Political News

తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి సంబంధించి స‌రికొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. దీనికి ‘తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి’ అనే పేరును పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ ప్రాజెక్టుల‌కు ఏపీకి గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావ‌రి-కృష్ణా న‌దుల జలాల‌ను రాయ‌ల‌సీమ‌కు మ‌ళ్లించ‌నున్న‌ట్టు తెలిపారు. మొత్తంగా 300 టీఎంసీల జ‌లాల‌ను సీమ జిల్లాల‌కు అందించ‌నున్నారు. ఈ ప్రాజెక్టును మూడు ద‌శ‌ల్లో నిర్మించ‌నున్నారు. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.

ఏంటీ ప్రాజెక్టు?

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమలోని ప‌లు జిల్లాలు సాగునీరు లేక ఇబ్బందులు ప‌డుతున్నాయి. దీనివ‌ల్ల వ‌ల‌స‌లు కూడా పెరిగిపోయి.. ప్ర‌జ‌లు దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. ఒక్క సీమ జిల్లాలే కాకుండా.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోనూ త‌ర‌చుగా క‌రువు ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల‌కు సాగునీరు అందించాల‌న్న‌ది ‘తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి’ ప్రాజెక్టు ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే.. న‌దుల అనుసంధానంతో పాటు.. ఆయా జిల్లాల ప్ర‌జ‌ల‌కు సాగునీరు, అదేవిధంగా మ‌రిన్ని ప్రాంతాల‌కు తాగునీరు అంద‌నుంది.

ఎక్క‌డ నుంచి ఎక్క‌డి దాకా?

తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి ప్రాజెక్టును గోదావ‌రి-కృష్ణాన‌దుల నీటిని క‌ల‌ప‌డం ద్వారా.. బ‌న‌క‌చ‌ర్ల‌కు తీసుకువెళ్తారు. ఈ నీరు కృష్ణా ప‌శ్చిమ ప్రాంతం నుంచి తూర్పుడెల్టాల‌కు నీరు ఇచ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డ నుంచి బ‌న‌క‌చ‌ర్ల‌కు త‌ర‌లిస్తారు. మొత్తం గోదావ‌రిలోని మిగులు జ‌లాల‌ను ఈ ప్రాజెక్టు ద్వారా పొలాల‌కు మ‌ళ్లించ‌నున్నారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకువ‌స్తారు. ఇక్కడి నుంచి క‌ర్నూలు జిల్లాలోని బనకచర్లకు నీటిని పంపుతారు. ఇది మొత్తం మూడు ద‌శ‌ల్లో నిర్మాణం అవుతుంది.

దీని వ‌ల్ల ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల‌కు సాగునీరు అంద‌నుంది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం న‌ల్ల‌మ‌ల అట‌వీ(క‌ర్నూలు) ప్రాంతంలో ట‌న్నెల్ నిర్మాణం జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు వివ‌రాల‌ను ప్ర‌ధాని మోడీకి పంపించిన త‌ర్వాత‌.. కేంద్ర సాయంతో ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. సాధ్య‌మైనంత వేగంగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తే.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌(మ‌రో మ‌లుపు) అవుతుంద‌న్నారు.

This post was last modified on December 30, 2024 8:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

18 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

35 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago