Political News

అప్పుడు బూతులు.. ఇప్పుడు నీతులా: పేర్నిపై ప‌వ‌న్ ఫైర్‌

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నానిపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఫైర‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు బూతులు తిట్టిన‌వారే.. ఇప్పుడు నీతులు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. భార్య పేరుతో గిడ్డంగి పెట్ట‌మ‌ని ఆయ‌న‌కు ఎవ‌రు చెప్పారు? ఎవ‌రు పెట్టారు? అని ప్ర‌శ్నించారు. రేష‌న్ బియ్యాన్ని మాయం చేసింది నిజం కాదా.. దీనికి పెనాలిటీ చెల్లించింది నిజం కాదా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇంట్లో ఆడ‌వాళ్ల‌తో గోదాములు నిర్మించార‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ వారిపేరుతో సెంటిమెంటు నీతులు చెబుతున్నార‌ని అన్నారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక విష‌యాలు ప్ర‌స్తావించారు. పేర్ని నాని త‌ప్పులు చేశార‌ని.. ఆ త‌ప్పులే ఇప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను రోడ్డుకు లాగాయ‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. వైసీపీ నాయ‌కులు బ‌రితెగించి మాట్లాడార‌ని.. సీఎం చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పైనా ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టా రు. అధికారం పోయినా.. అహంకారం పోలేద‌న్నారు.

బేరీజు వేయండి!

ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ట్టి స‌వాలే విసిరారు. గ‌తంలో వైసీపీ తొలి ఆరు మాసాల పాల‌నను.. ఇప్పుడు ఎన్డీయే కూట‌మి ఆరు మాసాల పాల‌న‌ను బేరీజు వేయాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. వైసీపీ పాల‌న కంటే వంద రెట్లు ఎక్కువ‌గా త‌మ పాల‌న బాగుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌స్థ‌ల‌ను సంస్క‌రించామ‌ని, వైసీపీ హ‌యాంలో ధ్వంస‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేశామ‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం చెప్పారు.

“మేం ప‌ద‌వులు అనుభ‌వించ‌డం లేదు. ప‌నిచేస్తున్నాం. అది కూడా చాలా బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్నాం. మా ఆరు నెల‌ల పాల‌న‌కు, వైసీపీ ఆరు మాసాల పాల‌న‌కు మ‌ధ్య న‌క్క‌కు-నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంది. బేరీజు వేయండి!” అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ గ్రామాల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని ఆదిశ‌గా మ‌న రాష్ట్రంలోనూ అభివృద్దిప‌నులు చేప‌డ‌తామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.

This post was last modified on December 30, 2024 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

1 hour ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago