సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దాఖలైన కేసులో హీరో అల్లు అర్జున్పై అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరిని కలచి వేసింది. పోలీసులు అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. కానీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
మధ్యంతర బెయిల్ అనంతరం, రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, పోలీసులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసులో పోలీసులు, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందు వినిపించారు. తాజాగా, సోమవారం కోర్టు విచారణ సందర్భంగా, ఇరుపక్షాల వాదనలు కీలకంగా సాగాయి.
ఈ వాదనలు ఆలకించిన కోర్టు, నిర్ణయాన్ని జనవరి 3కు వాయిదా వేసింది. తద్వారా అల్లు అర్జున్ బెయిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, ప్రదర్శకులు, పోలీసులు అన్నీ వైపుల ఉన్న పొరపాట్లు ప్రస్తావనకు వస్తుండటంతో, ఈ తీర్పు కీలకంగా మారనుంది. ఇంతలో, అభిమానులు అల్లు అర్జున్ పై నమ్మకం వ్యక్తం చేస్తూ, తీర్పు తమ హీరోకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…