దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా అని నోరప్పగించి చూసే పనిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని మనసా వాచా నమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ కార్యకర్తల జీవితాలకు భరోసా ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం.
ఏం చేశారు?
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది 97 లక్షలపైచిలుకుకు చేరుకుంది. మరో నెల రోజుల్లో మరో 3 లక్షల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేపథ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన అంశం.
దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీలకు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబ్బరంగా ఉండాలని.. ఆ కార్యకర్త కుటుంబం కూడా పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏంటి ప్రయోజనం..
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…