వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫైరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టినవారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్టమని ఆయనకు ఎవరు చెప్పారు? ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంట్లో ఆడవాళ్లతో గోదాములు నిర్మించారని.. ఇప్పుడు మళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నారని అన్నారు.
తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్చాట్గా మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. పేర్ని నాని తప్పులు చేశారని.. ఆ తప్పులే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను రోడ్డుకు లాగాయని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడారని.. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపైనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని దుయ్యబట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేదన్నారు.
బేరీజు వేయండి!
ఈ సందర్భంగా వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ గట్టి సవాలే విసిరారు. గతంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాలనను.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ఆరు మాసాల పాలనను బేరీజు వేయాలని ఆయన సవాల్ రువ్వారు. వైసీపీ పాలన కంటే వంద రెట్లు ఎక్కువగా తమ పాలన బాగుందన్నారు. ఇప్పటి వరకు వ్యవస్థలను సంస్కరించామని, వైసీపీ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను బాగు చేశామని.. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
“మేం పదవులు అనుభవించడం లేదు. పనిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్యతతో పనిచేస్తున్నాం. మా ఆరు నెలల పాలనకు, వైసీపీ ఆరు మాసాల పాలనకు మధ్య నక్కకు-నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గ్రామాలను సస్యశ్యామలం చేయాలని కలలు కంటున్నారని ఆదిశగా మన రాష్ట్రంలోనూ అభివృద్దిపనులు చేపడతామని పవన్ కల్యాణ్ చెప్పారు.
This post was last modified on December 30, 2024 3:55 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…