ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు క్షేత్రస్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయన కన్నేశారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండగా ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాలకే పరిమితమైనా.. ఓటు బ్యాంకు విషయానికి వస్తే.. 37 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇవన్నీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా దక్కినవే.
ఇప్పుడు వీటినే టార్గెట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం అడుగులు కాదు.. అంగలు వేస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో పట్టు పెంచుకునే దిశగా ఆయన వడివడిగా పరుగులు పెడుతున్నారు. కేంద్రం నుంచి విరివిగా నిధులు తెచ్చుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరీముఖ్యంగా పల్లెల్లో ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేక పోవడం.. ఇంటింటికీ కుళాయి సౌకర్య లేని వైనంపై ఆయన యుద్ధమే చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా అక్కడకే మళ్లిస్తున్నారు.
పల్లె పండుగ-పేరులో గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్కు మైలేజీ పెంచుతోంది. తాజాగా అరకు, పాడేరు ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలకు నిర్మిం చిన రహదారులు.. అక్కడ పవన్ ఇమేజ్ను భారీగా పెంచాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలు.. ఇంటింటికీ నీరు.. వంటివి కూడా … పవన్కు పాజిటివ్ టాక్ పెరిగేలా చేశాయి. రాష్ట్ర విభజన తర్వాతే కాదు.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా.. రహదారులు లేనిగ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.
అదేసమయంలో ప్రతి రెండు మాసాలకు ఒకసారి మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ చెబుతున్నారు. అదేవిధంగా.. రహదారుల నిర్మాణాలను అధికారులకు అప్పగించినా.. తానే స్వయంగా రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా.. పనులు నాణ్యంగా సాగేందుకు అవినీతి లేకుండా ముందుకు సాగేందుకు కూడా సహకరిస్తున్నాయి. ఈ పరిణామాలు..ఆటోమేటిక్గానే పవన్కు మైలేజీ తెచ్చి పెడుతున్నాయి. అదేసమయంలో వైసీపీ ఓటు బ్యాంకును కూడా.. కదిలించే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నాయి.
This post was last modified on December 27, 2024 9:23 am
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…