సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దాఖలైన కేసులో హీరో అల్లు అర్జున్పై అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరిని కలచి వేసింది. పోలీసులు అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. కానీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
మధ్యంతర బెయిల్ అనంతరం, రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, పోలీసులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసులో పోలీసులు, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందు వినిపించారు. తాజాగా, సోమవారం కోర్టు విచారణ సందర్భంగా, ఇరుపక్షాల వాదనలు కీలకంగా సాగాయి.
ఈ వాదనలు ఆలకించిన కోర్టు, నిర్ణయాన్ని జనవరి 3కు వాయిదా వేసింది. తద్వారా అల్లు అర్జున్ బెయిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, ప్రదర్శకులు, పోలీసులు అన్నీ వైపుల ఉన్న పొరపాట్లు ప్రస్తావనకు వస్తుండటంతో, ఈ తీర్పు కీలకంగా మారనుంది. ఇంతలో, అభిమానులు అల్లు అర్జున్ పై నమ్మకం వ్యక్తం చేస్తూ, తీర్పు తమ హీరోకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 30, 2024 1:10 pm
తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…
పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రాధాన్యం తగ్గించేసి చాలా కాలం అయింది. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా పీ-4 విధానంపై దృష్టి పెట్టారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్గా పే ర్కొంటున్న ఈ విధానాన్ని ప్రజల్లోకి…
స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…
అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…