Political News

దేశంలో ఏ పార్టీ చేయ‌గ‌ల‌దు.. టీడీపీ త‌ప్ప‌!!

దేశంలో వంద‌ల సంఖ్య‌లో పార్టీలు ఉన్నాయి. జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయ‌ని ప‌ని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా అని నోరప్ప‌గించి చూసే ప‌నిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.

పార్టీకి కార్య‌క‌ర్త‌లే ప‌ట్టుకొమ్మ‌లు అని మ‌న‌సా వాచా న‌మ్మే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆ కార్య‌క‌ర్త‌ల జీవితాల‌కు భ‌రోసా ఇస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్ర‌తి ఒక్క‌రికీ భ‌విష్య‌త్తుపై భ‌రోసా క‌ల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఏం చేశారు?

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవ‌ల టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇది 97 ల‌క్ష‌ల‌పైచిలుకుకు చేరుకుంది. మ‌రో నెల రోజుల్లో మ‌రో 3 ల‌క్ష‌ల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేప‌థ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్ర‌ధాన అంశం.

దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీల‌కు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుంద‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త నిబ్బరంగా ఉండాల‌ని.. ఆ కార్య‌క‌ర్త కుటుంబం కూడా ప‌దిలంగా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్న‌ట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఏంటి ప్ర‌యోజ‌నం..

  • ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది.
  • ఒక‌వేళ కార్య‌క‌ర్త మృతి చెందితే.. రూ.15 ల‌క్ష‌లను ఆయ‌న‌పై ఆధార‌ప‌డిన కుటుంబానికి చెల్లిస్తారు.
  • ఏదైనా ప్ర‌మాదంలో గాయ‌ప‌డితే త‌క్ష‌ణ సాయంగా 50 వేల రూపాయ‌లు అందుతుంది.
  • ప్ర‌మాదంలో గాయ‌ప‌డి మేజ‌ర్ ఆప‌రేష‌న్లు అవ‌స‌ర‌మైన వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 ల‌క్ష‌లు చెల్లిస్తారు.
  • బీమాకు సంబంధించిన స‌మాచారం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయం(మంగ‌ళ‌గిరి)లో ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు.

This post was last modified on January 3, 2025 8:11 am

Share

Recent Posts

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

3 minutes ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

17 minutes ago

ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం?

అడుసు తొక్కనేల…కాలు కడగనేల..అనే సామెతను పెద్దలు ఊరికే వేయలేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు,…

45 minutes ago

బాలయ్య కొడుకు కోసం కొత్త ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రెండు దశాబ్దాల కిందటే తెరంగేట్రం చేశాడు. అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులూ ఒకరి…

3 hours ago

లోక‌ల్‌వార్‌లో జ‌న‌సేన కోరిక‌లు బాబు తీర్చేనా..?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జ‌న‌సేన నాయ‌కుల కోరిక‌లకు కూట‌మి పెద్ద టీడీపీ గ్రీన్‌సిగ్న‌ల్…

5 hours ago

మారెమ్మకు మాస్ రాజా ప్రోత్సాహం సరిపోతుందా

స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…

5 hours ago