దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా అని నోరప్పగించి చూసే పనిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని మనసా వాచా నమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ కార్యకర్తల జీవితాలకు భరోసా ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం.
ఏం చేశారు?
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది 97 లక్షలపైచిలుకుకు చేరుకుంది. మరో నెల రోజుల్లో మరో 3 లక్షల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేపథ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన అంశం.
దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీలకు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబ్బరంగా ఉండాలని.. ఆ కార్యకర్త కుటుంబం కూడా పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏంటి ప్రయోజనం..
This post was last modified on January 3, 2025 8:11 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…