రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన నోటి నుంచి ఏది వచ్చినా.. చాలా వాల్యుగా ఉంటుంది. పైగా.. ఆయన చెప్పింది.. బీజేపీకి వేదంగా కూడా భావిస్తారు. అలాంటి భాగవత్ నోటి నుంచి “మసీదులు-మందిరాల రగడ వద్దు” అని రావడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అయితే..ఇది నిజంగానే ఆయన మనసులోని మాటేనా? అనేది కూడా సందేహం.
ఎందుకంటే.. ఆర్ ఎస్ ఎస్ అంటేనే హిందూవాదం.. కట్టుబొట్టు! రామ జన్మభూమి ఉదంతాన్ని భుజాన వేసుకుని ముందుకు సాగారు. అంతేకాదు.. మధురలో శ్రీకృష్ణ జన్మస్థలం అంటూ.. పిటిషన్లు వేసింది కూడా.. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే. అయితే.. ఇలాంటి నాయకత్వం వహిస్తున్న మోహన్ భగవత్ .. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. సమ్మిల సమాజం, సామరస్యం అంటూ.. పెద్ద లెక్చరే ఇచ్చారు. అంటే.. ముస్లింలు, హిందువులు కలిసి కట్టుగా ఉండాలన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
కానీ, ఇంత పెద్ద హిందూవాది.. ఒక్కసారిగా ఇలా వ్యాఖ్యానించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈ విషయంలో మోడీపై ఆయనకు ఉన్న అక్కసు.. ఆగ్రహం వంటివి బయపడుతున్నాయన్న చర్చ సాగుతోంది. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన నాటి నుంచి కూడా బీజేపీ తన పంథాను ప్రత్యేకంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. అంటే.. ఆర్ఎస్ఎస్ అడుగు జాడలను దాదాపు పక్కన పెట్టింది. ఈ క్రమంలో మోడీపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ వాదులను దాదాపు పక్కన పెట్టడం కూడా.. వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే చాలా వ్యూహాత్మకంగా మోహన్ భగవత్ వ్యవహరించారన్న చర్చ సాగుతోంది. ఆర్ఎస్ఎస్ నాయకుడే ఇలా.. సామరస్యం సమ్మిళిత సమాజం కోసం.. ప్రయత్నిస్తే.. ఇక, బీజేపీ మరింత కిందికి దిగాలి. కానీ, యూపీలో జరుగుతున్న పరిణామాలు.. అక్కడి సంభాల్ ప్రాంతంలో ఉన్న మసీదును కూల్చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న సమయంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో సహజంగానే బీజేపీ ఇరుకున పడడం ఖాయం. మరి దీనిని లైట్ తీసుకుంటారో.. లేక ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 21, 2024 5:59 pm
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…