Political News

నాకు ఆ డీఎస్పీ నే కావాలన్న జగన్!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కొంత మేరకు కొత్తగా ప్రవరిస్తున్నారాన్నది నెటిజన్ల కామెంట్. సాధారణంగా ఆయా నేతల భద్రతకు ఎవరిని పంపాలి అన్నది పోలీస్ శాఖ అంతర్గత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆయా నేతల ప్రమేయం ఏమీ ఉండదు కూడా. అయితే జగన్ మాత్రం తాను సూచించిన అధికారులనే తన భద్రతకు కేటాయించాలంటూ ఏకంగా హైకోర్టుకే ఎక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

జగన్ ఈరోజు విదేశీ పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఓ మాజీ సీఎం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించడం ఆనవాయితీ. ఈ మేరకు జగన్కు సర్కారు భద్రత కల్పించింది కూడా. అయితే తన భద్రతకు తాను సూచించిన పోలీసులే ఉండాలని జగన్ భావిస్తున్నారు.

తన భద్రతలో డీఎస్పీగా పనిచేస్తున్న మహబూబ్ భాషను నియమించాలని ఆయన ఇటీవలే ప్రభుత్వానికి ఓ లేఖ రాసారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో జగన్ నేరుగా సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

జగన్ కోరుతున్న మహబూబ్ బాషా ప్రస్తుతం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అదనపు కమాండెంటుగా పని చేస్తున్నారు. బాషా కు తన భద్రత పట్ల సంపూర్ణ అవగాహనా ఉందని.. ఈ కారణంగా ఆయననే తన భద్రతకు కేటాయించాలని జగన్ కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగానే విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును అయితే వెల్లడించలేదు.

దీంతో బాషా లేకుండానే జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ పరిణామంతో ఒకింత దిగాలుగానే జగన్ బయలుదేరుతున్నారని చెప్పాలి. లండన్ లో చదువుతున్న తన కుమార్తె వద్దకు జగన్ తన కుటుంబంతో కలిసి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఆయన లండన్ లోనే ఉంటారు.

This post was last modified on January 14, 2025 5:49 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YS Jagan

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

50 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago