ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు క్షేత్రస్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయన కన్నేశారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండగా ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాలకే పరిమితమైనా.. ఓటు బ్యాంకు విషయానికి వస్తే.. 37 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఇవన్నీ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా దక్కినవే.
ఇప్పుడు వీటినే టార్గెట్ చేస్తూ.. డిప్యూటీ సీఎం అడుగులు కాదు.. అంగలు వేస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో పట్టు పెంచుకునే దిశగా ఆయన వడివడిగా పరుగులు పెడుతున్నారు. కేంద్రం నుంచి విరివిగా నిధులు తెచ్చుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరీముఖ్యంగా పల్లెల్లో ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేక పోవడం.. ఇంటింటికీ కుళాయి సౌకర్య లేని వైనంపై ఆయన యుద్ధమే చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా అక్కడకే మళ్లిస్తున్నారు.
పల్లె పండుగ-పేరులో గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్కు మైలేజీ పెంచుతోంది. తాజాగా అరకు, పాడేరు ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలకు నిర్మిం చిన రహదారులు.. అక్కడ పవన్ ఇమేజ్ను భారీగా పెంచాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలు.. ఇంటింటికీ నీరు.. వంటివి కూడా … పవన్కు పాజిటివ్ టాక్ పెరిగేలా చేశాయి. రాష్ట్ర విభజన తర్వాతే కాదు.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా.. రహదారులు లేనిగ్రామాల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు.
అదేసమయంలో ప్రతి రెండు మాసాలకు ఒకసారి మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ చెబుతున్నారు. అదేవిధంగా.. రహదారుల నిర్మాణాలను అధికారులకు అప్పగించినా.. తానే స్వయంగా రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా.. పనులు నాణ్యంగా సాగేందుకు అవినీతి లేకుండా ముందుకు సాగేందుకు కూడా సహకరిస్తున్నాయి. ఈ పరిణామాలు..ఆటోమేటిక్గానే పవన్కు మైలేజీ తెచ్చి పెడుతున్నాయి. అదేసమయంలో వైసీపీ ఓటు బ్యాంకును కూడా.. కదిలించే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నాయి.
This post was last modified on December 27, 2024 9:23 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…