తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో శనివారం పర్యటించారు. ఇక్కడ అక్రమంగా కడుతున్న ఐదు అంతస్థుల భవనంపై ఆయన దృష్టి పెట్టారు.
ఇది అక్రమ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. అయ్యప్ప సొసైటీ కీలకనేతకు చెందింది కావడం తో చాలా వరకు తాత్సారం జరిగింది. అయినప్పటికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో చర్యలకు దిగారు.
శనివారం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీని పరిశీలించిన.. రంగనాథ్.. ఆ వెంటనే ఆదివారం కూల్చి వేతలకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనాన్ని కూల్చి వేస్తున్నారు.
వాస్తవానికి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఇప్పుడు కొత్తకాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఒకటి రెండు కూల్చివేతలు చోటు చేసుకున్నాయి.
అయినా.. అయ్యప్ప సొసైటీ తీరు మారడం లేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఈ క్రమంలోనే శనివారం రంగనాథ్ క్షేత్రస్తాయిలోకి దిగి పరిశీలన చేశారు. అనంతరం.. ఆక్రమనలు నిజమేనని నిర్దారించుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం కూల్చివేతలకు రెడీ అయ్యారు. ఈ కూల్చివేతల వ్యవహారం.. సంచలనం గా మారింది. ఇక, ఈ ఆక్రమణ తాలూకు భవనం రోడ్డుకు ఆనుకుని ఉండడంతో సమీపంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు.
This post was last modified on January 5, 2025 5:04 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…