దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా అని నోరప్పగించి చూసే పనిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని మనసా వాచా నమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ కార్యకర్తల జీవితాలకు భరోసా ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం.
ఏం చేశారు?
రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది 97 లక్షలపైచిలుకుకు చేరుకుంది. మరో నెల రోజుల్లో మరో 3 లక్షల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేపథ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన అంశం.
దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది. ఈ క్రమంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీలకు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త నిబ్బరంగా ఉండాలని.. ఆ కార్యకర్త కుటుంబం కూడా పదిలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏంటి ప్రయోజనం..
This post was last modified on January 3, 2025 8:11 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…