Political News

అప్పుడు బూతులు.. ఇప్పుడు నీతులా: పేర్నిపై ప‌వ‌న్ ఫైర్‌

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఫైర‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు బూతులు తిట్టిన‌వారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్ట‌మ‌ని ఆయ‌న‌కు ఎవ‌రు చెప్పారు? ఎవ‌రు పెట్టారు? అని ప్ర‌శ్నించారు. రేష‌న్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇంట్లో ఆడ‌వాళ్ల‌తో గోదాములు నిర్మించార‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నార‌ని అన్నారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక విష‌యాలు ప్ర‌స్తావించారు. పేర్ని నాని త‌ప్పులు చేశార‌ని.. ఆ త‌ప్పులే ఇప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను రోడ్డుకు లాగాయ‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. వైసీపీ నాయ‌కులు బ‌రితెగించి మాట్లాడార‌ని.. సీఎం చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పైనా ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేద‌న్నారు.

బేరీజు వేయండి!

ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ట్టి స‌వాలే విసిరారు. గ‌తంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాల‌నను.. ఇప్పుడు ఎన్డీయే కూట‌మి ఆరు మాసాల పాల‌న‌ను బేరీజు వేయాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. వైసీపీ పాల‌న కంటే వంద రెట్లు ఎక్కువ‌గా త‌మ పాల‌న బాగుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌స్థ‌ల‌ను సంస్క‌రించామ‌ని, వైసీపీ హ‌యాంలో ధ్వంస‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేశామ‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం చెప్పారు.

“మేం ప‌ద‌వులు అనుభ‌వించ‌డం లేదు. ప‌నిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్నాం. మా ఆరు నెల‌ల పాల‌న‌కు, వైసీపీ ఆరు మాసాల పాల‌న‌కు మ‌ధ్య న‌క్క‌కు-నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ గ్రామాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని ఆదిశ‌గా మ‌న రాష్ట్రంలోనూ అభివృద్దిప‌నులు చేప‌డ‌తామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.

This post was last modified on December 30, 2024 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

6 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

10 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

11 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

12 hours ago

నోటాతో పోటిపడ్డ నేతకు జగన్ రెడ్ కార్పెట్

ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…

12 hours ago