టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని చెప్పొచ్చు. ఇతర సీఎంల మాదిరిగా కాకుండా ఉద్యోగులు ఏది అడిగినా చంద్రబాబు కాదనరనే మాట చాలా కాలం నుంచే వినిపిస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇందుకు సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. ఫలితంగా ఏ పని చేయాలన్న చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆర్ధిక ఇబ్బంది ఉందని పండుగలు పబ్బాలు ఆగవు కదా. చంద్రబాబు సర్దుకోక ముందే సంక్రాంతి వచ్చేసింది.
సంక్రాంతికి కూడా తమను పట్టించుకోరా అన్నట్టుగా ఉద్యోగులు చంద్రబాబు వైపు చూసారు. పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఆయా వర్గాలకు విడుదల చేసారు. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నాయి.
కష్టకాలంలోనూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుష్హే అయ్యారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ల ప్రతినిధులు చంద్రబాబుకు ఓ విషయాన్ని విన్నవించారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో తమకు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అని… కనుమ రోజు కూడా తమకు సెలవు కావాలని కోరారు.. దీంతో… ఈ విషయంపై వెంటనే దృష్టి సారించిన చంద్రబాబు… కనుమ రోజున కూడా బ్యాంకులకు సెలవు ;ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు హర్షం ప్రకటించారు.
This post was last modified on January 14, 2025 10:54 am
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…