Political News

భారత్ పోల్ తో అంతర్జాతీయ నేరస్తుల ఆటకట్టు

మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్ చేసేందుకు, వారిని పట్టుకునేందుకు..ఆ క్రమంలో ఇంటర్ పోల్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేదు. ఈ క్రమంలోనే ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేలాగా ఇంటర్ పోల్ తో వేగంగా కనెక్ట్ అయ్యేందుకు ‘భారత్ పోల్’ పోర్టల్ ను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు.

జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడం, వారి కదలికలపై ఓ కన్నేసి వారిని పట్టుకోవడం లక్ష్యంగా భారత్ పోల్ పోర్టల్ ను సీబీఐ రూపొందించింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ ద్వారా భారత దేశపు పోలీసులు క్రిమినల్ రికార్డులను చిటికెలో అప్‌లోడ్ చేయవచ్చు.

ఆ అప్ లోడ్ అయిన వివరాలతో ఇంటర్‌పోల్‌ను అలర్ట్ చేయవచ్చు. అంతర్జాతీయ నేరగాళ్లు ఏ దేశంలో దాక్కున్నా సరే వారిని కలుగులో నుంచి బయటకు తెచ్చేందుకు భారత్ పోల్ ఉపయుక్తంగా ఉంటుంది. భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం కాక ముందు మన దేశంతోపాటు విదేశాలకు పారిపోయిన నేరస్థుల సమాచారం సేకరించడం, అరెస్టు చేయడం ఓ పెద్ద ప్రహసనం.

ఆ నేరస్తుల సమాచారం కోసం ఆయా రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరుగా ఇంటర్‌పోల్‌ ను ఆశ్రయించాల్సి ఉండేది. అందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా సీబీఐని సంప్రదించి…ఆ తర్వాత సీబీఐ వెళ్లి ఇంటర్‌పోల్‌ను సంప్రదించి…అప్పుడు నోటీసులు జారీ అయ్యేవి. ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్న రీతిలో చాలామంది నేరగాళ్లు తమ లొకేషన్ మార్చేస్తుంటారు.

అయితే, ఇకపై వారికి ఆ చాన్స్ ఉండదు. భారత్ పోల్ టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నేరుగా భారత్‌పోల్‌తో కనెక్ట్ అవుతారు. నేరగాళ్ల సమాచారం కోసం భారత్‌పోల్ ద్వారా నేరుగా ఇంటర్‌పోల్‌ ను సంప్రదిస్తారు. ఇంటర్‌పోల్ ఆ అభ్యర్థనకు ఒప్పుకుంటే సదరు నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర నోటీసులు వెంటనే జారీ చేస్తుంది.

ఇంటర్‌పోల్‌తో ఫాస్ట్ గా కమ్యూనికేట్ కావడం, ఆ తర్వాత వెంటనే నోటీసులు జారీ అయ్యేలా చేసి నేరస్థులను వీలైనంత త్వరగా పట్టుకోవడం భారత్ పోల్ పోర్టల్ లక్ష్యం.

This post was last modified on January 7, 2025 2:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

1 minute ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

2 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

2 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

3 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago