ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి ‘తెలుగు తల్లికి జల హారతి’ అనే పేరును పెట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్టులకు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి-కృష్ణా నదుల జలాలను రాయలసీమకు మళ్లించనున్నట్టు తెలిపారు. మొత్తంగా 300 టీఎంసీల జలాలను సీమ జిల్లాలకు అందించనున్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించనున్నారు. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టామని చంద్రబాబు వివరించారు.
ఏంటీ ప్రాజెక్టు?
ప్రస్తుతం రాయలసీమలోని పలు జిల్లాలు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనివల్ల వలసలు కూడా పెరిగిపోయి.. ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక్క సీమ జిల్లాలే కాకుండా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ తరచుగా కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సాగునీరు అందించాలన్నది ‘తెలుగు తల్లికి జల హారతి’ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. నదుల అనుసంధానంతో పాటు.. ఆయా జిల్లాల ప్రజలకు సాగునీరు, అదేవిధంగా మరిన్ని ప్రాంతాలకు తాగునీరు అందనుంది.
ఎక్కడ నుంచి ఎక్కడి దాకా?
తెలుగు తల్లికి జల హారతి ప్రాజెక్టును గోదావరి-కృష్ణానదుల నీటిని కలపడం ద్వారా.. బనకచర్లకు తీసుకువెళ్తారు. ఈ నీరు కృష్ణా పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పుడెల్టాలకు నీరు ఇచ్చిన తర్వాత.. ఇక్కడ నుంచి బనకచర్లకు తరలిస్తారు. మొత్తం గోదావరిలోని మిగులు జలాలను ఈ ప్రాజెక్టు ద్వారా పొలాలకు మళ్లించనున్నారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకువస్తారు. ఇక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్లకు నీటిని పంపుతారు. ఇది మొత్తం మూడు దశల్లో నిర్మాణం అవుతుంది.
దీని వల్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, నెల్లూరులోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందనుంది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం నల్లమల అటవీ(కర్నూలు) ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం జరగాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు వివరాలను ప్రధాని మోడీకి పంపించిన తర్వాత.. కేంద్ర సాయంతో పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తే.. ఏపీకి గేమ్ ఛేంజర్(మరో మలుపు) అవుతుందన్నారు.
This post was last modified on December 30, 2024 8:47 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…