Political News

‘ప‌ల్లె పండుగ ‘తో ప‌వ‌న్ మైలేజీ.. ఎలా ఉందో తెలుసా ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్షేత్ర‌స్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీల‌క‌మైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయ‌న క‌న్నేశార‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండ‌గా ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాల‌కే ప‌రిమిత‌మైనా.. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. 37 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇవ‌న్నీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా ద‌క్కిన‌వే.

ఇప్పుడు వీటినే టార్గెట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం అడుగులు కాదు.. అంగ‌లు వేస్తున్నారు. ప‌ల్లె ప్రాంతాల్లో ప‌ట్టు పెంచుకునే దిశ‌గా ఆయ‌న వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతున్నారు. కేంద్రం నుంచి విరివిగా నిధులు తెచ్చుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. మ‌రీముఖ్యంగా ప‌ల్లెల్లో ఏళ్ల త‌ర‌బ‌డి ర‌హ‌దారి సౌక‌ర్యం లేక పోవ‌డం.. ఇంటింటికీ కుళాయి సౌక‌ర్య లేని వైనంపై ఆయ‌న యుద్ధ‌మే చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న నిధుల‌ను నేరుగా అక్క‌డ‌కే మ‌ళ్లిస్తున్నారు.

ప‌ల్లె పండుగ‌-పేరులో గ్రామీణ‌, మ‌న్యం ప్రాంతాల్లో ర‌హ‌దారి నిర్మాణాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మైలేజీ పెంచుతోంది. తాజాగా అర‌కు, పాడేరు ప్రాంతాల్లోని గిరిజ‌న ఆవాసాల‌కు నిర్మిం చిన ర‌హ‌దారులు.. అక్క‌డ ప‌వ‌న్ ఇమేజ్‌ను భారీగా పెంచాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారి నిర్మాణాలు.. ఇంటింటికీ నీరు.. వంటివి కూడా … ప‌వ‌న్‌కు పాజిటివ్ టాక్ పెరిగేలా చేశాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాతే కాదు.. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ర‌హ‌దారులు లేనిగ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి మ‌న్యం ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. అదేవిధంగా.. ర‌హ‌దారుల నిర్మాణాల‌ను అధికారుల‌కు అప్ప‌గించినా.. తానే స్వ‌యంగా రంగంలోకి దిగి ప‌రిశీలిస్తున్నారు. ఇవ‌న్నీ కూడా.. ప‌నులు నాణ్యంగా సాగేందుకు అవినీతి లేకుండా ముందుకు సాగేందుకు కూడా స‌హ‌క‌రిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు..ఆటోమేటిక్‌గానే ప‌వ‌న్‌కు మైలేజీ తెచ్చి పెడుతున్నాయి. అదేస‌మ‌యంలో వైసీపీ ఓటు బ్యాంకును కూడా.. క‌దిలించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నాయి.

Satya

Recent Posts

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…

45 minutes ago

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

2 hours ago

అనంత శ్రీరామ్… ఇదేం లాజిక్?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…

3 hours ago

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

4 hours ago

హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…

4 hours ago

సత్యదేవ్ ఆశలన్నీ బహదూర్ మీదే

ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…

4 hours ago