మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్ చేసేందుకు, వారిని పట్టుకునేందుకు..ఆ క్రమంలో ఇంటర్ పోల్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ లేదు. ఈ క్రమంలోనే ఇకపై ఆ సమస్యకు చెక్ పెట్టేలాగా ఇంటర్ పోల్ తో వేగంగా కనెక్ట్ అయ్యేందుకు ‘భారత్ పోల్’ పోర్టల్ ను కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు.
జాతీయ, అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ను ట్రాక్ చేయడం, వారి కదలికలపై ఓ కన్నేసి వారిని పట్టుకోవడం లక్ష్యంగా భారత్ పోల్ పోర్టల్ ను సీబీఐ రూపొందించింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ ద్వారా భారత దేశపు పోలీసులు క్రిమినల్ రికార్డులను చిటికెలో అప్లోడ్ చేయవచ్చు.
ఆ అప్ లోడ్ అయిన వివరాలతో ఇంటర్పోల్ను అలర్ట్ చేయవచ్చు. అంతర్జాతీయ నేరగాళ్లు ఏ దేశంలో దాక్కున్నా సరే వారిని కలుగులో నుంచి బయటకు తెచ్చేందుకు భారత్ పోల్ ఉపయుక్తంగా ఉంటుంది. భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం కాక ముందు మన దేశంతోపాటు విదేశాలకు పారిపోయిన నేరస్థుల సమాచారం సేకరించడం, అరెస్టు చేయడం ఓ పెద్ద ప్రహసనం.
ఆ నేరస్తుల సమాచారం కోసం ఆయా రాష్ట్రాల పోలీసులు, దర్యాప్తు సంస్థలు నేరుగా ఇంటర్పోల్ ను ఆశ్రయించాల్సి ఉండేది. అందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా సీబీఐని సంప్రదించి…ఆ తర్వాత సీబీఐ వెళ్లి ఇంటర్పోల్ను సంప్రదించి…అప్పుడు నోటీసులు జారీ అయ్యేవి. ఈ ప్రాసెస్ పూర్తయ్యే లోపు ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్న రీతిలో చాలామంది నేరగాళ్లు తమ లొకేషన్ మార్చేస్తుంటారు.
అయితే, ఇకపై వారికి ఆ చాన్స్ ఉండదు. భారత్ పోల్ టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నేరుగా భారత్పోల్తో కనెక్ట్ అవుతారు. నేరగాళ్ల సమాచారం కోసం భారత్పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్ ను సంప్రదిస్తారు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థనకు ఒప్పుకుంటే సదరు నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర నోటీసులు వెంటనే జారీ చేస్తుంది.
ఇంటర్పోల్తో ఫాస్ట్ గా కమ్యూనికేట్ కావడం, ఆ తర్వాత వెంటనే నోటీసులు జారీ అయ్యేలా చేసి నేరస్థులను వీలైనంత త్వరగా పట్టుకోవడం భారత్ పోల్ పోర్టల్ లక్ష్యం.
This post was last modified on January 7, 2025 2:50 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…