Political News

తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి సంబంధించి స‌రికొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. దీనికి ‘తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి’ అనే పేరును పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ ప్రాజెక్టుల‌కు ఏపీకి గేమ్ ఛేంజ‌ర్ అవుతుంద‌ని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావ‌రి-కృష్ణా న‌దుల జలాల‌ను రాయ‌ల‌సీమ‌కు మ‌ళ్లించ‌నున్న‌ట్టు తెలిపారు. మొత్తంగా 300 టీఎంసీల జ‌లాల‌ను సీమ జిల్లాల‌కు అందించ‌నున్నారు. ఈ ప్రాజెక్టును మూడు ద‌శ‌ల్లో నిర్మించ‌నున్నారు. కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.

ఏంటీ ప్రాజెక్టు?

ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమలోని ప‌లు జిల్లాలు సాగునీరు లేక ఇబ్బందులు ప‌డుతున్నాయి. దీనివ‌ల్ల వ‌ల‌స‌లు కూడా పెరిగిపోయి.. ప్ర‌జ‌లు దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. ఒక్క సీమ జిల్లాలే కాకుండా.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోనూ త‌ర‌చుగా క‌రువు ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల‌కు సాగునీరు అందించాల‌న్న‌ది ‘తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి’ ప్రాజెక్టు ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే.. న‌దుల అనుసంధానంతో పాటు.. ఆయా జిల్లాల ప్ర‌జ‌ల‌కు సాగునీరు, అదేవిధంగా మ‌రిన్ని ప్రాంతాల‌కు తాగునీరు అంద‌నుంది.

ఎక్క‌డ నుంచి ఎక్క‌డి దాకా?

తెలుగు త‌ల్లికి జ‌ల హార‌తి ప్రాజెక్టును గోదావ‌రి-కృష్ణాన‌దుల నీటిని క‌ల‌ప‌డం ద్వారా.. బ‌న‌క‌చ‌ర్ల‌కు తీసుకువెళ్తారు. ఈ నీరు కృష్ణా ప‌శ్చిమ ప్రాంతం నుంచి తూర్పుడెల్టాల‌కు నీరు ఇచ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డ నుంచి బ‌న‌క‌చ‌ర్ల‌కు త‌ర‌లిస్తారు. మొత్తం గోదావ‌రిలోని మిగులు జ‌లాల‌ను ఈ ప్రాజెక్టు ద్వారా పొలాల‌కు మ‌ళ్లించ‌నున్నారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకువ‌స్తారు. ఇక్కడి నుంచి క‌ర్నూలు జిల్లాలోని బనకచర్లకు నీటిని పంపుతారు. ఇది మొత్తం మూడు ద‌శ‌ల్లో నిర్మాణం అవుతుంది.

దీని వ‌ల్ల ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా, నెల్లూరులోని కొన్ని ప్రాంతాల‌కు సాగునీరు అంద‌నుంది. అయితే.. ఈ ప్రాజెక్టు కోసం న‌ల్ల‌మ‌ల అట‌వీ(క‌ర్నూలు) ప్రాంతంలో ట‌న్నెల్ నిర్మాణం జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు వివ‌రాల‌ను ప్ర‌ధాని మోడీకి పంపించిన త‌ర్వాత‌.. కేంద్ర సాయంతో ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. సాధ్య‌మైనంత వేగంగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తే.. ఏపీకి గేమ్ ఛేంజ‌ర్‌(మ‌రో మ‌లుపు) అవుతుంద‌న్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

4 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago