వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కొంత మేరకు కొత్తగా ప్రవరిస్తున్నారాన్నది నెటిజన్ల కామెంట్. సాధారణంగా ఆయా నేతల భద్రతకు ఎవరిని పంపాలి అన్నది పోలీస్ శాఖ అంతర్గత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆయా నేతల ప్రమేయం ఏమీ ఉండదు కూడా. అయితే జగన్ మాత్రం తాను సూచించిన అధికారులనే తన భద్రతకు కేటాయించాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జగన్ ఈరోజు విదేశీ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఓ మాజీ సీఎం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించడం ఆనవాయితీ. ఈ మేరకు జగన్కు సర్కారు భద్రత కల్పించింది కూడా. అయితే తన భద్రతకు తాను సూచించిన పోలీసులే ఉండాలని జగన్ భావిస్తున్నారు.
తన భద్రతలో డీఎస్పీగా పనిచేస్తున్న మహబూబ్ భాషను నియమించాలని ఆయన ఇటీవలే ప్రభుత్వానికి ఓ లేఖ రాసారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో జగన్ నేరుగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.
జగన్ కోరుతున్న మహబూబ్ బాషా ప్రస్తుతం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అదనపు కమాండెంటుగా పని చేస్తున్నారు. బాషా కు తన భద్రత పట్ల సంపూర్ణ అవగాహనా ఉందని.. ఈ కారణంగా ఆయననే తన భద్రతకు కేటాయించాలని జగన్ కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగానే విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును అయితే వెల్లడించలేదు.
దీంతో బాషా లేకుండానే జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ పరిణామంతో ఒకింత దిగాలుగానే జగన్ బయలుదేరుతున్నారని చెప్పాలి. లండన్ లో చదువుతున్న తన కుమార్తె వద్దకు జగన్ తన కుటుంబంతో కలిసి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఆయన లండన్ లోనే ఉంటారు.
పెద్ది విడుదలైన వారం రోజులకే ఇంకో సినిమా రిలీజ్ చేసే సాహసం వేరే నిర్మాతలు చేయలేదు కానీ కంటెంట్ మీద…
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఎన్నో మెగా మూవీస్ తెరకెక్కుతున్నాయి. వాటన్నింట్లోకి వారణాసి రేంజ్ వేరు. ఆ సినిమా కోసం గ్లోబల్…
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…