పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆ ఎంపీ నా మీదకు వచ్చి పడ్డాడు. అదే సమయంలో నేనూ కిందపడి గాయపడ్డాను,” అని ఆరోపించారు. బీజేపీ వర్గాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, రాహుల్ గాంధీ తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆయన మాట్లాడుతూ, “సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మా తప్పేమీ లేదు,” అని స్పష్టం చేశారు. ఆయన వీడియో ఫుటేజీ పరిశీలించి నిజాలు బయటపెట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాహుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ ఘటనతో పార్లమెంట్ వేదిక మరింత వివాదాస్పదంగా మారింది.
This post was last modified on December 19, 2024 1:43 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…