Political News

మరోసారి పవన్ పనిని మెచ్చిన జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. యూత్ ని కూడా ఎట్రాక్ట్ చేసేలా మాట్లాడగలరు. గతంలో జనసేన లో ఉన్న లక్ష్మీనారాయణ మళ్ళీ పవన్ సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. అనంతరం సొంతంగా పార్టీ పెట్టి గ్రామా స్థాయి లెవెల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

ఇక పార్టీ పెట్టినా కూడా ఆయన విపక్షాల తరహాలో ఎల్లప్పుడూ విమర్శలు చేయకుండా మంచి పనులు చేసినప్పుడు ప్రభుత్వంపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కూడా ఇటీవల ప్రశంసలు కురిపించడం విశేషం. పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల గ్రామంలో పర్యటనతో పవన్ గిరిజన అభివృద్ధి అంశాన్ని ముందుకు తెచ్చారు.

బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా గ్రామ అభివృద్ధికి తన కట్టుబాటును చాటారు. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్‌ను ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లక్ష్మీనారాయణ, గిరిజన ప్రాంతాల్లో పర్యటించినందుకు పవన్‌ను అభినందించారు.

గిరిపుత్రుల అభివృద్ధి కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. “రాజ్యాంగంలోని 46, 244, 244ఏ, 275(1) అధికరణలు గిరిజనుల హక్కులను పరిరక్షించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడ్డాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో మీ నాయకత్వం కీలకంగా ఉంటుంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పొగడ్తలు చూస్తుంటే మళ్ళీ ఆయన జనసేనకు దగ్గరవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పుడూ కూడా ఆ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక నెటిజన్లు చేసే కామెంట్స్ కూడా దరిచేరకుండా కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు.

This post was last modified on December 21, 2024 3:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

15 seconds ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

3 hours ago

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…

4 hours ago

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

4 hours ago