సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో అంతగా క్లిక్ కాకపోయినా కూడా ఓ వర్గం జనాల్లో ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. యూత్ ని కూడా ఎట్రాక్ట్ చేసేలా మాట్లాడగలరు. గతంలో జనసేన లో ఉన్న లక్ష్మీనారాయణ మళ్ళీ పవన్ సినిమాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నారు. అనంతరం సొంతంగా పార్టీ పెట్టి గ్రామా స్థాయి లెవెల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.
ఇక పార్టీ పెట్టినా కూడా ఆయన విపక్షాల తరహాలో ఎల్లప్పుడూ విమర్శలు చేయకుండా మంచి పనులు చేసినప్పుడు ప్రభుత్వంపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కూడా ఇటీవల ప్రశంసలు కురిపించడం విశేషం. పార్వతీపురం మన్యం జిల్లాలోని బాహుజోల గ్రామంలో పర్యటనతో పవన్ గిరిజన అభివృద్ధి అంశాన్ని ముందుకు తెచ్చారు.
బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా గ్రామ అభివృద్ధికి తన కట్టుబాటును చాటారు. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ పవన్ కల్యాణ్ను ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లక్ష్మీనారాయణ, గిరిజన ప్రాంతాల్లో పర్యటించినందుకు పవన్ను అభినందించారు.
గిరిపుత్రుల అభివృద్ధి కోసం పవన్ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. “రాజ్యాంగంలోని 46, 244, 244ఏ, 275(1) అధికరణలు గిరిజనుల హక్కులను పరిరక్షించి, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడ్డాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో మీ నాయకత్వం కీలకంగా ఉంటుంది” అని ట్వీట్లో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ పొగడ్తలు చూస్తుంటే మళ్ళీ ఆయన జనసేనకు దగ్గరవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఎప్పుడూ కూడా ఆ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక నెటిజన్లు చేసే కామెంట్స్ కూడా దరిచేరకుండా కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…