ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు క్షేత్రస్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయన కన్నేశారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండగా ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాలకే పరిమితమైనా.. ఓటు బ్యాంకు విషయానికి వస్తే.. 37 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇవన్నీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా దక్కినవే.
ఇప్పుడు వీటినే టార్గెట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం అడుగులు కాదు.. అంగలు వేస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో పట్టు పెంచుకునే దిశగా ఆయన వడివడిగా పరుగులు పెడుతున్నారు. కేంద్రం నుంచి విరివిగా నిధులు తెచ్చుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరీముఖ్యంగా పల్లెల్లో ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేక పోవడం.. ఇంటింటికీ కుళాయి సౌకర్య లేని వైనంపై ఆయన యుద్ధమే చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా అక్కడకే మళ్లిస్తున్నారు.
పల్లె పండుగ-పేరులో గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్కు మైలేజీ పెంచుతోంది. తాజాగా అరకు, పాడేరు ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలకు నిర్మిం చిన రహదారులు.. అక్కడ పవన్ ఇమేజ్ను భారీగా పెంచాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలు.. ఇంటింటికీ నీరు.. వంటివి కూడా … పవన్కు పాజిటివ్ టాక్ పెరిగేలా చేశాయి. రాష్ట్ర విభజన తర్వాతే కాదు.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా.. రహదారులు లేనిగ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.
అదేసమయంలో ప్రతి రెండు మాసాలకు ఒకసారి మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ చెబుతున్నారు. అదేవిధంగా.. రహదారుల నిర్మాణాలను అధికారులకు అప్పగించినా.. తానే స్వయంగా రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా.. పనులు నాణ్యంగా సాగేందుకు అవినీతి లేకుండా ముందుకు సాగేందుకు కూడా సహకరిస్తున్నాయి. ఈ పరిణామాలు..ఆటోమేటిక్గానే పవన్కు మైలేజీ తెచ్చి పెడుతున్నాయి. అదేసమయంలో వైసీపీ ఓటు బ్యాంకును కూడా.. కదిలించే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నాయి.
This post was last modified on December 27, 2024 9:23 am
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…