Political News

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని కొన్ని విష‌యాల్లో అసంతృప్తులు.. అల‌క‌లు ఉన్నాయి. అయితే.. ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌రు. అలాగ‌ని అంత‌ర్మ‌థ‌నంతో వ‌దిలేయ‌రు. రాజ‌ధానికి నిధులు, పోల‌వ‌రానికి నిదులు, అభివృద్ధి నిధులు వంటివి మాత్ర‌మే పైకి క‌నిపిస్తున్నాయి. వీటిపైనే ఎప్పుడూ చ‌ర్చిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికి ఆరు మాసాలు గ‌డిచిపోయిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు చేయాల్సిన ప‌నులు చాలా మిగిలి ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌న మ‌న‌సులోని మాట‌ను ప్ర‌ధాని మోడీకి వివ‌రించార‌ని తెలిసింది. తాజాగా ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించారు. వాజ‌పేయి శ‌త జ‌యంతి వేడుక‌లో పాల్గొన్నారు. అనంత‌రం దాదాపు గంటకుపైగానే ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆరు మాసాల ఏపీ పాల‌న‌, ప‌థ‌కాలు.. కేంద్రం నుంచి వ‌చ్చే సొమ్ములు, రావాల్సిన సొమ్ముల‌పైనా ఇరువురు నాయ‌కులు కూడా చ‌ర్చించుకున్నా రు. ఏపీకి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని.. ప్ర‌ధాని మోడీ మ‌రోసారి చంద్ర‌బాబుకు హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

అయితే.. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది నుంచి కీల‌క‌మైన రెండు ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు చంద్ర‌బాబు మోడీ ముందు చెప్పుకొచ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు, అదేవిధంగా రైతుల‌కు పెట్టుబ‌డి సాయం వంటివి అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని.. ఇవి కూట‌మి పార్టీల త‌ర‌ఫున తామే ఇచ్చిన హామీలుగా ఆయ‌న చెప్పుకొచ్చారు. వీటికి సంబంధించి స‌గం మీరూ పంచుకోవాల‌ని.. ఆయ‌న అభ్య‌ర్థించిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

మ‌హారాష్ట్ర‌లో ‘బేటీ బెహెన్‌’ ప‌థ‌కానికి కేంద్రం 40 శాతం నిధులు ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌కటించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేసిన‌ట్టు స‌మాచారం. ఏపీలో కూట‌మి ప్రభుత్వం పుంజుకునేందుకు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల్సి ఉంటుంద‌ని.. దీనిలో కొన్నింటిని కేంద్రం కూడా.. ఏదో ఒక రూపంలో(ప‌ద్దు) ఆదుకోవాల‌ని.. ఆయ‌న కోరిన‌ట్టు స‌మాచారం. మ‌హిళ‌లకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణానికి సంబంధించి ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌పై ప‌న్నుల మిన‌హాయిం పును కోరిన‌ట్టు తెలిసింది. త‌ద్వారా.. రాష్ట్రంపై 100 కోట్ల భారం త‌గ్గ‌నుంది.

అదేవిధంగా జీఎస్టీలో 1 శాతం అద‌నంగా త‌మ‌కు వ‌సూలు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై ప్ర‌ధాని మౌనంగా ఉన్నార‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు త‌మ స‌హ‌కారం ఉంటుంద‌ని తెలిపిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. మ‌రి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 26, 2024 10:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

35 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

53 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago