పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆ ఎంపీ నా మీదకు వచ్చి పడ్డాడు. అదే సమయంలో నేనూ కిందపడి గాయపడ్డాను,” అని ఆరోపించారు. బీజేపీ వర్గాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, రాహుల్ గాంధీ తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఆయన మాట్లాడుతూ, “సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మా తప్పేమీ లేదు,” అని స్పష్టం చేశారు. ఆయన వీడియో ఫుటేజీ పరిశీలించి నిజాలు బయటపెట్టాలని కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. బీజేపీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాహుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ ఘటనతో పార్లమెంట్ వేదిక మరింత వివాదాస్పదంగా మారింది.
This post was last modified on December 19, 2024 1:43 pm
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ రివీల్…
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…