టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని చెప్పొచ్చు. ఇతర సీఎంల మాదిరిగా కాకుండా ఉద్యోగులు ఏది అడిగినా చంద్రబాబు కాదనరనే మాట చాలా కాలం నుంచే వినిపిస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇందుకు సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. ఫలితంగా ఏ పని చేయాలన్న చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆర్ధిక ఇబ్బంది ఉందని పండుగలు పబ్బాలు ఆగవు కదా. చంద్రబాబు సర్దుకోక ముందే సంక్రాంతి వచ్చేసింది.
సంక్రాంతికి కూడా తమను పట్టించుకోరా అన్నట్టుగా ఉద్యోగులు చంద్రబాబు వైపు చూసారు. పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఆయా వర్గాలకు విడుదల చేసారు. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నాయి.
కష్టకాలంలోనూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుష్హే అయ్యారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ల ప్రతినిధులు చంద్రబాబుకు ఓ విషయాన్ని విన్నవించారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో తమకు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అని… కనుమ రోజు కూడా తమకు సెలవు కావాలని కోరారు.. దీంతో… ఈ విషయంపై వెంటనే దృష్టి సారించిన చంద్రబాబు… కనుమ రోజున కూడా బ్యాంకులకు సెలవు ;ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు హర్షం ప్రకటించారు.
This post was last modified on January 14, 2025 10:54 am
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…
ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…
దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…
అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…