Political News

దేశంలో ఏ పార్టీ చేయ‌గ‌ల‌దు.. టీడీపీ త‌ప్ప‌!!

దేశంలో వంద‌ల సంఖ్య‌లో పార్టీలు ఉన్నాయి. జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయ‌ని ప‌ని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా అని నోరప్ప‌గించి చూసే ప‌నిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది.

పార్టీకి కార్య‌క‌ర్త‌లే ప‌ట్టుకొమ్మ‌లు అని మ‌న‌సా వాచా న‌మ్మే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆ కార్య‌క‌ర్త‌ల జీవితాల‌కు భ‌రోసా ఇస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్ర‌తి ఒక్క‌రికీ భ‌విష్య‌త్తుపై భ‌రోసా క‌ల్పిస్తూ.. ఒప్పందం చేసుకున్నారు. ఇలా.. ఏ పార్టీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఏం చేశారు?

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవ‌ల టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇది 97 ల‌క్ష‌ల‌పైచిలుకుకు చేరుకుంది. మ‌రో నెల రోజుల్లో మ‌రో 3 ల‌క్ష‌ల మంది చేరితే.. కోటి మందికి చేరుతుంది. ఈ నేప‌థ్యంలో వారి పేరున భారీ ఎత్తున టీడీపీ బీమా చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌ఖ్యాత బీమా కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ ప్రతినిధులు టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్ర‌ధాన అంశం.

దీని ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వ‌ర్తిస్తుంది. ఈ క్ర‌మంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద రూ.42 కోట్లను కంపెనీల‌కు చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లించుంతుంద‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త నిబ్బరంగా ఉండాల‌ని.. ఆ కార్య‌క‌ర్త కుటుంబం కూడా ప‌దిలంగా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్న‌ట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఏంటి ప్ర‌యోజ‌నం..

  • ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది.
  • ఒక‌వేళ కార్య‌క‌ర్త మృతి చెందితే.. రూ.15 ల‌క్ష‌లను ఆయ‌న‌పై ఆధార‌ప‌డిన కుటుంబానికి చెల్లిస్తారు.
  • ఏదైనా ప్ర‌మాదంలో గాయ‌ప‌డితే త‌క్ష‌ణ సాయంగా 50 వేల రూపాయ‌లు అందుతుంది.
  • ప్ర‌మాదంలో గాయ‌ప‌డి మేజ‌ర్ ఆప‌రేష‌న్లు అవ‌స‌ర‌మైన వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 ల‌క్ష‌లు చెల్లిస్తారు.
  • బీమాకు సంబంధించిన స‌మాచారం కోసం టీడీపీ కేంద్ర కార్యాలయం(మంగ‌ళ‌గిరి)లో ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు.

This post was last modified on January 3, 2025 8:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

29 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

1 hour ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago