టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని చెప్పొచ్చు. ఇతర సీఎంల మాదిరిగా కాకుండా ఉద్యోగులు ఏది అడిగినా చంద్రబాబు కాదనరనే మాట చాలా కాలం నుంచే వినిపిస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇందుకు సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానా దాదాపుగా ఖాళీగా ఉంది. ఫలితంగా ఏ పని చేయాలన్న చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆర్ధిక ఇబ్బంది ఉందని పండుగలు పబ్బాలు ఆగవు కదా. చంద్రబాబు సర్దుకోక ముందే సంక్రాంతి వచ్చేసింది.
సంక్రాంతికి కూడా తమను పట్టించుకోరా అన్నట్టుగా ఉద్యోగులు చంద్రబాబు వైపు చూసారు. పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఆయా వర్గాలకు విడుదల చేసారు. ఇందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉన్నాయి.
కష్టకాలంలోనూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుష్హే అయ్యారు. తాజాగా బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ల ప్రతినిధులు చంద్రబాబుకు ఓ విషయాన్ని విన్నవించారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్న తరుణంలో తమకు కేవలం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అని… కనుమ రోజు కూడా తమకు సెలవు కావాలని కోరారు.. దీంతో… ఈ విషయంపై వెంటనే దృష్టి సారించిన చంద్రబాబు… కనుమ రోజున కూడా బ్యాంకులకు సెలవు ;ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై బ్యాంకు ఉద్యోగులు హర్షం ప్రకటించారు.
This post was last modified on January 14, 2025 10:54 am
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…