ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్దేనని చెప్పారు. “చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వేసిన అడుగులు పెట్టుబడులు తెచ్చాయి. ఉపాధి కల్పించాయి. ఉద్యోగాలు సృష్టించాయి. ఇది జగమెరిగిన సత్యం. హైదరాబాద్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ, జగన్ పాలన తర్వాత.. అప్పులకు వడ్డీలు.. వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జగన్ విజన్” అన్నారు.
తాజాగా సోమవారం నారా లోకేష్.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంత రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అయితే.. అంత మేరకు ఆదాయం రావడం లేదని.. దీనికి తోడు జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని చెప్పారు. “చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సూపర్ విజన్ అమలు చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
కానీ, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చిన జగన్.. కూడా విజన్ను అనుసరించారని.. కానీ, అది డెట్ విజన్(అప్పుల విజన్) అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే 25 ఏళ్లపాటు మద్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టారని.. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే.. ప్రజలను కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడానికి జగన్ డెట్ విజనే కారణమని అన్నారు.
అయినప్పటికీ.. చంద్రబాబు సహా మంత్రి వర్గంలో అన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోందని చెప్పా రు. అందుకే.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. 1వ తేదీ కి ముందుగానే పింఛన్లు, వేతనాలు అందిస్తున్నామ న్నారు. అదేవిధంగా వచ్చే మూడు మాసాల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా పలు కంపెనీలను కూడా ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తుందన్నారు.
This post was last modified on January 6, 2025 6:31 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…