కొన్ని కొన్ని అంశాలను లెక్కలు.. కూడికలు, తీసివేతలతో చెబితే తప్ప.. ఎవరికీ అర్థం కాదు. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్కు కూడా.. సీమకు చెందిన ఓ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ‘రఫ్గా కొన్ని లెక్కలు’ పేరుతో జగన్కు ఆయన మైనస్లు, ప్లస్లు వివరించే ప్రయత్నం చేశారు. వీటిని జగన్ అమలు చేస్తారా? తనను తాను పరిశీలించుకుని సరిదిద్దుకుంటారా? అనేది చూడాలి. ఏదేమైనా.. ప్రస్తుతం సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన సూచనలు మాత్రం పార్టీ వరకు చేరాయి.
మాజీ ఎమ్మెల్యే సూచించిన విషయాలను పరిశీలిస్తే.. రఫ్గా అంటూనే బలమైన కారణాలు చెప్పుకొచ్చారు. ఈ విషయాలపై జగన్ రియలైజ్ అయితే.. బాగానే ఉంటుంది. అయితే.. ఆయన ఆదిశగా ఆలోచన చేస్తారా? అన్నది మాత్రం ప్రశ్నగానే మారింది. ఇంతకీ ఈ సీనియర్ నాయకుడు ఏం చెప్పారంటే.. ప్రస్తుతం మనకు.. నిరసనలు చేసే అవకాశం లేదు. ఇంకా సమయం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. చంద్రబాబు నిరసనలు చేస్తే.. మనం యాగీ చేశాం కదా! అని తొలి సూచన చేశారు.
ఇది కొంత కటువుగానే ఉంది. కానీ, వాస్తవం. ఇక, కార్యకర్తలను, నాయకులను రోడ్డు మీదకు పంపించి.. మీరు మాత్రం బెంగళూరులో విశ్రాంతి తీసుకోవడం సరిగా లేదు. దీనిపై సొంత పార్టీలోనే చర్చ సాగుతోం ది. దీనిని మార్చుకుని మీరు కూడా ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. దీనికి ముహూర్తాలు పెట్టుకోవడం కూడా సరిగాలేదు. అని రెండో సూచన చేశారు. పార్టీలో నిద్రాణంగా ఉన్న అలసత్వాన్ని తరిమి కొట్టేందుకు మీరు నడుం బిగించాలి. లేకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోయే వారే ఎక్కువగా ఉన్నారు. అని మూడో సూచన చేశారు.
వీటితోపాటు.. అసలు మన స్టాండ్ ఏంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమా? లేక.. ప్రజలకు చేరువ కావడమా? అనే విషయంలో క్లారిటీ కావాలని సదరు నాయకులు నిలదీశారు. ఈ విషయాలు చాలా లైట్గా ఉన్నాయని అనుకున్నా.. ఇవే విషయాలు పార్టీలోనూ చర్చకు వస్తున్నాయి. పార్టీ అధినేతగా జగన్ తీసుకునే స్టాండు కోసం.. కార్యకర్తలు, నాయకులు కూడా వేచి చూస్తున్నారు. కానీ, ఈ విషయంలో ఆయనకు క్లారిటీలేదు. మరి రఫ్గా పంపించిన ఈ సూచనలనైనా జగన్ పాటిస్తారో లేదో చూడాలి.
This post was last modified on December 30, 2024 10:32 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…