అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించారు. గిరిజనులకు పక్కా రోడ్ల నిర్మిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఓజి.. ఓజి అంటూ కేకలు వేస్తున్న తన అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓజి.. ఓజి అంటూ అరుపులు కేకలు పెడుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదివరకు సీఎం సీఎం అనే వారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాను కాబట్టి ఆనందించాలని అభిమానులతో పవన్ అన్నారు. ఇంకాపండేహే అంటూ పవన్ తన ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఓజి, ఓజి అంటూ కేకలు పెట్టడం, తనతోపాటు వేరే సినిమా హీరోల పోస్టర్లు పెట్టడం ఓకే అని..కానీ దానితో పాటు భవిష్యత్తు గురించి కూడా యువత ఆలోచించాలని అన్నారు. ఇలా కేరింతలు జేజేలు కొడితే సరిపోదని, జీవితాల పట్ల బాధ్యతగా ఉండి ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు..ఛాతీ మీద కొడితే రోడ్లు రావు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనకు పనిచేయడం ఒక్కటే చేతనవుతుందని,ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి ప్రజలకు కావాల్సిన పనులు మాత్రమే చేయగలనని అన్నారు.
అయితే, తన పని తనను చేసుకోనివ్వాలని, తన మీద పడిపోయి జనం ఇబ్బంది పెడుతుంటే తాను రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించలేనని అన్నారు. మీకు దండం పెడతాను నన్ను పని చేసుకునీయండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
This post was last modified on December 20, 2024 6:58 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…