వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫైరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టినవారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్టమని ఆయనకు ఎవరు చెప్పారు? ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంట్లో ఆడవాళ్లతో గోదాములు నిర్మించారని.. ఇప్పుడు మళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నారని అన్నారు.
తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్చాట్గా మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. పేర్ని నాని తప్పులు చేశారని.. ఆ తప్పులే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను రోడ్డుకు లాగాయని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడారని.. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపైనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని దుయ్యబట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేదన్నారు.
బేరీజు వేయండి!
ఈ సందర్భంగా వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ గట్టి సవాలే విసిరారు. గతంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాలనను.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ఆరు మాసాల పాలనను బేరీజు వేయాలని ఆయన సవాల్ రువ్వారు. వైసీపీ పాలన కంటే వంద రెట్లు ఎక్కువగా తమ పాలన బాగుందన్నారు. ఇప్పటి వరకు వ్యవస్థలను సంస్కరించామని, వైసీపీ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను బాగు చేశామని.. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
“మేం పదవులు అనుభవించడం లేదు. పనిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్యతతో పనిచేస్తున్నాం. మా ఆరు నెలల పాలనకు, వైసీపీ ఆరు మాసాల పాలనకు మధ్య నక్కకు-నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గ్రామాలను సస్యశ్యామలం చేయాలని కలలు కంటున్నారని ఆదిశగా మన రాష్ట్రంలోనూ అభివృద్దిపనులు చేపడతామని పవన్ కల్యాణ్ చెప్పారు.
This post was last modified on December 30, 2024 3:55 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…