మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన బస్సులను బీజేపీ నేతలు తగులబెట్టారని, వారి కంటే జగన్ చాలా నయమని జేసీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఇక, టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీ లతను జేసీ అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి సత్యకుమార్ తో పాటు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. వయసుకు తగ్గట్లు జేసీ మాట్లాడాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే తాజాగా జేసీకి మాధవీ లత కౌంటర్ ఇచ్చారు.
వయసైపోయిన పెద్ద మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలని, ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం తెలుపుతున్నానని మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. తనపై కేసు నమోదైందని వింటున్నానని, తనకు పోలీసుల నుంచి సమాచారం రాలేదని అన్నారు. అయితే, తనను చంపాలనుకుంటే వెంటనే చంపేయాలని, కానీ, మహిళల రక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని మాధవీ లత చెప్పారు.
మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని ఆమె అన్నారు. ఒంటరిగానైనా పోరాడతానని తెలిపారు. ఇక, సినిమాల్లో ఉన్నవాళ్లంతా ప్రాస్టిట్యూట్ లు అని ఆయన మాట్లాడారని, కాబట్టి ఆయన జిల్లా నుంచి ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దని సూచించారు. తనపై వచ్చే వార్తలు చూసి, తనకు నవ్వొస్తుందని అన్నారు. ఒకసారి తాడిపత్రికి వచ్చి చూడండి.. తాడిపత్రి అంటే ఏంటో.. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది…అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు మాధవీ లత స్పందించారు. తాడిపత్రికి వచ్చేందుకు భయమేస్తోందని మాధవీలత రిప్లై ఇచ్చారు.
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…