దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన.. అందరూ విచారించాల్సిన ఘటన చోటు చేసుకుంది. భారత పార్లమెంటు ముందు.. భవనం పైకి కూడా ఎక్కి అధికార-ప్రతిపక్షాల సభ్యులు పోటా పోటీగా నిరసనకు, ఆందోళనకు దిగారు. ఇలా జరగడం 75 సంవత్సరాల పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా ప్రభుత్వ పక్షాన్ని విమర్శిస్తూ.. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతాయి.
కానీ, ఈ సారి మాత్రం దీనికి విరుద్ధంగా అధికార పక్షమే.. ఆందోళనకు దిగిపోయి.. పార్లమెంటు ముందు రోడ్డెక్కింది. అసలు ఏం జరిగిందంటే.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ను మీరు అవమానించారంటే మీరు అవమానించారంటూ అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్ష ఇండీ కూటమి పార్లమెంటు సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పార్లమెంటు వెలుపల ఇరు పక్షాలకు చెందిన సభ్యులు పోటా పోటీగా నిరసన చేపట్టారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ముందు ఆందోళన చేశారు. అదేవిధంగా అధికార పక్షం బీజేపీ సభ్యులు కూడా.. పార్లమెంటు ముందు నిరసనకు దిగి.. కాంగ్రెస్ పార్టీనే బాబా సాహెబ్ అంబేద్కర్ను అవమానించిందని నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ సభ్యుల తీరును బీజేపీ సభ్యులు ఎండగట్టారు. దీంతో ఉభయ సభల్లోనూ ఎలాంటి కార్యక్రమాలూ జరగలేదు.
రాహుల్-ప్రియాంక ఏం చేశారంటే..
ఇండీ కూటమిలో కీలక నాయకులుగా ఉన్నరాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. గురువారం బ్లూ కలర్ దుస్తులు ధరించి వచ్చారు. నిరసనలకు నేతృత్వం వహించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని.. బీజేపీకి ముఖ్యంగా అమిత్షాకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండీ కూటమి నాయకులను ముందుండి నడిపించారు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…