అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించారు. గిరిజనులకు పక్కా రోడ్ల నిర్మిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓజి.. ఓజి అంటూ కేకలు వేస్తున్న తన అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓజి.. ఓజి అంటూ అరుపులు కేకలు పెడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదివరకు సీఎం సీఎం అనే వారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాను కాబట్టి ఆనందించాలని అభిమానులతో పవన్ అన్నారు. ఇంకాపండేహే అంటూ పవన్ తన ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఓజి, ఓజి అంటూ కేకలు పెట్టడం, తనతోపాటు వేరే సినిమా హీరోల పోస్టర్లు పెట్టడం ఓకే అని..కానీ దానితో పాటు భవిష్యత్తు గురించి కూడా యువత ఆలోచించాలని అన్నారు. ఇలా కేరింతలు జేజేలు కొడితే సరిపోదని, జీవితాల పట్ల బాధ్యతగా ఉండి ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు..ఛాతీ మీద కొడితే రోడ్లు రావు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనకు పనిచేయడం ఒక్కటే చేతనవుతుందని,ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి ప్రజలకు కావాల్సిన పనులు మాత్రమే చేయగలనని అన్నారు.
అయితే, తన పని తనను చేసుకోనివ్వాలని, తన మీద పడిపోయి జనం ఇబ్బంది పెడుతుంటే తాను రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించలేనని అన్నారు. మీకు దండం పెడతాను నన్ను పని చేసుకునీయండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
This post was last modified on December 20, 2024 6:58 pm
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…