Political News

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ్యూనిస్టు ఉద్య‌మ నాయ‌కుడు. కొంద‌రు ఆయ‌న మావోయిస్టుల‌తోనూ ప‌నిచేశార‌ని చెప్పుకొనేవారు. దీనిని ఆయ‌న కూడా దృవీక‌రించారు. అయితే.. వారి విధానాలు న‌చ్చ‌క‌.. తాను ప్ర‌జ‌ల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌రిటాల ర‌వి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ‌లో ఆయ‌న‌పై ప‌లు మార్లు హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హైద‌రాబాద్‌లో ఓ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలోనూ ప‌రిటాల ల‌క్ష్యంగా కారు బాంబు పేలిన విష‌యం తెలిసిందే.

ఇక‌, 2005లో ప‌రిటాల దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాగా.. 18 ఏళ్ల త‌ర్వాత‌.. ఈ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌కు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఏ-3 నారాయ‌ణ రెడ్డి, ఏ-4 రేఖ‌మ‌య్య‌, ఏ-5 రంగ‌నాయ‌కులు, ఏ-6 వ‌డ్డే కొండ‌, ఏ-7 ఓబిరెడ్డిల‌కు తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వీరు అప్ప‌టి నుంచి జైల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. 2005 నుంచి కూడా కేసు విచార‌ణ ఆశించిన విధంగా ముందుకు సాగ‌క‌పోవ‌డం.. సుదీర్ఘ కాలం విచార‌ణ ఖైదీలుగా ఉండ‌డంతో హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2005, జనవరి 24న‌ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల‌తో ప‌రిట‌ల ర‌వి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మానికి అనేకమంది సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. అప్ప‌టికే త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందని గ్ర‌హించిన ర‌వి భారీ ఎత్తున సెక్యూరిటీని కూడా నియ‌మించుకున్నారు. పార్టీ ఆఫీసులోనే మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విపై కొంద‌రు దుండ‌గులు బులెట్ ల వర్షం కురిపించారు. పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ర‌వి దారుణ హ‌త్య అప్ప‌ట్లో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి రేపింది. అయితే.. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

5 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

14 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago