తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో శనివారం పర్యటించారు. ఇక్కడ అక్రమంగా కడుతున్న ఐదు అంతస్థుల భవనంపై ఆయన దృష్టి పెట్టారు.
ఇది అక్రమ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. అయ్యప్ప సొసైటీ కీలకనేతకు చెందింది కావడం తో చాలా వరకు తాత్సారం జరిగింది. అయినప్పటికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో చర్యలకు దిగారు.
శనివారం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీని పరిశీలించిన.. రంగనాథ్.. ఆ వెంటనే ఆదివారం కూల్చి వేతలకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనాన్ని కూల్చి వేస్తున్నారు.
వాస్తవానికి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఇప్పుడు కొత్తకాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఒకటి రెండు కూల్చివేతలు చోటు చేసుకున్నాయి.
అయినా.. అయ్యప్ప సొసైటీ తీరు మారడం లేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఈ క్రమంలోనే శనివారం రంగనాథ్ క్షేత్రస్తాయిలోకి దిగి పరిశీలన చేశారు. అనంతరం.. ఆక్రమనలు నిజమేనని నిర్దారించుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం కూల్చివేతలకు రెడీ అయ్యారు. ఈ కూల్చివేతల వ్యవహారం.. సంచలనం గా మారింది. ఇక, ఈ ఆక్రమణ తాలూకు భవనం రోడ్డుకు ఆనుకుని ఉండడంతో సమీపంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు.
This post was last modified on January 5, 2025 5:04 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…