Political News

ప‌ద‌హారు వేల‌ ప‌దవులు.. చంద్ర‌బాబు బీసీ మంత్రం.. !

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో బీసీ మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. వారికి ఇప్ప‌టికే.. స‌రైన స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. మంత్రి వ‌ర్గంలో చోటు పెట్టారు. అదేవిధంగా కార్పొ రేష‌న్ ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అయినా.. ఎక్క‌డో బీసీల్లో అసంతృప్తి పెరుగుతోంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు స‌రికొత్త మంత్రం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఏకంగా 16500 బీసీ నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్నారు.

నిజానికి ఆయా ప‌ద‌వులు.. గ‌త వైసీపీ హ‌యాంలో ప‌క్క‌న పెట్టారు. నిధుల కొర‌త‌.. కార్యాల‌యాల ఏర్పాటు .. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త కొర‌వ‌డ‌డం వంటి కార‌ణాల‌తో 16500 ప‌ద‌వులను కూడా.. ప‌క్క‌న పెట్టారు. అయినప్పటికీ.. ఆలోటు రాకుండా జ‌గ‌న్ మేనేజ్ చేయ‌గ‌లిగారు. ఇత‌ర ప‌ద‌వుల‌తో వారిని సంతృప్తి ప‌రిచారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుకు ఇంటా బ‌య‌టా కూడా.. బీసీల నుంచి ఒత్తిడి పెరిగింది. దీనిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఫ‌లితం క‌నిపించ‌డం లేదు.

దీంతో మ‌రుగున ప‌డ్డ బీసీ ప‌ద‌వులను తెర‌మీదికి తీసుకువ‌చ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బీసీ సామాజిక వ‌ర్గాల కార్పొరేష‌న్ల‌ను పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ ర‌కంగా మొత్తం 16500 ప‌ద‌వుల‌ను వారికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌ద్వారా సంతృప్తి పెంచాల‌ని చూస్తున్నారు. వీటిలో నాయీబ్రాహ్మ‌ణ‌, ర‌జ‌క‌, వ‌డ్డెర త‌దిత‌ర కులాల‌కు ప్రాధాన్యం ఇస్తారు.

అయితే.. ఇప్ప‌టికే వీరికి కార్పొరేష‌న్లు ఉన్నందున స్థానికంగా ఉండే వెసులుబాటును బ‌ట్టి ప‌ద‌వులు ఇవ్వ నున్నారు. అదేవిధంగా బీసీల్లో మేధావులు, విద్యావంతుల‌కు వీసీలుగా.. ఉన్న‌త విద్యామండ‌లిలోనూ ..ఏపీపీఎస్సీలోనూ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇవ‌న్నీ.. వెయ్యిలోపు ఉంటాయి. కానీ, ఇత‌ర ప‌ద‌వుల విష‌యంలో మాత్రం కొంత మేర‌కు ఆల‌స్యం జ‌రిగే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యానికి మొత్తంగా 10 వేల‌కుపైగానే నామినేటెడ్ పోస్టుల‌ను బీసీల‌కు అందించాల‌న్న‌ది చంద్ర‌బాబు ల‌క్ష్యం. త‌ద్వారా స్థానిక ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని భావిస్తున్నారు.

This post was last modified on December 25, 2024 7:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

22 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

2 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

6 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

7 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

7 hours ago