పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లాకు చెందిన దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదానికి దిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. పరస్పర దూషణలకు దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య బూతుల పర్వం కూడా వినిపించింది. వెరసి సమావేశం రచ్చరచ్చగా మారింది.
కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం ఆదివారం జిల్లా కేంద్రం కరీంనగర్ లో ఏర్పాటైంది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు సహా జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికార యంత్రాంగం హాజరైంది. జిల్లాలోని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలూ హాజరయ్యారు. 2023 ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ఎస్ తరఫునే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్ కు దగ్గరయ్యారు.
సమావేశంలో భాగంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలన్న మంత్రుల సూచనతో సంజయ్ మైకు అందుకున్నారు. ఈ సమయంలో వేదిక కింద కూర్చున్న కౌశిక్ రెడ్డి ఉన్నట్టుండి..వేదిక మీదకు దూసుకెళ్లారు. ఏ పార్టీ ఎమ్మెల్యే హోదాలో మాట్లాడుతున్నావు అంటూ సంజయ్ ను నిలదీశారు. అడగడానికి నీవెవరు అంటూ కౌశిక్ రెడ్డిని సంజయ్ ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం వాదించుకుంటూ… దూషించుకుంటూ… ఒకరినొకరు తోసుకున్నారు. మరికాసేపు ఉంటే… ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకునేవారేమో.
అయితే సమావేశానికి హాజరైన ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు వారిని విడదీశారు. సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఇలాంటి పార్టీ ద్రోహులను క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు.
This post was last modified on January 12, 2025 6:25 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…