Political News

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న నోటి నుంచి ఏది వ‌చ్చినా.. చాలా వాల్యుగా ఉంటుంది. పైగా.. ఆయ‌న చెప్పింది.. బీజేపీకి వేదంగా కూడా భావిస్తారు. అలాంటి భాగ‌వ‌త్ నోటి నుంచి “మసీదులు-మందిరాల ర‌గ‌డ వ‌ద్దు” అని రావ‌డం అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. అయితే..ఇది నిజంగానే ఆయ‌న మ‌నసులోని మాటేనా? అనేది కూడా సందేహం.

ఎందుకంటే.. ఆర్ ఎస్ ఎస్ అంటేనే హిందూవాదం.. క‌ట్టుబొట్టు! రామ జ‌న్మభూమి ఉదంతాన్ని భుజాన వేసుకుని ముందుకు సాగారు. అంతేకాదు.. మ‌ధుర‌లో శ్రీకృష్ణ జ‌న్మ‌స్థ‌లం అంటూ.. పిటిష‌న్లు వేసింది కూడా.. ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌లే. అయితే.. ఇలాంటి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న మోహ‌న్ భ‌గ‌వ‌త్ .. ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. స‌మ్మిల స‌మాజం, సామ‌ర‌స్యం అంటూ.. పెద్ద లెక్చ‌రే ఇచ్చారు. అంటే.. ముస్లింలు, హిందువులు క‌లిసి క‌ట్టుగా ఉండాల‌న్న‌ది ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

కానీ, ఇంత పెద్ద హిందూవాది.. ఒక్క‌సారిగా ఇలా వ్యాఖ్యానించ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది. అయితే.. ఈ విష‌యంలో మోడీపై ఆయ‌న‌కు ఉన్న అక్క‌సు.. ఆగ్ర‌హం వంటివి బ‌య‌ప‌డుతున్నాయ‌న్న చ‌ర్చ సాగుతోంది. కేంద్రంలో మోడీ స‌ర్కారు వ‌చ్చిన నాటి నుంచి కూడా బీజేపీ త‌న పంథాను ప్ర‌త్యేకంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. అంటే.. ఆర్ఎస్ఎస్ అడుగు జాడ‌ల‌ను దాదాపు ప‌క్క‌న పెట్టింది. ఈ క్ర‌మంలో మోడీపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ వాదుల‌ను దాదాపు ప‌క్క‌న పెట్ట‌డం కూడా.. వారికి ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే చాలా వ్యూహాత్మ‌కంగా మోహ‌న్ భగ‌వ‌త్ వ్య‌వ‌హ‌రించార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నాయ‌కుడే ఇలా.. సామ‌ర‌స్యం స‌మ్మిళిత స‌మాజం కోసం.. ప్ర‌య‌త్నిస్తే.. ఇక‌, బీజేపీ మ‌రింత కిందికి దిగాలి. కానీ, యూపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అక్క‌డి సంభాల్ ప్రాంతంలో ఉన్న మ‌సీదును కూల్చేయాల‌న్న డిమాండ్లు పెరుగుతున్న స‌మ‌యంలో మోహ‌న్ భగ‌వ‌త్ చేసిన వ్యాఖ్యలతో స‌హ‌జంగానే బీజేపీ ఇరుకున ప‌డ‌డం ఖాయం. మ‌రి దీనిని లైట్ తీసుకుంటారో.. లేక ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 21, 2024 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

21 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago