బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై అలాగే ప్రజాప్రతినిధుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివక్ష చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, వివక్షతో వ్యవహరించడం సరికాదని స్పష్టంగా చెప్పారు.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కల్పించిన సౌకర్యాలను ఇప్పుడు టీటీడీ ఉపేక్షించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు అధిక లబ్ధి పొందారని, ఈ విషయం నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే, రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీటీడీ ఛైర్మన్కు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వివక్ష సమస్యను పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీటీడీపై తీవ్రమైన విమర్శలు రావడం, తెలంగాణ ప్రజాప్రతినిధులకు పూర్తి గుర్తింపునివ్వడం అవసరమని పలువురు తెలంగాణ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సి ఉంది.
This post was last modified on December 19, 2024 11:25 am
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…