ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి ‘తెలుగు తల్లికి జల హారతి’ అనే పేరును పెట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్టులకు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి-కృష్ణా నదుల జలాలను రాయలసీమకు మళ్లించనున్నట్టు తెలిపారు. మొత్తంగా 300 టీఎంసీల జలాలను సీమ జిల్లాలకు అందించనున్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించనున్నారు. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టామని చంద్రబాబు వివరించారు.
ఏంటీ ప్రాజెక్టు?
ప్రస్తుతం రాయలసీమలోని పలు జిల్లాలు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనివల్ల వలసలు కూడా పెరిగిపోయి.. ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక్క సీమ జిల్లాలే కాకుండా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ తరచుగా కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సాగునీరు అందించాలన్నది ‘తెలుగు తల్లికి జల హారతి’ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. నదుల అనుసంధానంతో పాటు.. ఆయా జిల్లాల ప్రజలకు సాగునీరు, అదేవిధంగా మరిన్ని ప్రాంతాలకు తాగునీరు అందనుంది.
ఎక్కడ నుంచి ఎక్కడి దాకా?
తెలుగు తల్లికి జల హారతి ప్రాజెక్టును గోదావరి-కృష్ణానదుల నీటిని కలపడం ద్వారా.. బనకచర్లకు తీసుకువెళ్తారు. ఈ నీరు కృష్ణా పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పుడెల్టాలకు నీరు ఇచ్చిన తర్వాత.. ఇక్కడ నుంచి బనకచర్లకు తరలిస్తారు. మొత్తం గోదావరిలోని మిగులు జలాలను ఈ ప్రాజెక్టు ద్వారా పొలాలకు మళ్లించనున్నారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకువస్తారు. ఇక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్లకు నీటిని పంపుతారు. ఇది మొత్తం మూడు దశల్లో నిర్మాణం అవుతుంది.
దీని వల్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, నెల్లూరులోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందనుంది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం నల్లమల అటవీ(కర్నూలు) ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం జరగాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు వివరాలను ప్రధాని మోడీకి పంపించిన తర్వాత.. కేంద్ర సాయంతో పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తే.. ఏపీకి గేమ్ ఛేంజర్(మరో మలుపు) అవుతుందన్నారు.
This post was last modified on December 30, 2024 8:47 pm
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…