Political News

‘ప‌ల్లె పండుగ ‘తో ప‌వ‌న్ మైలేజీ.. ఎలా ఉందో తెలుసా ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్షేత్ర‌స్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీల‌క‌మైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయ‌న క‌న్నేశార‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండ‌గా ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాల‌కే ప‌రిమిత‌మైనా.. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. 37 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇవ‌న్నీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా ద‌క్కిన‌వే.

ఇప్పుడు వీటినే టార్గెట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం అడుగులు కాదు.. అంగ‌లు వేస్తున్నారు. ప‌ల్లె ప్రాంతాల్లో ప‌ట్టు పెంచుకునే దిశ‌గా ఆయ‌న వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతున్నారు. కేంద్రం నుంచి విరివిగా నిధులు తెచ్చుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. మ‌రీముఖ్యంగా ప‌ల్లెల్లో ఏళ్ల త‌ర‌బ‌డి ర‌హ‌దారి సౌక‌ర్యం లేక పోవ‌డం.. ఇంటింటికీ కుళాయి సౌక‌ర్య లేని వైనంపై ఆయ‌న యుద్ధ‌మే చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న నిధుల‌ను నేరుగా అక్క‌డ‌కే మ‌ళ్లిస్తున్నారు.

ప‌ల్లె పండుగ‌-పేరులో గ్రామీణ‌, మ‌న్యం ప్రాంతాల్లో ర‌హ‌దారి నిర్మాణాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మైలేజీ పెంచుతోంది. తాజాగా అర‌కు, పాడేరు ప్రాంతాల్లోని గిరిజ‌న ఆవాసాల‌కు నిర్మిం చిన ర‌హ‌దారులు.. అక్క‌డ ప‌వ‌న్ ఇమేజ్‌ను భారీగా పెంచాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారి నిర్మాణాలు.. ఇంటింటికీ నీరు.. వంటివి కూడా … ప‌వ‌న్‌కు పాజిటివ్ టాక్ పెరిగేలా చేశాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాతే కాదు.. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ర‌హ‌దారులు లేనిగ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి మ‌న్యం ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. అదేవిధంగా.. ర‌హ‌దారుల నిర్మాణాల‌ను అధికారుల‌కు అప్ప‌గించినా.. తానే స్వ‌యంగా రంగంలోకి దిగి ప‌రిశీలిస్తున్నారు. ఇవ‌న్నీ కూడా.. ప‌నులు నాణ్యంగా సాగేందుకు అవినీతి లేకుండా ముందుకు సాగేందుకు కూడా స‌హ‌క‌రిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు..ఆటోమేటిక్‌గానే ప‌వ‌న్‌కు మైలేజీ తెచ్చి పెడుతున్నాయి. అదేస‌మ‌యంలో వైసీపీ ఓటు బ్యాంకును కూడా.. క‌దిలించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నాయి.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

27 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

35 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago