టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని చెప్పొచ్చు. ఇతర సీఎంల మాదిరిగా కాకుండా ఉద్యోగులు ఏది అడిగినా చంద్రబాబు కాదనరనే మాట చాలా కాలం నుంచే వినిపిస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇందుకు సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. ఫలితంగా ఏ పని చేయాలన్న చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆర్ధిక ఇబ్బంది ఉందని పండుగలు పబ్బాలు ఆగవు కదా. చంద్రబాబు సర్దుకోక ముందే సంక్రాంతి వచ్చేసింది.
సంక్రాంతికి కూడా తమను పట్టించుకోరా అన్నట్టుగా ఉద్యోగులు చంద్రబాబు వైపు చూసారు. పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఆయా వర్గాలకు విడుదల చేసారు. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నాయి.
కష్టకాలంలోనూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుష్హే అయ్యారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ల ప్రతినిధులు చంద్రబాబుకు ఓ విషయాన్ని విన్నవించారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో తమకు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అని… కనుమ రోజు కూడా తమకు సెలవు కావాలని కోరారు.. దీంతో… ఈ విషయంపై వెంటనే దృష్టి సారించిన చంద్రబాబు… కనుమ రోజున కూడా బ్యాంకులకు సెలవు ;ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు హర్షం ప్రకటించారు.
This post was last modified on January 14, 2025 10:54 am
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…