సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దాఖలైన కేసులో హీరో అల్లు అర్జున్పై అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం అందరిని కలచి వేసింది. పోలీసులు అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. కానీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
మధ్యంతర బెయిల్ అనంతరం, రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, పోలీసులకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసులో పోలీసులు, అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందు వినిపించారు. తాజాగా, సోమవారం కోర్టు విచారణ సందర్భంగా, ఇరుపక్షాల వాదనలు కీలకంగా సాగాయి.
ఈ వాదనలు ఆలకించిన కోర్టు, నిర్ణయాన్ని జనవరి 3కు వాయిదా వేసింది. తద్వారా అల్లు అర్జున్ బెయిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, ప్రదర్శకులు, పోలీసులు అన్నీ వైపుల ఉన్న పొరపాట్లు ప్రస్తావనకు వస్తుండటంతో, ఈ తీర్పు కీలకంగా మారనుంది. ఇంతలో, అభిమానులు అల్లు అర్జున్ పై నమ్మకం వ్యక్తం చేస్తూ, తీర్పు తమ హీరోకు అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…