Political News

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్క‌సారి వాటిని ప‌క్క‌న కూడా పెట్టేస్తారు. కానీ, త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై.. తాజాగా భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేశారు. ప‌ట్టుమ‌ని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయ‌న బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు తాను చెప్పులు వేసుకునేది లేద‌ని సంచ‌ల‌న ప్ర‌తిజ్ఞ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ అన్నామ‌లై?

వాస్త‌వానికి ఐపీఎస్ అధికారి అయిన అన్నామ‌లై.. క‌ర్ణాట‌క‌లో ఎస్పీగా ప‌నిచేశారు. అయితే.. అక్క‌డే ఆయన బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. ఈ క్ర‌మంలోనే సొంత రాష్ట్రానికి వ‌చ్చేశారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నికలు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే సాగాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు రాజ‌కీయంగా బీజేపీలో తిరుగులేకుండా పోయింది. ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. వారిని ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆయ‌న‌ను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను చేశారు.

ప్ర‌తిజ్ఞ ఎందుకు?

త‌ర‌చుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. మీడియాలో ఉండే అన్నామ‌లై.. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల్లోని లోపాల‌ను బాగానే ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా అన్నా యూనివ‌ర్సిటీలో ఓ విద్యార్థినిపై.. అత్యాచారం జ‌రిగింది. దీనికి సంబంధించి డీఎంకే స‌ర్కారుపై ముప్పేట దాడి జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే అన్నామ‌లై.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు న‌శించాయ‌ని.. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని.. డీఎంకే స‌ర్కారు అంత‌మై పోవాల‌నికూడా అన్నామ‌లై చెబుతున్నారు. డీఎంకే స‌ర్కారును గ‌ద్దె దింపి.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వ‌ర‌కు తాను చెప్పులు ధ‌రించే ది లేద‌ని ఆయ‌న భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను నిర‌సిస్తూ.. కొర‌డా దెబ్బ‌లు తింటాన‌ని.. మురుగ‌న్‌(కుమార‌స్వామి) ఆల‌యాల‌ను ద‌ర్శిస్తాన‌ని 48 గంట‌ల పాటు ఉప‌వాస దీక్ష చేస్తాన‌ని కూడా.. చెప్పుకొచ్చారు. మ‌రి ఇవి ఆయ‌న‌కు, బీజేపీకి ఏ మేర‌కు మైలేజీ తెస్తాయో చూడాలి.

This post was last modified on December 26, 2024 11:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

57 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago