ మాత్రం ఏకంగా సీఎం, ఎంపీ హోదాల్లో ఉన్న కీలక మహిళా నేతల మీద ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.
This post was last modified on January 16, 2025 8:38 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…