Political News

రేవంత్ రెడ్డిని గుర్తుపట్టని మన్మోహన్ కుమార్తె

పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత తీవ్రంగా స్పందించారో తెలిసిందే. ఐతే పుష్ప-2కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అర్జున్ తన పేరు మరిచిపోవడం వల్లే ఈ కేసును రేవంత్ రెడ్డి అంత తీవ్రంగా తీసుకున్నారని.. బన్నీ మీద కక్ష గట్టి అతడి మీదికి పోలీసులను ఉసిగొల్పారనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో నడిచింది.

ముఖ్యంగా రేవంత్ పేరును బన్నీ మరిచిపోవడాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ప్రయత్నించిన మాట వాస్తవం. ఐతే రేవంత్ తనకు ఐడెంటిటీ క్రైసిస్ ఎంతమాత్రం లేదని.. ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని సోమవారం అసెంబ్లీలో చెప్పకనే చెప్పేశారు.

ఇటీవలే మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన కుమార్తె తనను గుర్తు పట్టని విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పడం విశేషం. మన్మోహన్‌కు నివాళి అర్పించే క్రమంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

మన్మోహన్ అంత్యక్రియల సందర్భంగా తనను దగ్గరికి పిలిచారని.. ఐతే పార్థివ దేహానికి దగ్గరగా వెళ్లి నిలబడ్డ సమయంలో ఒక మహిళ తనను మీరెవరని అడిగిందని.. తనకు కూడా ఆమె ఎవరో తెలియలేదని రేవంత్ తెలిపారు. తాను ఎవరో ఆమెకు తెలియలేదు, ఆమె ఎవరో తనకు తెలియలేదు అంటే ఆమె ఎంత సింపుల్ మనిషో అర్థం చేసుకోవచ్చని.. తన పిల్లల్ని మన్మోహన్ అంత బాగా పెంచారని.. పదేళ్ల పాటు ప్రధానిగా పని చేసిన వ్యక్తి పిల్లలు అంత సింపుల్‌గా వినయంగా ఉండడం అరుదైన విషయమని.. ఇది మన్మోహన్ గొప్పదనానికి నిదర్శనమని కొనియాడారు రేవంత్ రెడ్డి.

This post was last modified on December 30, 2024 8:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

4 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

5 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

5 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

7 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

7 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

7 hours ago