ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్దేనని చెప్పారు. “చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వేసిన అడుగులు పెట్టుబడులు తెచ్చాయి. ఉపాధి కల్పించాయి. ఉద్యోగాలు సృష్టించాయి. ఇది జగమెరిగిన సత్యం. హైదరాబాద్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ, జగన్ పాలన తర్వాత.. అప్పులకు వడ్డీలు.. వాటికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జగన్ విజన్” అన్నారు.
తాజాగా సోమవారం నారా లోకేష్.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంత రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అయితే.. అంత మేరకు ఆదాయం రావడం లేదని.. దీనికి తోడు జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని చెప్పారు. “చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సూపర్ విజన్ అమలు చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
కానీ, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చిన జగన్.. కూడా విజన్ను అనుసరించారని.. కానీ, అది డెట్ విజన్(అప్పుల విజన్) అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే 25 ఏళ్లపాటు మద్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టారని.. ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే.. ప్రజలను కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడానికి జగన్ డెట్ విజనే కారణమని అన్నారు.
అయినప్పటికీ.. చంద్రబాబు సహా మంత్రి వర్గంలో అన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తోందని చెప్పా రు. అందుకే.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. 1వ తేదీ కి ముందుగానే పింఛన్లు, వేతనాలు అందిస్తున్నామ న్నారు. అదేవిధంగా వచ్చే మూడు మాసాల్లో 10 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా పలు కంపెనీలను కూడా ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తుందన్నారు.
This post was last modified on January 6, 2025 6:31 pm
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…