వివాహ వార్షికోత్సవం….ఏదైనా సంస్థ వార్షికోత్సవం….ప్రైవేటు పాఠశాలల వార్షికోత్సవం…ఇలా ఎన్నో రకాల వార్షికోత్సవాల గురించి విన్నాం. ఈ వార్షికోత్సవాలన్నీ సంతోషంతో జరుపుకునేవి. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం దగ్గరలో ఉన్న గొల్లప్రోలు గ్రామ ప్రజలు మాత్రం బాధతో ఓ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఆ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.
గత 30 సంవత్సరాలుగా తమ గ్రామం వరదనీటిలో మునిగిపోతుందని, ఈ ఏడాది కూడా మునిగిపోయిందని ఆ గ్రామస్థులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తమ గ్రామాన్ని సందర్శించేందుకు ప్రజాప్రతినిధులు రాబోతున్నారని, వారు వస్తున్నారు…చూస్తున్నారు…వెళుతున్నారు….అని వ్యగ్యంగా ఊరి పొలిమేరలో బ్యానర్ కట్టారు ఆ గ్రామ ప్రజలు. ప్రస్తుతం ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తమ గ్రామానికి ఇది 30వ వరద వార్షికోత్సవం అని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఈబీసీ కాలనీ వరదను తిలకించడానికి విచ్చేయుచున్న ప్రజా ప్రతినిధులకు ఇదే మా స్వాగతం అని ఆ ఊరి ప్రజలు కట్టిన బ్యానర్ ఇపుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులు వస్తున్నారు…. చూస్తున్నారు… వెళుతున్నారు…అంటూ గొల్లప్రోలు ఈబీసీ కాలనీ ప్రజలు తమ బాధను, ఆవేదనను, నిరసనను వెటకారంగా వ్యక్తం చేశారు.
ఇకనైనా తమ గ్రామాన్ని వరదనీరు ముంచెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మరి, ఈ విషయంపై అక్కడి ప్రజాప్రతినిధుల స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. తెలంగాణలో ఓ ప్రజాప్రతినిధిపై కూడా ఇదే తరహాలో బ్యానర్ కట్టి ప్రజలు తమ నిరసన తెలిపారు. ఓ ప్రజాప్రతినిధి ఖరీదైన కారు కొన్నారని, అయితే, ఆ కారు నడిపేందుకు ఆ నేత ఉన్న ప్రాంతంలో రోడ్డు అనువుగా లేదని చెబుతూ ఓ బ్యానర్ కట్టారు. ఈ గుంతలు, గతుకులు ఉన్న రోడ్లో ఆ కారులో ప్రయాణిస్తే సదరు ప్రజాప్రతినిధికు నడుమునొప్పి వస్తుందంటూ వెటకారంగా బ్యానర్ రాశారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…