కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని కొన్ని విషయాల్లో అసంతృప్తులు.. అలకలు ఉన్నాయి. అయితే.. ఎవరూ బయటకు చెప్పరు. అలాగని అంతర్మథనంతో వదిలేయరు. రాజధానికి నిధులు, పోలవరానికి నిదులు, అభివృద్ధి నిధులు వంటివి మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. వీటిపైనే ఎప్పుడూ చర్చిస్తున్నారు. అయితే.. ఇప్పటికి ఆరు మాసాలు గడిచిపోయిన తర్వాత.. ప్రజలకు చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మనసులోని మాటను ప్రధాని మోడీకి వివరించారని తెలిసింది. తాజాగా ఆయన ఢిల్లీలో పర్యటించారు. వాజపేయి శత జయంతి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం దాదాపు గంటకుపైగానే ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరు మాసాల ఏపీ పాలన, పథకాలు.. కేంద్రం నుంచి వచ్చే సొమ్ములు, రావాల్సిన సొమ్ములపైనా ఇరువురు నాయకులు కూడా చర్చించుకున్నా రు. ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని.. ప్రధాని మోడీ మరోసారి చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.
అయితే.. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి కీలకమైన రెండు పథకాలను అమలు చేయాలని నిర్ణయించినట్టు చంద్రబాబు మోడీ ముందు చెప్పుకొచ్చినట్టు సమాచారం. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం వంటివి అమలు చేయాలని నిర్ణయించామని.. ఇవి కూటమి పార్టీల తరఫున తామే ఇచ్చిన హామీలుగా ఆయన చెప్పుకొచ్చారు. వీటికి సంబంధించి సగం మీరూ పంచుకోవాలని.. ఆయన అభ్యర్థించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మహారాష్ట్రలో ‘బేటీ బెహెన్’ పథకానికి కేంద్రం 40 శాతం నిధులు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసినట్టు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం పుంజుకునేందుకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుందని.. దీనిలో కొన్నింటిని కేంద్రం కూడా.. ఏదో ఒక రూపంలో(పద్దు) ఆదుకోవాలని.. ఆయన కోరినట్టు సమాచారం. మహిళలకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులపై పన్నుల మినహాయిం పును కోరినట్టు తెలిసింది. తద్వారా.. రాష్ట్రంపై 100 కోట్ల భారం తగ్గనుంది.
అదేవిధంగా జీఎస్టీలో 1 శాతం అదనంగా తమకు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. అయితే.. దీనిపై ప్రధాని మౌనంగా ఉన్నారని.. కూటమి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 26, 2024 10:14 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…