ఏపీలో కూటమిగా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని నియోజక వర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం కూటమికి కుంపటి పెట్టేలా నాయకులు వ్యవహరిస్తున్నారు. దీనిలో ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీనాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకరు. తాజాగా ఆయన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. మహిళా నాయకుల విమర్శలపై ప్రతి విమర్శలు చేశారు.
దీనిపై తీవ్ర రగడ చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం స్పందించారు. దీంతో విషయం సీరియస్ అవుతున్నట్టు గ్రహించిన జేసీ.. నాలుగు మెట్లు దిగి వచ్చారు. తొలిసారి ఆయన క్షమాపణలు కోరుతూ.. బీజేపీ నాయకురాలు, నటి మాధవీలతకు విన్నవించారు. “తొందరపడ్డాను, ఆవేశంలో ఏదో అన్నాను. ఇది సరికాదు. సారీ“ అంటూ.. ముక్తాయించారు. దీంతో వివాదం దాదాపు సర్దు మణిగిందనే అంటున్నారు పరిశీలకులు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన జేసీ.. “నేను మాధవిలత మీద టంగ్ స్లిప్ అయ్యాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా“ అని వ్యాఖ్యానించారు. తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను తపన పడుతున్నట్టు వెల్లడించారు. తాడిపత్రి ప్రజలే తనకు సైన్యమని వివరించారు. నియోజకవర్గం కోసం తాను పోరాడుతున్నానని.. అంతకు మించి వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.
ఇక, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలపైనా జేసీ స్పందించారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ మారేది లేదన్నారు. చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ విజయం సాధించారని, ఆయన వెంటే తాను నడుస్తానని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని.. తాను తాడిపత్రి కోసం కష్టపడుతున్నానని వ్యాఖ్యానించారు. దీనిలో వేరే నాయకుల ప్రమేయం వద్దని ఆయన పరోక్షంగా సూచించారు.
ఢిల్లీలోని మాళవియా నగర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్లో ఉదయం చెలరేగిన మంటలు…
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…