జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారు. గడచిన 20 రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్ళటం ఇది మూడోసారి. మొదటిసారి ఢిల్లీకి వెళ్ళిన జగన్ రెండు రోజుల్లో రెండుసార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. తర్వాత వారం రోజులకే పిలుపు రావటంతో మళ్ళీ దేశ రాజధానికి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అయ్యారు. దాదాపు 50 నిముషాల పాటు జరిగిన భేటిలో కీలక విషయాలు మాట్లాడుకున్నట్లు ప్రచారం జరిగింది కానీ అవేమిటో మాత్రం బయటకు రాలేదు.
అయితే ఢిల్లీ నుండి తిరిగి రాగానే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఆరుగురు జడ్జీలు, చంద్రబాబునాయుడు, మాజీ అడ్వకేట్ జనరల్ పై జగన్ ఫిర్యాదులు చేస్తు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకు రాసిన లేఖ దేశంలోనే సంచలనంగా మారింది. న్యాయ, రాజకీయ ప్రముఖులపై జగన్ చేసిన ఫిర్యాదు దాదాపు 19 జాతీయ ఇంగ్లీషు దినపత్రికల్లో వచ్చిందంటేనే విషయం ఎంత సంచలనమైందో అర్ధమైపోతుంది.
జగన్ ఫిర్యాదు విషయం వెలుగు చూడగానే పాజిటివ్ , నెటిగివ్ గా చర్చల జోరు పెరిగిపోతోంది. న్యాయవ్యవస్ధలోని నిపుణుల్లో కొందరు జగన్ చేసిన ఫిర్యాదుకు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వస్తోంది. మొత్తం మీద జగన్ ఫిర్యాదు పర్యవసానం ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తం మీద జగన్ ఢిల్లీ పర్యటనగానే రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఇటువంటి నేపధ్యంలోనే జగన్ మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారంటేనే విషయం ఏదో చాలా సీరియస్ గా ఉందనే అనిపిస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడి అపాయిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వాళ్ళ ఆఫీసుల నుండి కబురు రావటం ఆలస్యం వెంటనే ఢిల్లీకి వెళ్ళటానికి జగన్ రెడీగా ఉన్నారట. ఇపుడు గనుక ముఖ్యమంత్రి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారంటే నిజంగానే దశం దృష్టి యావత్తు జగన్ పర్యటనపైనే ఉంటుందనటంలో సందేహం లేదు.
This post was last modified on October 13, 2020 9:31 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…