వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండ చూసుకొని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్యరమైన పోస్టులు పెట్టారని కేసులు నమోదైన సంగతి తెలిసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి వ్యక్తిత్వ హననానికి అనిల్ పాల్పడిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే అనిల్ పై పలు కేసులు నమోదు కాగా..ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో అనిల్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కానీ, అనిల్ కు షాకిస్తూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా అనిల్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు అనిల్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్నించింది. ఇటువంటి వారిని క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడింది. అందుకే, అతడికి బెయిల్ మంజూరు చేయడం లేదని తేల్చి చెప్పింది.
కాగా, గుంటూరులోని అరండల్ పేట్ లో ఉన్న ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకాష్ ను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ పై ఉన్నారు. ఆ కేసులో కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.
This post was last modified on January 2, 2025 12:47 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…