2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు చెందిన రూ.45 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తోపాటు కొందరు అధికారులపై ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో ఈ కేసు విషయం తెలుసుకన్న కేటీఆర్ సభలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేసింగ్ లో కుంభకోణం అని ఆరోపిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభలో ఆ అంశంపై చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఆ అంశంపై చర్చ పెట్టాలని, సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
ఇక, కేటీఆర్ పై కేసు నమోదు కావడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలాగా ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే ఇలా కేసులు పెడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మితే రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
అంతకుముందు, ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ కూడా రాశారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో అవకతవకలు జరగలేదని, కేబినెట్ లో కాదు…అసెంబ్లీలో చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
తెలంగాణ, హైదరాబాద్కు మంచి జరగాలని 2023లో రేస్ను విజయవంతంగా నిర్వహించామని, ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరినందని నీల్సన్ సంస్థ నివేదిక ఇచ్చిందని లేఖలో రాశారు. ఈ ఏడాది జరగాల్సిన రేస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుతో రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on December 19, 2024 11:02 pm
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…
తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…