Political News

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు చెందిన రూ.45 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తోపాటు కొందరు అధికారులపై ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ కేసు విషయం తెలుసుకన్న కేటీఆర్ సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసింగ్ లో కుంభకోణం అని ఆరోపిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో ఆ అంశంపై చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఆ అంశంపై చర్చ పెట్టాలని, సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

ఇక, కేటీఆర్ పై కేసు నమోదు కావడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలాగా ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే ఇలా కేసులు పెడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మితే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ కూడా రాశారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో అవకతవకలు జరగలేదని, కేబినెట్ లో కాదు…అసెంబ్లీలో చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.

తెలంగాణ, హైదరాబాద్‌కు మంచి జరగాలని 2023లో రేస్‌ను విజయవంతంగా నిర్వహించామని, ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరినందని నీల్సన్ సంస్థ నివేదిక ఇచ్చిందని లేఖలో రాశారు. ఈ ఏడాది జరగాల్సిన రేస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతో రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on December 19, 2024 11:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

19 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

32 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

1 hour ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago