Political News

అప్పుడు బూతులు.. ఇప్పుడు నీతులా: పేర్నిపై ప‌వ‌న్ ఫైర్‌

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఫైర‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు బూతులు తిట్టిన‌వారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్ట‌మ‌ని ఆయ‌న‌కు ఎవ‌రు చెప్పారు? ఎవ‌రు పెట్టారు? అని ప్ర‌శ్నించారు. రేష‌న్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇంట్లో ఆడ‌వాళ్ల‌తో గోదాములు నిర్మించార‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నార‌ని అన్నారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక విష‌యాలు ప్ర‌స్తావించారు. పేర్ని నాని త‌ప్పులు చేశార‌ని.. ఆ త‌ప్పులే ఇప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను రోడ్డుకు లాగాయ‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. వైసీపీ నాయ‌కులు బ‌రితెగించి మాట్లాడార‌ని.. సీఎం చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పైనా ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేద‌న్నారు.

బేరీజు వేయండి!

ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ట్టి స‌వాలే విసిరారు. గ‌తంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాల‌నను.. ఇప్పుడు ఎన్డీయే కూట‌మి ఆరు మాసాల పాల‌న‌ను బేరీజు వేయాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. వైసీపీ పాల‌న కంటే వంద రెట్లు ఎక్కువ‌గా త‌మ పాల‌న బాగుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌స్థ‌ల‌ను సంస్క‌రించామ‌ని, వైసీపీ హ‌యాంలో ధ్వంస‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేశామ‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం చెప్పారు.

“మేం ప‌ద‌వులు అనుభ‌వించ‌డం లేదు. ప‌నిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్నాం. మా ఆరు నెల‌ల పాల‌న‌కు, వైసీపీ ఆరు మాసాల పాల‌న‌కు మ‌ధ్య న‌క్క‌కు-నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ గ్రామాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని ఆదిశ‌గా మ‌న రాష్ట్రంలోనూ అభివృద్దిప‌నులు చేప‌డ‌తామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.

This post was last modified on December 30, 2024 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

36 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago