తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ పగ్గాల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. పార్టీ అధినే త కేసీఆర్ ప్రజల మధ్యకు రావడం లేదు. పైగా ఆయన కొంత అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలకు షెడ్యూల్ విడుదల చేస్తున్నా.. ఆయన మాత్రం హాజరు కాలేక పోతున్నారు. దీంతో పార్టీలో కేసీఆర్ ప్రభావం తగ్గుతోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ దూకుడు పెంచారు.
పార్టీ తరఫున కార్యక్రమాలు కానీ, అసెంబ్లీలో పాలక పక్షాన్ని ఎండగట్టే విషయంలో కానీ.. కేటీఆర్ సమర్థ వంతంగా దూసుకుపోతున్నారన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇదేసమయంలో సానుభూతి రాజకీయాల్లోనూ కేటీఆర్ ముందున్నారు. ప్రభుత్వంలో సై అంటే సై అనే విధంగా కేటీఆర్ సవాళ్లు రువ్వడం.. తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించడం, ప్రజా సమస్యలను ప్రస్తావించడం వంటివి గత మూడు మాసాల్లో కేటీఆర్ గ్రాఫ్ను పెంచాయి.
దీంతో కేటీఆర్ చుట్టూ.. పార్టీ పగ్గాల చర్చ జోరుగా సాగుతోంది. గతంలో అయితే.. హరీష్రావు పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం ఆయన కూడా కృషి చేశారని, ఉద్యమ సమయంలో కేసులు కూడా ఎదుర్కొన్నారని నాయకులు చెప్పుకొచ్చారు. నిజానికి ఆరు మాసాల కిందట హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ మధ్య పార్టీ పగ్గాల విషయంలో కోల్డ్ వార్ జరుగుతోందన్న చర్చ కూడా వచ్చింది. కానీ, అనూహ్యంగా గత మూడు మాసాల్లో కేటీఆర్దూకుడు పెంచారు.
హైడ్రా, ఫార్ములా ఈ-రేస్ వంటి విషయాల్లో కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ప్రత్యక్ష యుద్ధమే సాగింది. ఇది కేటీఆర్కు మరిన్ని మంచి మార్కులు పడేలా చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేప థ్యంలో బీఆర్ ఎస్కు సరైన నాయకుడు, పార్టీని ముందుండి నడిపించే సత్తా కేటీఆర్ లో ఉందని నిజా మాబాద్కు చెందిన కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ విషయం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. వచ్చే దసరాలోపు పార్టీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరిఏం జరుగుతుందోచూడాలి.
This post was last modified on January 14, 2025 12:27 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…