సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దాఖలైన కేసులో హీరో అల్లు అర్జున్పై అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరిని కలచి వేసింది. పోలీసులు అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. కానీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
మధ్యంతర బెయిల్ అనంతరం, రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, పోలీసులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసులో పోలీసులు, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందు వినిపించారు. తాజాగా, సోమవారం కోర్టు విచారణ సందర్భంగా, ఇరుపక్షాల వాదనలు కీలకంగా సాగాయి.
ఈ వాదనలు ఆలకించిన కోర్టు, నిర్ణయాన్ని జనవరి 3కు వాయిదా వేసింది. తద్వారా అల్లు అర్జున్ బెయిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, ప్రదర్శకులు, పోలీసులు అన్నీ వైపుల ఉన్న పొరపాట్లు ప్రస్తావనకు వస్తుండటంతో, ఈ తీర్పు కీలకంగా మారనుంది. ఇంతలో, అభిమానులు అల్లు అర్జున్ పై నమ్మకం వ్యక్తం చేస్తూ, తీర్పు తమ హీరోకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 30, 2024 1:10 pm
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…