తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో శనివారం పర్యటించారు. ఇక్కడ అక్రమంగా కడుతున్న ఐదు అంతస్థుల భవనంపై ఆయన దృష్టి పెట్టారు.
ఇది అక్రమ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. అయ్యప్ప సొసైటీ కీలకనేతకు చెందింది కావడం తో చాలా వరకు తాత్సారం జరిగింది. అయినప్పటికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో చర్యలకు దిగారు.
శనివారం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీని పరిశీలించిన.. రంగనాథ్.. ఆ వెంటనే ఆదివారం కూల్చి వేతలకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనాన్ని కూల్చి వేస్తున్నారు.
వాస్తవానికి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఇప్పుడు కొత్తకాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఒకటి రెండు కూల్చివేతలు చోటు చేసుకున్నాయి.
అయినా.. అయ్యప్ప సొసైటీ తీరు మారడం లేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఈ క్రమంలోనే శనివారం రంగనాథ్ క్షేత్రస్తాయిలోకి దిగి పరిశీలన చేశారు. అనంతరం.. ఆక్రమనలు నిజమేనని నిర్దారించుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం కూల్చివేతలకు రెడీ అయ్యారు. ఈ కూల్చివేతల వ్యవహారం.. సంచలనం గా మారింది. ఇక, ఈ ఆక్రమణ తాలూకు భవనం రోడ్డుకు ఆనుకుని ఉండడంతో సమీపంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…