Political News

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన క‌మ్యూనిస్టు ఉద్య‌మ నాయ‌కుడు. కొంద‌రు ఆయ‌న మావోయిస్టుల‌తోనూ ప‌నిచేశార‌ని చెప్పుకొనేవారు. దీనిని ఆయ‌న కూడా దృవీక‌రించారు. అయితే.. వారి విధానాలు న‌చ్చ‌క‌.. తాను ప్ర‌జ‌ల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌రిటాల ర‌వి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ‌లో ఆయ‌న‌పై ప‌లు మార్లు హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. హైద‌రాబాద్‌లో ఓ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలోనూ ప‌రిటాల ల‌క్ష్యంగా కారు బాంబు పేలిన విష‌యం తెలిసిందే.

ఇక‌, 2005లో ప‌రిటాల దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాగా.. 18 ఏళ్ల త‌ర్వాత‌.. ఈ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు వ్య‌క్తుల‌కు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఏ-3 నారాయ‌ణ రెడ్డి, ఏ-4 రేఖ‌మ‌య్య‌, ఏ-5 రంగ‌నాయ‌కులు, ఏ-6 వ‌డ్డే కొండ‌, ఏ-7 ఓబిరెడ్డిల‌కు తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వీరు అప్ప‌టి నుంచి జైల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. 2005 నుంచి కూడా కేసు విచార‌ణ ఆశించిన విధంగా ముందుకు సాగ‌క‌పోవ‌డం.. సుదీర్ఘ కాలం విచార‌ణ ఖైదీలుగా ఉండ‌డంతో హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2005, జనవరి 24న‌ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల‌తో ప‌రిట‌ల ర‌వి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మానికి అనేకమంది సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అంతేకాదు.. అప్ప‌టికే త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందని గ్ర‌హించిన ర‌వి భారీ ఎత్తున సెక్యూరిటీని కూడా నియ‌మించుకున్నారు. పార్టీ ఆఫీసులోనే మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని బ‌య‌ట‌కు వ‌చ్చిన ర‌విపై కొంద‌రు దుండ‌గులు బులెట్ ల వర్షం కురిపించారు. పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ర‌వి దారుణ హ‌త్య అప్ప‌ట్లో రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర అల‌జ‌డి రేపింది. అయితే.. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 18, 2024 10:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

16 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago