వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట తల పట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. అసలే సంక్రాంతి. ఆపై మిన్నంటుతున్న సంబరాలు. తన ఊరి పరిసరాల్లో తమిళనాడు తరహా జల్లికట్టు ఉత్సవాలు. ఊరూవాడా ఫుల్ జోష్ తో ఊగిపోతున్న వేళ… రోజాపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజిలో సాగుతోంది. రోజా చాలా స్పష్టంగా కనిపిస్తున్న సదరు వీడియోలను పోస్ట్ చేస్తున్న వైరి వర్గాలు, సామాన్య జనం… ఆ వీడియోల్లో రోజా చూపుతున్న ఉత్సాహాన్ని తప్పుబడుతూ ఓ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నారు వెరసి రోజాకు పండుగ సంబరమంతా ఆవిరైపోయిందనే చెప్పాలి.
అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మంది దాకా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు మొన్న వైసీపీ అధినేత జగన్ తిరుపతి వచ్చారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కూడా తరలివచ్చాయి. ఈ క్రౌడ్ కు సారథ్యం వహిస్తున్నట్లుగా రోజా ముందు వరుసలో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లుగా నడిచారు.
ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే…అప్పటికే అక్కడ బాధితులను పరామర్శించి తిరిగి వెళ్లే క్రమంలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలిసిందో, ఏమో తెలియదు గానీ… ఆసుపత్రి ప్రాంగణం అని కూడా చూడకుండా వైసీపీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలను అందుకున్నాయి. ఇటా సాగుతున్న శ్రేణులకు ముందు నడిచిన రోజా… ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని సమీపిస్తున్న సమయంలో కూడా చేతులెత్తి మరీ జగన్ కు జై కొడుతూ సాగారు. ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్న నెటిజన్లు… అది ఆసుపత్రి అన్న కనీస అవగాహన కూడా లేకుండా ఆ అరుపులేంటి? అని రోజాను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పరామర్శకు వచ్చారా?.. బల ప్రదర్శనకు వచ్చారా? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…