2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు చెందిన రూ.45 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తోపాటు కొందరు అధికారులపై ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ కేసు విషయం తెలుసుకన్న కేటీఆర్ సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసింగ్ లో కుంభకోణం అని ఆరోపిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో ఆ అంశంపై చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఆ అంశంపై చర్చ పెట్టాలని, సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
ఇక, కేటీఆర్ పై కేసు నమోదు కావడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలాగా ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే ఇలా కేసులు పెడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మితే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ కూడా రాశారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో అవకతవకలు జరగలేదని, కేబినెట్ లో కాదు…అసెంబ్లీలో చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
తెలంగాణ, హైదరాబాద్కు మంచి జరగాలని 2023లో రేస్ను విజయవంతంగా నిర్వహించామని, ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరినందని నీల్సన్ సంస్థ నివేదిక ఇచ్చిందని లేఖలో రాశారు. ఈ ఏడాది జరగాల్సిన రేస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతో రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on December 19, 2024 11:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…