Political News

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ్యూనిస్టు ఉద్య‌మ నాయ‌కుడు. కొంద‌రు ఆయ‌న మావోయిస్టుల‌తోనూ ప‌నిచేశార‌ని చెప్పుకొనేవారు. దీనిని ఆయ‌న కూడా దృవీక‌రించారు. అయితే.. వారి విధానాలు న‌చ్చ‌క‌.. తాను ప్ర‌జ‌ల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌రిటాల ర‌వి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ‌లో ఆయ‌న‌పై ప‌లు మార్లు హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హైద‌రాబాద్‌లో ఓ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలోనూ ప‌రిటాల ల‌క్ష్యంగా కారు బాంబు పేలిన విష‌యం తెలిసిందే.

ఇక‌, 2005లో ప‌రిటాల దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాగా.. 18 ఏళ్ల త‌ర్వాత‌.. ఈ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌కు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఏ-3 నారాయ‌ణ రెడ్డి, ఏ-4 రేఖ‌మ‌య్య‌, ఏ-5 రంగ‌నాయ‌కులు, ఏ-6 వ‌డ్డే కొండ‌, ఏ-7 ఓబిరెడ్డిల‌కు తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వీరు అప్ప‌టి నుంచి జైల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. 2005 నుంచి కూడా కేసు విచార‌ణ ఆశించిన విధంగా ముందుకు సాగ‌క‌పోవ‌డం.. సుదీర్ఘ కాలం విచార‌ణ ఖైదీలుగా ఉండ‌డంతో హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2005, జనవరి 24న‌ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల‌తో ప‌రిట‌ల ర‌వి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మానికి అనేకమంది సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. అప్ప‌టికే త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందని గ్ర‌హించిన ర‌వి భారీ ఎత్తున సెక్యూరిటీని కూడా నియ‌మించుకున్నారు. పార్టీ ఆఫీసులోనే మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విపై కొంద‌రు దుండ‌గులు బులెట్ ల వర్షం కురిపించారు. పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ర‌వి దారుణ హ‌త్య అప్ప‌ట్లో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి రేపింది. అయితే.. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 18, 2024 10:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

5 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago