మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన బస్సులను బీజేపీ నేతలు తగులబెట్టారని, వారి కంటే జగన్ చాలా నయమని జేసీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఇక, టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీ లతను జేసీ అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి సత్యకుమార్ తో పాటు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. వయసుకు తగ్గట్లు జేసీ మాట్లాడాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే తాజాగా జేసీకి మాధవీ లత కౌంటర్ ఇచ్చారు.
వయసైపోయిన పెద్ద మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలని, ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం తెలుపుతున్నానని మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. తనపై కేసు నమోదైందని వింటున్నానని, తనకు పోలీసుల నుంచి సమాచారం రాలేదని అన్నారు. అయితే, తనను చంపాలనుకుంటే వెంటనే చంపేయాలని, కానీ, మహిళల రక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని మాధవీ లత చెప్పారు.
మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని ఆమె అన్నారు. ఒంటరిగానైనా పోరాడతానని తెలిపారు. ఇక, సినిమాల్లో ఉన్నవాళ్లంతా ప్రాస్టిట్యూట్ లు అని ఆయన మాట్లాడారని, కాబట్టి ఆయన జిల్లా నుంచి ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దని సూచించారు. తనపై వచ్చే వార్తలు చూసి, తనకు నవ్వొస్తుందని అన్నారు. ఒకసారి తాడిపత్రికి వచ్చి చూడండి.. తాడిపత్రి అంటే ఏంటో.. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తుంది…అని ఒక నెటిజన్ చేసిన కామెంట్ కు మాధవీ లత స్పందించారు. తాడిపత్రికి వచ్చేందుకు భయమేస్తోందని మాధవీలత రిప్లై ఇచ్చారు.
This post was last modified on January 3, 2025 7:14 pm
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు…