సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దాఖలైన కేసులో హీరో అల్లు అర్జున్పై అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరిని కలచి వేసింది. పోలీసులు అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. కానీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
మధ్యంతర బెయిల్ అనంతరం, రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, పోలీసులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసులో పోలీసులు, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందు వినిపించారు. తాజాగా, సోమవారం కోర్టు విచారణ సందర్భంగా, ఇరుపక్షాల వాదనలు కీలకంగా సాగాయి.
ఈ వాదనలు ఆలకించిన కోర్టు, నిర్ణయాన్ని జనవరి 3కు వాయిదా వేసింది. తద్వారా అల్లు అర్జున్ బెయిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, ప్రదర్శకులు, పోలీసులు అన్నీ వైపుల ఉన్న పొరపాట్లు ప్రస్తావనకు వస్తుండటంతో, ఈ తీర్పు కీలకంగా మారనుంది. ఇంతలో, అభిమానులు అల్లు అర్జున్ పై నమ్మకం వ్యక్తం చేస్తూ, తీర్పు తమ హీరోకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 30, 2024 1:10 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…