Political News

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ్యూనిస్టు ఉద్య‌మ నాయ‌కుడు. కొంద‌రు ఆయ‌న మావోయిస్టుల‌తోనూ ప‌నిచేశార‌ని చెప్పుకొనేవారు. దీనిని ఆయ‌న కూడా దృవీక‌రించారు. అయితే.. వారి విధానాలు న‌చ్చ‌క‌.. తాను ప్ర‌జ‌ల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌రిటాల ర‌వి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ‌లో ఆయ‌న‌పై ప‌లు మార్లు హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హైద‌రాబాద్‌లో ఓ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలోనూ ప‌రిటాల ల‌క్ష్యంగా కారు బాంబు పేలిన విష‌యం తెలిసిందే.

ఇక‌, 2005లో ప‌రిటాల దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాగా.. 18 ఏళ్ల త‌ర్వాత‌.. ఈ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌కు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఏ-3 నారాయ‌ణ రెడ్డి, ఏ-4 రేఖ‌మ‌య్య‌, ఏ-5 రంగ‌నాయ‌కులు, ఏ-6 వ‌డ్డే కొండ‌, ఏ-7 ఓబిరెడ్డిల‌కు తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వీరు అప్ప‌టి నుంచి జైల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. 2005 నుంచి కూడా కేసు విచార‌ణ ఆశించిన విధంగా ముందుకు సాగ‌క‌పోవ‌డం.. సుదీర్ఘ కాలం విచార‌ణ ఖైదీలుగా ఉండ‌డంతో హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2005, జనవరి 24న‌ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల‌తో ప‌రిట‌ల ర‌వి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మానికి అనేకమంది సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. అప్ప‌టికే త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందని గ్ర‌హించిన ర‌వి భారీ ఎత్తున సెక్యూరిటీని కూడా నియ‌మించుకున్నారు. పార్టీ ఆఫీసులోనే మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విపై కొంద‌రు దుండ‌గులు బులెట్ ల వర్షం కురిపించారు. పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ర‌వి దారుణ హ‌త్య అప్ప‌ట్లో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి రేపింది. అయితే.. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 18, 2024 10:05 pm

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

17 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago