మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్ చేసేందుకు, వారిని పట్టుకునేందుకు..ఆ క్రమంలో ఇంటర్ పోల్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేదు. ఈ క్రమంలోనే ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేలాగా ఇంటర్ పోల్ తో వేగంగా కనెక్ట్ అయ్యేందుకు ‘భారత్ పోల్’ పోర్టల్ ను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు.
జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేయడం, వారి కదలికలపై ఓ కన్నేసి వారిని పట్టుకోవడం లక్ష్యంగా భారత్ పోల్ పోర్టల్ ను సీబీఐ రూపొందించింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ ద్వారా భారత దేశపు పోలీసులు క్రిమినల్ రికార్డులను చిటికెలో అప్లోడ్ చేయవచ్చు.
ఆ అప్ లోడ్ అయిన వివరాలతో ఇంటర్పోల్ను అలర్ట్ చేయవచ్చు. అంతర్జాతీయ నేరగాళ్లు ఏ దేశంలో దాక్కున్నా సరే వారిని కలుగులో నుంచి బయటకు తెచ్చేందుకు భారత్ పోల్ ఉపయుక్తంగా ఉంటుంది. భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం కాక ముందు మన దేశంతోపాటు విదేశాలకు పారిపోయిన నేరస్థుల సమాచారం సేకరించడం, అరెస్టు చేయడం ఓ పెద్ద ప్రహసనం.
ఆ నేరస్తుల సమాచారం కోసం ఆయా రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరుగా ఇంటర్పోల్ ను ఆశ్రయించాల్సి ఉండేది. అందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా సీబీఐని సంప్రదించి…ఆ తర్వాత సీబీఐ వెళ్లి ఇంటర్పోల్ను సంప్రదించి…అప్పుడు నోటీసులు జారీ అయ్యేవి. ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్న రీతిలో చాలామంది నేరగాళ్లు తమ లొకేషన్ మార్చేస్తుంటారు.
అయితే, ఇకపై వారికి ఆ చాన్స్ ఉండదు. భారత్ పోల్ టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నేరుగా భారత్పోల్తో కనెక్ట్ అవుతారు. నేరగాళ్ల సమాచారం కోసం భారత్పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్ ను సంప్రదిస్తారు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థనకు ఒప్పుకుంటే సదరు నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర నోటీసులు వెంటనే జారీ చేస్తుంది.
ఇంటర్పోల్తో ఫాస్ట్ గా కమ్యూనికేట్ కావడం, ఆ తర్వాత వెంటనే నోటీసులు జారీ అయ్యేలా చేసి నేరస్థులను వీలైనంత త్వరగా పట్టుకోవడం భారత్ పోల్ పోర్టల్ లక్ష్యం.
This post was last modified on January 7, 2025 2:50 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…