పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆ ఎంపీ నా మీదకు వచ్చి పడ్డాడు. అదే సమయంలో నేనూ కిందపడి గాయపడ్డాను,” అని ఆరోపించారు. బీజేపీ వర్గాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, రాహుల్ గాంధీ తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆయన మాట్లాడుతూ, “సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మా తప్పేమీ లేదు,” అని స్పష్టం చేశారు. ఆయన వీడియో ఫుటేజీ పరిశీలించి నిజాలు బయటపెట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాహుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ ఘటనతో పార్లమెంట్ వేదిక మరింత వివాదాస్పదంగా మారింది.
This post was last modified on December 19, 2024 1:43 pm
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…