వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫైరయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టినవారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్టమని ఆయనకు ఎవరు చెప్పారు? ఎవరు పెట్టారు? అని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంట్లో ఆడవాళ్లతో గోదాములు నిర్మించారని.. ఇప్పుడు మళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నారని అన్నారు.
తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్చాట్గా మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. పేర్ని నాని తప్పులు చేశారని.. ఆ తప్పులే ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను రోడ్డుకు లాగాయని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడారని.. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపైనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని దుయ్యబట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేదన్నారు.
బేరీజు వేయండి!
ఈ సందర్భంగా వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ గట్టి సవాలే విసిరారు. గతంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాలనను.. ఇప్పుడు ఎన్డీయే కూటమి ఆరు మాసాల పాలనను బేరీజు వేయాలని ఆయన సవాల్ రువ్వారు. వైసీపీ పాలన కంటే వంద రెట్లు ఎక్కువగా తమ పాలన బాగుందన్నారు. ఇప్పటి వరకు వ్యవస్థలను సంస్కరించామని, వైసీపీ హయాంలో ధ్వంసమైన వ్యవస్థలను బాగు చేశామని.. ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు.
“మేం పదవులు అనుభవించడం లేదు. పనిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్యతతో పనిచేస్తున్నాం. మా ఆరు నెలల పాలనకు, వైసీపీ ఆరు మాసాల పాలనకు మధ్య నక్కకు-నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ గ్రామాలను సస్యశ్యామలం చేయాలని కలలు కంటున్నారని ఆదిశగా మన రాష్ట్రంలోనూ అభివృద్దిపనులు చేపడతామని పవన్ కల్యాణ్ చెప్పారు.
This post was last modified on December 30, 2024 3:55 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…