Political News

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్క‌సారి వాటిని ప‌క్క‌న కూడా పెట్టేస్తారు. కానీ, త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై.. తాజాగా భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేశారు. ప‌ట్టుమ‌ని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయ‌న బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు తాను చెప్పులు వేసుకునేది లేద‌ని సంచ‌ల‌న ప్ర‌తిజ్ఞ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ అన్నామ‌లై?

వాస్త‌వానికి ఐపీఎస్ అధికారి అయిన అన్నామ‌లై.. క‌ర్ణాట‌క‌లో ఎస్పీగా ప‌నిచేశారు. అయితే.. అక్క‌డే ఆయన బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. ఈ క్ర‌మంలోనే సొంత రాష్ట్రానికి వ‌చ్చేశారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నికలు ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే సాగాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు రాజ‌కీయంగా బీజేపీలో తిరుగులేకుండా పోయింది. ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. వారిని ప‌క్క‌న పెట్టి మ‌రీ ఆయ‌న‌ను రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను చేశారు.

ప్ర‌తిజ్ఞ ఎందుకు?

త‌ర‌చుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. మీడియాలో ఉండే అన్నామ‌లై.. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల్లోని లోపాల‌ను బాగానే ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా అన్నా యూనివ‌ర్సిటీలో ఓ విద్యార్థినిపై.. అత్యాచారం జ‌రిగింది. దీనికి సంబంధించి డీఎంకే స‌ర్కారుపై ముప్పేట దాడి జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే అన్నామ‌లై.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు న‌శించాయ‌ని.. ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని.. డీఎంకే స‌ర్కారు అంత‌మై పోవాల‌నికూడా అన్నామ‌లై చెబుతున్నారు. డీఎంకే స‌ర్కారును గ‌ద్దె దింపి.. బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే వ‌ర‌కు తాను చెప్పులు ధ‌రించే ది లేద‌ని ఆయ‌న భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను నిర‌సిస్తూ.. కొర‌డా దెబ్బ‌లు తింటాన‌ని.. మురుగ‌న్‌(కుమార‌స్వామి) ఆల‌యాల‌ను ద‌ర్శిస్తాన‌ని 48 గంట‌ల పాటు ఉప‌వాస దీక్ష చేస్తాన‌ని కూడా.. చెప్పుకొచ్చారు. మ‌రి ఇవి ఆయ‌న‌కు, బీజేపీకి ఏ మేర‌కు మైలేజీ తెస్తాయో చూడాలి.

This post was last modified on December 26, 2024 11:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

3 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

4 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

5 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

5 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

5 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

6 hours ago