తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో శనివారం పర్యటించారు. ఇక్కడ అక్రమంగా కడుతున్న ఐదు అంతస్థుల భవనంపై ఆయన దృష్టి పెట్టారు.
ఇది అక్రమ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే.. అయ్యప్ప సొసైటీ కీలకనేతకు చెందింది కావడం తో చాలా వరకు తాత్సారం జరిగింది. అయినప్పటికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో చర్యలకు దిగారు.
శనివారం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీని పరిశీలించిన.. రంగనాథ్.. ఆ వెంటనే ఆదివారం కూల్చి వేతలకు ఆదేశించారు. దీంతో ఆదివారం ఉదయాన్నే బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. సొసైటీలోని 100 అడుగుల రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనాన్ని కూల్చి వేస్తున్నారు.
వాస్తవానికి అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం ఇప్పుడు కొత్తకాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఒకటి రెండు కూల్చివేతలు చోటు చేసుకున్నాయి.
అయినా.. అయ్యప్ప సొసైటీ తీరు మారడం లేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందటే అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు కూడా అందాయి. ఈ క్రమంలోనే శనివారం రంగనాథ్ క్షేత్రస్తాయిలోకి దిగి పరిశీలన చేశారు. అనంతరం.. ఆక్రమనలు నిజమేనని నిర్దారించుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం కూల్చివేతలకు రెడీ అయ్యారు. ఈ కూల్చివేతల వ్యవహారం.. సంచలనం గా మారింది. ఇక, ఈ ఆక్రమణ తాలూకు భవనం రోడ్డుకు ఆనుకుని ఉండడంతో సమీపంలో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు.
This post was last modified on January 5, 2025 5:04 pm
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని…
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…