Political News

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పే, అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది అంటూ మోదీ తెలుగులో ప్రసంగించగానే చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా సభికులంతా చప్పట్లు కొట్టారు. తెలుగులో మోదీ మాటలు విని సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలతో మార్మోగిపోయింది.

ఏపీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని, చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ అన్ని అవకాశాలున్న రాష్ట్రమని, ఏపీ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చామని అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు పోతున్నామని, ఏపీతో చేయి కలిపి సాగుతామని తెలిపారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం నిర్దేశించిన రెండు హబ్ లలో ఒకటి విశాఖకు కేటాయించామని చెప్పారు.

చంద్రబాబు ప్రసంగాన్ని విన్నానని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవే తమ సంకల్పం అని అన్నారు. ఐటీ, టెక్నాలజీకి ఏపీ సెంటర్ ఆఫ్ హబ్ కానుందని చెప్పారు. విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది పడిందని, ప్రత్యేక రైల్వేజోన్‌ కల సాకారం కానుందని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర…ప్రత్యేక రైల్వే జోన్ వల్ల అభివృద్ధి చెందుతుందని, పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని మోదీ చెప్పారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూస్తామని హామీనిచ్చారు. ఈ రోజు చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏపీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

This post was last modified on January 8, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

6 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

8 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

10 hours ago