ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతోపాటు.. పూల కుండీలు కూడా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఇక, ఈ వ్యవహారంపై అల్లు అరవింద్ స్పందించారు. తమ ఇంటి ముందు జరిగిన ఆందోళనను అందరూ చూశారని.. ఇలాంటి ఘటనలు జరగడం సరికాదని అన్నారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగరాదని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరరూ సంయమనం పాటించాలని అరవింద్ కోరారు. “అందరూ సంయమనం పాటించాలి… అదే మంచిది“ అని వ్యాఖ్యానించారు.
ఇక, తమ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అరవింద్ తెలిపారు. ఘటనను వారు కూడా పరిశీలించారని అన్నారు. ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తాము ఏం మాట్లాడినా ఇబ్బందే అవుతుందని చెప్పారు. అయినా.. తప్పడం లేదన్నారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. మరోవైపు.. ఈ దాడి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. దీనిని తాను ఖండిస్తున్నానని తెలిపారు.
అయితే..ఎక్కడా పేరు చెప్పకుండా.. ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా.. అని మాత్రమే రేవంత్రెడ్డి పేర్కొనడం గమనార్హం. అయితే.. ఇలాంటి చర్యల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆయన ట్యాగ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా ఉండాలని.. తెలిపారు. మరోవైపు.. సంధ్య ధియేటర్ వద్ద ఈ నెల 4న జరిగిన ఘటనలో సంబంధం లేని పోలీసులు స్పందించడంపైనా సీఎం రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనతో సంబంధం లేని పోలీసులు మీడియా ముందుకురాకుండా చర్యలు తీసుకోవాలని.. కూడా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
This post was last modified on December 22, 2024 10:48 pm
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…